Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
Jamun: నేరేడు పండ్లు తిన్న వెంటనే ఇవి అస్సలు తీసుకోకూడదు..విషంతో సమానమే!
సమ్మర్ లో మామిడికాయలతో పాటుగా లభించే మరో ఆరోగయకరమైన పండు నేరుడుకాయ. దీనిని ఇండియన్ బ్లాక్ బెర్రీ అని కూడా పిలుస్తుంటారు. నేరేడు పండు.. తీపి,పులుపు, కొద్దిగా వగరు యరుచుల సమ్మేళనంతో ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుంది. ఇది కేవలం రుచికి మాత్రమే కాకుండా అనేక ఔషధ గుణాలకు కూడా ప్రిసిద్ధి చెందింది. నేరేడు పండులో పొటాషియం, విటమిన్ సీ, మెగ్నీషియం, కాల్సియం, ఐరన్, ఫాస్పరస్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. కాబట్టి ఈ పండు తినడం ద్వారా మన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది.
అయితే నేరేడు పండు తిన్న వెంటనే కొన్ని ఆహారపదార్థాల జోలికి వెళ్లకూడదు. నేరేడు పండు ఆరోగ్యానికి చాలా మంచిది అయినప్పటికీ కొన్ని ఆహార పదార్థాలను దానితో కలిపి లేదా తిన్న వెంటనే తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలా చేయడం వల్ల జీర్ణ సమస్యలు లేదా ఇతర అనారోగ్యాలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి నేరేడు పండు తిన్న వెంటనే తీసుకోకూడని ఆహారాలు ఏంటో ఇక్కడ చూడండి.

పాలు,పాల ఉత్పత్తులు
నేరేడు పండ్లు తిన్న వెంటనే పాలు,టీ వంటి అస్సలు తీసుకోకూడదు. నేరేడు పండులో ఉండే ఆమ్ల గుణాలు పాలతో కలిసినప్పుడు విరుద్ధంగా పనిచేస్తాయి. ఇది జీర్ణక్రియను నెమ్మదింపజేస్తుంది..దీనివల్ల గ్యాస్, అజీర్ణం, మలబద్దకం,కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి నేరేడు పండు తిన్న తర్వాత కనీసం అరగంట నుండి ఒక గంట సమయం ఆగి పాలు లేదా పాల ఉత్పత్తులను తీసుకోవడం మంచిది.
చాలామందికి తెలియని రహస్యం
చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే నేరేడు పండు తిన్న వెంటనే నీళ్లు కూడా తాగకూడదు. నేరేడు పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం పడి విరేచనాలు లేదా అజీర్ణం వంటి సమస్యలు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి నేరేడు పండు తిన్న తర్వాత 30 నుండి 40 నిమిషాల వరకు నీళ్లు తాగకుండా ఉండటం మంచిది.
ఖాళీ కడుపుతో తినకూడదు
నేరేడు పండులో టానిక్ ఆమ్లం, ఆక్సాలిక్ ఆమ్లం వంటివి ఉండటం వల్ల ఖాళీ కడుపుతో తింటే కడుపులో గ్యాస్,అసిడిటీ, మంట లేదా వికారం, వాంతులు వంటి సమస్యలు రావచ్చు. ఉదయం అల్పాహారం తర్వాత లేదా భోజనం చేసిన కొన్ని గంటల తర్వాత నేరేడు పండ్లను తినడం మంచిది.

స్పైసీ ఫుడ్స్
నేరేడు పండ్లు తిన్న తర్వాత స్పైసీ ఫుడ్స్ అంటే కారం ఎక్కువగా ఉండే ఆహారాలు లేదా చిప్స్ వంటి జంక్ ఫుడ్ అస్సలు తీసుకోకూడదు. పొరపాటున తీసుకున్నారంటే అది విషంతో సమనమే.
ఊరగాయలు
నేరేడు పండ్లు తిన్న తర్వాత ఊరగాయలను తినడం మంచిది కాదు. ఊరగాయలలో సాధారణంగా ఎక్కువ నూనె, మసాలాలు, ఆమ్లాలు వెనిగర్ వంటివి ఉంటాయి. ఇవి నేరేడు పండుతో కలిసినప్పుడు కడుపులో గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలను పెంచుతాయి. కాబట్టి నేరేడు పండ్లు తిన్న తర్వాత ఊరగాయలు తినాలనుకుంటే కనీసం ఒక గంట పాటు వేచి ఉండాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications