Latest Updates
-
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.!
సమోసాలు, జిలేబీలపై హెచ్చరికలు..ఊబకాయంపై కేంద్రం కొత్త అస్త్రం?
జిలేబీ,సమోసా అంటే ఇష్టపడనివాళ్లు ఎవరూ ఉండరు. ఆఫీసుల్లో,ఫ్యాక్టరీల్లో పనిచేసే చాలామంది ఉద్యోగులు బ్రేక్ సమయంలో లేదా టీ బ్రేక్ సమయంలో సమోసా తినే అలవాటు ఉంటుంది. ఇక ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే జిలేబీ గుర్తుకొస్తు్ది. నోరూరిపోయే వీటి రుచికి ఎవరైనా ఫిదా అయిపోతారు. రాజస్తాన్,యూపీ,మధ్యప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాల్లో అయితే పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ లోకి సమోసా,జిలేబీ తింటుంటారు. అయితే ఇకపై వీటిని తినాల్సిందే ఓ నిమిషం ఆలోచించాల్సిందే. మనలో చాలామందికి ఇష్టమైన తినుబండారాలైన సమోసా,జిలేబీపై కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందంటూ ఓ వార్త విపరీతంగా వైరల్ అవుతుంది.
మనదేశంలో ఊబకాయం బారిన పడుతున్న వాళ్ల సంఖ్య క్రమంగా పెరిగిపోతుంది. దీని కారణంగా అనేక అనారోగ్యాలు చట్టుముడుతున్నాయి. ఇటీవల కాలంలో ప్రధాని మోదీ కూడా ఊబకాయం తగ్గించుకోడానికి ఆయిల్ వాడకం తగ్గించుకోవాలని అనేక రకాల టిప్స్ తరచూ సూచిస్తున్నారు. అనేక ఫ్లాట్ ఫామ్ లపై దీని గురించి మాట్లాడుతూ ఫిట్ గా ఉండాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది మోదీ సర్కార్. సమోసా,జిలేబీ ఊబకాయానికి ప్రధాన కారణంగా ఉంటున్నాయంటూ కేంద్ర ప్రభుత్వం వీటిపై సిగరెట్ ప్యాకెట్ల తరహాలో ఆరోగ్య హెచ్చరికలు తప్పనిసరి చేసిందని ఆ వైరల్ వార్తలో ఉంది. వేయించిన,చక్కెర అధికంగా ఉండే ఆహారాలు తినడం ఊబకాయాన్ని పోత్సహించడమే కాకుండా అధిక రక్తపోటుకి కారణమవుతుంది..అదేవిధంగా ఇది డయాబెటిస్,గుండె జబ్బులు,కిడ్నీ ఫెయిల్యూర్,బ్రెయిన్ స్ట్రోక్,క్యాన్సర్ కు దారితీస్తుంది.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం..దేశంలోని అన్ని గవర్నమెంట్ క్యాంటీన్లు, తినుబండారాల దుకాణాల్లో సమోసాలు, జిలేబీల వంటి పదార్థాల దగ్గర తప్పనిసరిగా హెచ్చరిక బోర్డులు పెట్టాలి. ఈ బోర్డులపై ఆయా పదార్థాలలో ఎంత నూనె, ఎంత చక్కెర ఉన్నాయో స్పష్టంగా ప్రదర్శించాలి. రోజూ మనం తినే ఈ అల్పాహారంలో ఎంత కొవ్వు దాగి ఉందో ప్రజలకు తెలియజేయడమే ఈ రంగురంగుల పోస్టర్ల ముఖ్య ఉద్దేశం అని వైరల్ అవుతున్న వార్తలో ఎలాంటి వాస్తవం లేదని తేలింది. జిలేబీ,సమోసాపై ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్రం తీసుకోలేదు.
కోట్ల మంది సమస్యగా
భారతదేశంలో ఊబకాయం ఒక నిశ్శబ్ద మహమ్మారిలా విస్తరిస్తోందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంచనాల ప్రకారం 2050 నాటికి మన దేశంలో ఊబకాయుల సంఖ్య 44.9 కోట్లకు చేరుకునే అవకాశముంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications