పండ్లు, కూరలు తింటే కేన్సర్ మాయం!

By B N Sharma

Fruit, Veggies cut Cancer Risk!
పండ్లు, కూరగాయలు తినటం ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిలో మనిషి శరీరానికి అవసరమైన ఎన్నో పోషక విలువలు వుంటాయి. ప్రతిరోజూ తాజా పండ్లు, కూరలు తినే వారికి సాధారణంగా ఎటువంటి అనారోగ్యాలు కలుగవు. మానవుడి ఆహారంలో పండ్లు, కూరగాయలు ప్రాచీనకాలంనుండి ప్రధానపాత్ర వహిస్తున్నాయి. లక్షలాదిమంది ప్రజలు పండ్లు, కూరగాయలు తినటానికి ప్రాధాన్యతనివ్వరు. దీనితో వీరికి కేన్సర్ వంటి మొండి రోగాలు అనారోగ్యం వచ్చే అవకాశం వుంటుందని ఒక తాజా సర్వే తెలుపుతోంది.

బ్రిటన్ దేశంలో నిర్వహించిన ఒక సర్వేలో అక్కడి ప్రజలలో ప్రతి అయిదుగురిలో ఒకరు మాత్రమే పండ్లు , కూరగాయలు సిఫార్సు చేసిన స్ధాయిలో తింటున్నట్లు ప్రపంచ కేన్సర్ పరిశోధనా సంస్ధ తెలిపినట్లు రీసెర్చి వెల్లడించింది. వృక్ష సంపద ఆహారమైన గింజలు, ధాన్యాలు, పండ్లు, కూరగాయలు కేన్సర్ రిస్కు తగ్గిస్తాయని, వీటిని తరచుగాను అధికంగాను లేదా సిఫార్సు చేసిన స్ధాయిలో కనుక తింటే వారికి ఏ రకమైన కేన్సర్ వచ్చే అవకాశం లేదని రీసెర్చర్లు తెలిపారు. పీచు అధికంగా వుండే ఆహారాలు, పేగు కేన్సర్ నివారణకు కూడా తోడ్పడతాయని సంస్ధ పరిశోధకులు కాటే మెండోజా వెల్లడించినట్లు డెయిలీ ఎక్స్ ప్రెస్ ప్రచురించింది.

కేన్సర్ అరికట్టే వారోత్సవం సందర్భంగా వీరు షుమారు 2,128 మంది వ్యక్తులను పరిశోధించారు. బ్రిటన్ దేశ జనాభాలో షుమారు 22 శాతం మంది రోజుకు అయిదు లేదా అంతకుమించిన పండ్లు, కూరగాయలు తింటే వారిలో 17 శాతం మంది మాత్రమే దిగువ ఆదాయవర్గాలవారు వీటిపై తమ సొమ్ము వెచ్చిస్తున్నట్లు తెలిపారు.

ఉత్తర ఇంగ్లాండ్ దేశంలో అయితే, పండ్లు, కూరల వాడకం మరింత తక్కువగా వుందట. ఈ ప్రాంత ప్రజలలో షుమారు 18 శాతంమంది మాత్రమే వీటిని తింటున్నారని సర్వే చెపుతోంది. అయితే, దక్షిణ ఇంగ్లాండ్ దేశ ప్రజలు మాత్రం 26 శాతంగా అయిదు భాగాల పండ్లు, కూరగాయలను తింటున్నట్లు తెలిపారు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Monday, May 21, 2012, 10:43 [IST]
Desktop Bottom Promotion