Latest Updates
-
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.!
తెల్లని బియ్యపు అన్నం కలిగించే హాని..... !

తెల్లటి బియ్యం బదులుగా బ్రౌన్ రైస్, లేదా ఇతర గింజధాన్యాలు తింటే షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలు మూడొంతులు తగ్గుతాయన్నారు. తెల్లటి అన్నం రక్తంలో షుగర్ స్ధాయి పెంచేస్తుందని, బ్రౌన్ రైస్ లేదా ఇతర గింజ ధాన్యాల ఆహారం క్రమేణా మెల్లగా ఎనర్జీలను వదిలి రక్తంలోని షుగర్ స్ధాయిని సాధారణంగా వుంచుతాయన్నారు. వీరు చేసిన పరిశోధనలో షుమారు రెండు లక్షలమంది అమెరికన్లను వినియోగించారు. వారానికి 150 గ్రాముల తెల్లని అన్నం తినే వారిలో 17 శాతం డయాబెటీస్ అధికంగా వచ్చే అవకాశం వున్నట్లు తేలింది. డయాబెటీస్ నిరోధించాలంటే, తాజా పండ్లు, కూరగాయలు, తక్కువ కొవ్వు వుండే ఆహారాలు, తక్కువ షుగర్ ఆహారాలు చక్కని పరిష్కారమని డా. విక్టోరియా కింగ్ డయాబెటీస్, ఇంగ్లాండ్ సంస్ధ తెలిపింది.
ప్రధానంగా మనం తినే ఆహారం ఎటువంటిదనేది శ్రధ్ధ పెట్టాలని తెల్లని అన్నంలో అధికమైన గ్లైసీమిక్ ఇండెక్స్ వుందని అది ఒక్కసారిగా ఎనర్జీని రక్తంలోకి వదిలేసి షుగర్ స్ధాయి పెంచుతుందని వీరు వెల్లడించారు. ఇప్పటికే అమెరికా, ఇంగ్లాండ్ దేశాలలో షుమారు 70 శాతం తెల్లటి అన్నం తింటున్నారని దీనిని బ్రౌన్ రైస్ లేదా గింజ ధాన్యాల ఆహారంతో మార్పు చేస్తే టైప్ 2 డయాబెటీస్ రాకుండా వుంటుందని పరిశోధకులు రుజువు చేసినట్లు లండన్ లోని డైలీ డయాబెటీస్ న్యూస్ ఇన్ సైడర్ జర్నల్ పేర్కొంది.
అయితే, దంపుడు బియ్యంలో పీచు ఎక్కువగా ఉంటుంది. తక్కువ మోతాదులో బ్రాన్ నూనె కూడా ఉంటుంది. తవుడు నుంచి తయారైన నూనెలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ ఎక్కువ మోతాదులో ఉంటాయి. అందుకే కేవలం అన్నంగా కాకుండా బియ్యాన్ని ఇతర రూపాల్లో కూడా వినియోగించడానికి ప్రయత్నించాలి. పిల్లలకు బియ్యంతో పాయసం చేసి పెట్టవచ్చు. బియ్యప్పిండి, బియ్యపురవ్వలతో పిండి వంటలు చేసి వారికి చిరుతిండిగా పెట్టవచ్చు. కొనిపెట్టే ఫాస్ట్ఫుడ్లకంటే ఇవి ఎంతో మేలు కదా! ఇక పెద్ద వారు ఈ దంపుడు లేదా ముడి బియ్యం వంటివి ఎంత తిన్నా షుగర్ వ్యాధి ఆమడ దూరం అనే చెప్పాలి! మరి నేటినుండే ముడి బియ్యం తినటం ఆచరిద్దామా?
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications