Latest Updates
-
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా? -
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే..
డయాబెటిక్ పేషెంట్స్ చేసే ఈ తప్పులతో షుగర్ పెరుగుతుంది, జాగ్రత్త!
డయాబెటిస్.. అదో దీర్ఘకాలిక అనారోగ్య పరిస్థితి. వచ్చిందంటే అంత ఈజీగా పోదు. చాలా మందికి అస్సలే పోదు. జీవితాంతం దానిని భరిస్తూనే ఉండాలి. మధుమేహాన్ని నిర్వహించడానికి రక్తంలో చక్కెర స్థాయిలను వీలైనంత సాధారణ స్థాయికి దగ్గరగా ఉంచుకోవడం కీలకం. మందులు తీసుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం లాంటి చర్యలతో బ్లడ్ షుగర్ ను కంట్రోల్ లో ఉంచుకోవచ్చు.
అయితే డయాబెటిక్ పేషెంట్లు చేసే కొన్ని తప్పుల వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దీని వల్ల వ్యాధి తీవ్రత పెరిగి సమస్యలు చుట్టు ముడతాయి. ఆ తప్పులు ఏమిటో వాటిని ఎలా నియంత్రణలో ఉంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వైద్యులు సూచించినట్లుగా మందులు వేసుకోకపోవడం:
వైద్యుల సూచనల మేరకు మందులు వాడటం చాలా కీలకం. మోతాదు మించినా, తగ్గించినా దాని వల్ల సమస్యలు తప్పవు. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం:
మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన ఆహారంలో పుష్కలంగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర పానీయాలు, అనారోగ్యకరమైన కొవ్వులు తీసుకోవడాన్ని పరిమితం చేయాలి.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయకపోవడం:
వ్యాయామం చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. వారంలో ఆరు రోజులు రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి.
తగినంత నిద్రపోకపోవడం:
తగినంత నిద్ర లేకపోయినా, శరీరం ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. రోజూ తప్పనిసరిగా 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలి.
ధూమపానం:
ధూమపానం రక్త నాళాలను దెబ్బతీస్తుంది. శరీరం ఇన్సులిన్ను వాడటాన్ని కష్టతరం చేస్తుంది. మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే ధూమపానం చేయడాన్ని మానేయాలి.
బ్లడ్ షుగర్ నిర్వహణకు చిట్కాలు:
- రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి వైద్యుల సూచనల మేరకు మందులు తీసుకోవాలి, సమతుల్య ఆహారం తినాలి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
- తరచూ రక్తంలో చక్కెర స్థాయిలను తనిఖీ చేసుకోవాలి. సురక్షితమైన స్థాయిలోనే చక్కెర స్థాయి ఉన్నట్లు నిర్ధారించుకోవాలి.
- రక్తంలో చక్కెర స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటే, మందులు తీసుకోవాలి. తరచూ చిరుతిండి తినాలి.
Disclaimer: ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications