Latest Updates
-
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు! -
సూర్యగ్రహణం 2026..గ్రహణానికి ముందు, తర్వాత చేయాల్సిన పనులివే! -
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే! -
డెలులు డేటింగ్.. మీరూ ఇలాంటి భ్రమల్లో బతుకుతున్నారా.? -
పెనంపైనే రెస్టారెంట్ స్టైల్ లో.. దూదిలాంటి మెత్తని గార్లిక్ నాన్ చేసేయండిలా! -
మీ కళ్ల ముందే ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే ఏం చేయాలి?
చలికాలంలో వేడి నీళ్లతో స్నానం చేస్తున్నారా.. అయితే ఈ రోగాలు రావడం పక్కా!
చలికాలంలో చలి నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేస్తుంటారు. సాధారణం కంటే ఎక్కువ వేడి కలిగిన నీటితో స్నానం చేసేందుకు ఇష్టపడుతుంటారు. వెచ్చగా ఫీల్ అవ్వడానికి వేడి నీటిలోనే ఉండాలని అనుకుంటూ ఉంటారు. అయితే అత్యధికంగా వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల అనేక సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చర్మ సంబంధిత సమస్యలు కూడా వస్తాయని పేర్కొంటున్నారు. వేడి నీటితో స్నానం చేయడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
చర్మం పొడిగా మారుతుంది..
సాధారణంగా చలికాలంలో చర్మం పొడిగా మారుతుంది. గాలిలో తేమ తక్కువగా ఉండడం వల్ల చర్మం పొడిగా మారడంతో పాటు, పగిలిపోతుంటుంది. అయితే చలికాలంలో అధిక వేడి కలిగిన నీటితో స్నానం చేయడం వల్ల చర్మం డీహైడ్రేటెడ్గా మారుతుంది. దీని వల్ల చర్మం పొడిగా మారడంతో పాటు పగిలిపోతుంటుంది. అందుకే చలికాలంలో వేడి నీటితో స్నానం చేయడానికి బదులు, గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం మేలు.

ఇన్ఫెక్షన్స్, దురద
అధిక వేడి నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలో సేబమ్ ఉత్పత్తికి ఆటంకం కలుగుతుంది. దీని కారణంగా శరీరంలో సహజమైన నూనె ఉత్పత్తి తగ్గిపోతుంది. దీని వల్ల చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. చర్మంపై దురద, ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. పైగా చర్మం పొడిగా మారడంతో రంగు కూడా మారిపోయే ప్రమాదం ఉంది.
ఈ సమస్యలు తీవ్రత మరింత అధికం
వేడి నీటితో స్నానం చేయడం వల్ల.. ఇప్పటికే సోరియాసిస్, ఎగ్జేమా, రోసాసియాలాంటి చర్మ సమస్యలతో బాధ పడుతున్న వ్యక్తులకు మరింత సమస్యగా మారుతుంది. చర్మం సహజసిద్ధమైన ఆయిల్స్ కోల్పోయి మరింత ప్రమాదకరంగా మారే ఛాన్సుంటుంది.
జుట్టు కూడా రాలుతుంది..
వేడి నీటితో తల స్నానం చేయడం వల్ల జుట్టుకు కూడా సమస్యలు వస్తాయి. జుట్టు బలహీనంగా మారడంతో పాటు వేగంగా రాలిపోతుంటుంది. జట్టులోని సహజసిద్ధమైన మెరుపు, తేమ ఉండకపోవచ్చు. వేడి నీటితో స్నానం చేయడం వల్ల జట్టులోని కెరాటిన్, లిపిడ్ దెబ్బతిని జుట్టును బలహీనపరుస్తాయి. క్రమంగా జుట్టును పట్టుకున్నా రాలిపోయే ప్రమాదం ఉంది.
గోరువెచ్చని నీరు అయితే ఒకే..
ఎక్కువగా వేడిగా ఉన్న నీటితో కాకుండా గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల ఈ సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. గోరు వెచ్చని నీటితో స్నానం చేసినప్పటికీ పది నిమిషాలకు మించి చేయకూడదు. అలాగే స్నానం చేసిన వెంటనే శరీరానికి హైడ్రేటింగ్ క్రీమ్స్ వినియోగించాలి. దీని వల్ల చర్మంలోని తేమ అక్కడే ఉంటుంది. చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. వీలైతే చలికాలంలో కూడా చల్లని నీటితో స్నానం చేయడం మంచిదే.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications