Latest Updates
-
ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. ప్రకృతి స్ఫూర్తితో భవిష్యత్తు కోసం ఒక్కటవుదాం.! -
ఎండదెబ్బతో పెదవులకి ఫీవర్.. సాఫ్ట్గా, గులాబీ రంగులోకి మారాలంటే ఇలా చేయండి.! -
రామ్ చరణ్ భార్య ఉపాసన ఫేవరెట్ ఫుడ్ ఇదే..ఈ హెల్తీ ఫుడ్ ని మీ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పోషకాల గని.. గోదావరి జిల్లాల స్పెషల్ ‘తోటకూర కాడల పులుసు’.. ఎలా చేయాలంటే.! -
అన్నీ ఇచ్చాక కూడా ప్రేమ మారిపోయిందా? దానికి కారణం మీరు కాదు -
మహిళల్లో పెరుగుతున్న బ్రెస్ట్ క్యాన్సర్.. ఈ 4 ఫ్రూట్స్తో ప్రమాదాన్ని అరికట్టొచ్చా.? -
జూన్ 5, 2026: గ్రహాల కటాక్షంతో ఈ రాశుల వారికి అదృష్టం, ధనయోగం ఖాయం! -
ఎలాంటి విషాన్నైనా మింగేస్తుంది.. ఆరోగ్యానికి సంజీవని నేరేడు పండ్ల ప్రయోజనాలు తెలుసా.! -
రొటీన్ కాఫీకి గుడ్ బై చెప్పండి.. ఈ టేస్టీ అండ్ హెల్తీ బనానా కాఫీ ట్రై చేయండి! -
జూన్ 5న సర్వార్థ సిద్ధి యోగం.. ఈ పనులు చేస్తే మీ కెరీర్, బిజినెస్ లో తిరుగుండదు!
తెల్లని బియ్యపు అన్నం కలిగించే హాని..... !

తెల్లటి బియ్యం బదులుగా బ్రౌన్ రైస్, లేదా ఇతర గింజధాన్యాలు తింటే షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలు మూడొంతులు తగ్గుతాయన్నారు. తెల్లటి అన్నం రక్తంలో షుగర్ స్ధాయి పెంచేస్తుందని, బ్రౌన్ రైస్ లేదా ఇతర గింజ ధాన్యాల ఆహారం క్రమేణా మెల్లగా ఎనర్జీలను వదిలి రక్తంలోని షుగర్ స్ధాయిని సాధారణంగా వుంచుతాయన్నారు. వీరు చేసిన పరిశోధనలో షుమారు రెండు లక్షలమంది అమెరికన్లను వినియోగించారు. వారానికి 150 గ్రాముల తెల్లని అన్నం తినే వారిలో 17 శాతం డయాబెటీస్ అధికంగా వచ్చే అవకాశం వున్నట్లు తేలింది. డయాబెటీస్ నిరోధించాలంటే, తాజా పండ్లు, కూరగాయలు, తక్కువ కొవ్వు వుండే ఆహారాలు, తక్కువ షుగర్ ఆహారాలు చక్కని పరిష్కారమని డా. విక్టోరియా కింగ్ డయాబెటీస్, ఇంగ్లాండ్ సంస్ధ తెలిపింది.
ప్రధానంగా మనం తినే ఆహారం ఎటువంటిదనేది శ్రధ్ధ పెట్టాలని తెల్లని అన్నంలో అధికమైన గ్లైసీమిక్ ఇండెక్స్ వుందని అది ఒక్కసారిగా ఎనర్జీని రక్తంలోకి వదిలేసి షుగర్ స్ధాయి పెంచుతుందని వీరు వెల్లడించారు. ఇప్పటికే అమెరికా, ఇంగ్లాండ్ దేశాలలో షుమారు 70 శాతం తెల్లటి అన్నం తింటున్నారని దీనిని బ్రౌన్ రైస్ లేదా గింజ ధాన్యాల ఆహారంతో మార్పు చేస్తే టైప్ 2 డయాబెటీస్ రాకుండా వుంటుందని పరిశోధకులు రుజువు చేసినట్లు లండన్ లోని డైలీ డయాబెటీస్ న్యూస్ ఇన్ సైడర్ జర్నల్ పేర్కొంది.
అయితే, దంపుడు బియ్యంలో పీచు ఎక్కువగా ఉంటుంది. తక్కువ మోతాదులో బ్రాన్ నూనె కూడా ఉంటుంది. తవుడు నుంచి తయారైన నూనెలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ ఎక్కువ మోతాదులో ఉంటాయి. అందుకే కేవలం అన్నంగా కాకుండా బియ్యాన్ని ఇతర రూపాల్లో కూడా వినియోగించడానికి ప్రయత్నించాలి. పిల్లలకు బియ్యంతో పాయసం చేసి పెట్టవచ్చు. బియ్యప్పిండి, బియ్యపురవ్వలతో పిండి వంటలు చేసి వారికి చిరుతిండిగా పెట్టవచ్చు. కొనిపెట్టే ఫాస్ట్ఫుడ్లకంటే ఇవి ఎంతో మేలు కదా! ఇక పెద్ద వారు ఈ దంపుడు లేదా ముడి బియ్యం వంటివి ఎంత తిన్నా షుగర్ వ్యాధి ఆమడ దూరం అనే చెప్పాలి! మరి నేటినుండే ముడి బియ్యం తినటం ఆచరిద్దామా?
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications