Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
వర్షాకాలంలో పెరుగు తింటున్నారా? ఈ సమస్యలతో జాగ్రత్త!
పెరుగులోని ప్రోబయోటిక్స్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. చాలా మంది భోజనం చివర్లో తప్పకుండా పెరుగుతో కొంత మొత్తంలోనైనా అన్నం తింటారు. వెజ్, నాన్-వెజ్ ఏది తిన్నా.. కాస్తంత పెరుగుతింటేనే చాలా మందికి సంతృప్తిగా ఉంటుంది. అయితే ఎండాకాలంలో పెరుగు, పెరుగుతో చేసిన మజ్జిగ తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని తెలిసిందే.

అయితే ప్రస్తుతం వర్షాకాలం మొదలైంది. ఈ సమయంలో పెరుగు వాడకం సాధారణంగా తగ్గుతుంది. ఇంట్లో పెద్దలు కూడా వర్షాకాలంలో పెరుగు తినకూడదని అంటుంటారు. ఆయుర్వేదం ప్రకారం కూడా వానాకాలంలో పెరుగు తినడం వల్ల వాతా, పిత్త, కఫా దోషాలని ఒకేసారి ప్రభావితం చేస్తుంది. దీని వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతుంటారు ఆయుర్వేద నిపుణులు.
రోగనిరోధక శక్తి తగ్గుతుంది
ఆయుర్వేదం ప్రకారం వర్షాకాలంలో పెరుగు వంటి చల్లని శక్తి కలిగిన ఆహారాలు తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ తగ్గుతుంది. వర్షాకాలంలో చల్లని ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే ఒంట్లో శ్లేష్మం ఏర్పడుతుంది. అలాగే పేగు ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది. దాంతో పాటు పలు రకాల అలెర్జీలు కూడా కొంత మందిలో కనిపించే అవకాశాలు ఉన్నాయి.
శ్వాసకోశ సమస్యలు
వానాకాలంలో పెరుగు తినడం వల్ల శరీరంలో శ్లేష్మం ఎక్కువవుతుంది. దీని వల్ల జలుబు, దగ్గు, ఇతర శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే కొందరిలో పెరుగు తినడం వల్ల అలెర్జీలు కూడా రావొచ్చు.
జీర్ణ సమస్యలు
ఆయుర్వేదం ప్రకారం పెరుగుకు చల్లటి శక్తి ఉంటుంది. దీని వల్ల జీర్ణాశయంలోని మంట తగ్గుతుంది. దీని వల్ల అన్నం అరుగుదల సరిగ్గా లేక అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం లాంటి జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు పెరుగులో రెండు, మూడు ఎండుమిర్చిలు, కాస్తంత వేయించిన జీలకర్ర, తేనెకలపడం వల్ల ఈ జీర్ణ సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.
మరి పెరుగు ఎప్పుడు తింటే మంచిది?
పెరుగు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులోని ప్రోబయోటిక్స్ పలు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. పెరుగులోని ఈస్ట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మిగతా రోజుల్లో పెరుగు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. దీని వల్ల రోగాలు దాడి చేసినా మన ఇమ్యూనిటీ సమర్థవంతంగా పోరాడగలుగుతుంది. అలాంటి పెరుగును భోజనం చివరలో తినకపోతే చాలా మందికి సంతృప్తిగా అనిపించదు. కొన్ని ముద్దలైనా పెరుగు అన్నం తిననిదే చాలా మంది భోజనాన్ని పూర్తి చేయరు.
అలాంటి వారు వర్షాకాలంలో పెరుగు తీసుకోవాలనుకుంటే.. పెరుగులో కొన్ని వేయించిన ఎండుమిర్చి, జీలకర్ర, నల్ల మిరియాలు, నల్ల ఉప్పు లాంటివి జోడించుకోవాలి. అలాగే కొద్దిగా తేనె కలిపిన పెరుగు తిన్నా పెరుగులోని ప్రయోజనాలు శరీరానికి అందుతాయి. అయితే పెరుగుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. ఎక్కువగా తీసుకుంటే మైగ్రేన్ వంటి తలనొప్పి సమస్యలు ఎదురవుతాయి. బయోజెనిక్ అమైన్ వల్ల ఇలా జరుగుతుంది.
Disclaimer: ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications