Latest Updates
-
ఆన్లైన్లో విపరీతంగా ఆభరణాలు కొంటున్నారా.. 'మెరిసే' నగలతో మోయలేని ఆరోగ్య సమస్యలు.! -
మీ భాగస్వామి ఈ విషయాల్లో మీకు దూరంగా ఉంటున్నారా.. ఈ సంకేతాలతో చాలా డేంజర్.! -
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ ! -
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.! -
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.?
వర్షాకాలంలో తినకూడని ఫుడ్స్ ఇవే..పొరపాటున తింటే అస్సాం బండెక్కడమే!
మండే ఎండల నుంచి ఉపశమనాన్నిస్తూ మట్టి వాసనతో మనసును పులకింపజేసే వర్షాకాలం అంటే ఇష్టం ఉండని వారెవరుండరు. చిటపటలాడే వాన చినుకులను చూస్తూ అలా వేడి వేడి పకోడీలు ఓ మంచి మసాలా ఛాయ్ తాగాలనే కోరిక కలగడం సహజమే. కానీ ఈ ఆహ్లాదకరమైన వాతావరణమే అనేక అనారోగ్యాలకు కూడా ఆహ్వానం పలుకుతుందని మీకు తెలుసా? వర్షాకాలంలో గాల్లో తేమ ఎక్కువగా ఉండటం వల్ల బ్యాక్టీరియా, వైరస్ లు వేగంగా వృద్ధి చెందుతాయి. ఈ సమయంలో మనం తీసుకునే ఆహారం విషయంలో కొంచెం అజాగ్రత్తగా ఉన్నా అది నేరుగా మన ఆరోగ్యంపై పెద్ద ప్రభావాన్నే చూపెడుతుంది. కాబట్టి వర్షాకాలంలో కొన్ని ఆహారపదార్థాలు తినకుండా ఉండటం చాలా మంచిది. వర్షాకాలంలో ఏం తినకూడదో ఇక్కడ చూడండి.
ఆకుకూరలు
ఆకుకూరలు అనగానే ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి కదా ఇవి తింటే ప్రమాదేముంది అనుకుంటే పొరబడినట్లే. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆకుకూరలు వర్షాకాలంలో కాస్త ప్రమాదకరం. తేమ, బురద కారణంగా వీటి ఆకులపై సూక్ష్మక్రిములు, కీటకాలు సులభంగా చేరతాయి. ముఖ్యంగా పాలకూర, మెంతికూర వంటివి సరిగ్గా శుభ్రం చేయకుండా తింటే కడుపు నొప్పి, ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. ఒకవేళ తినాలనిపిస్తే మాత్రం వీటిని వేడి నీటిలో బాగా కడిగి పూర్తిగా ఉడికించిన తర్వాతే తినడం మంచిది.

స్ట్రీట్ ఫుడ్
చాలామందికి వాన పడుతుంటే రోడ్డు పక్కన వేడి వేడిగా అమ్మే బజ్జీలు, సమోసాలు చూడగానే నాలుక లాగేస్తుంటది. అయితే వీటి తయారీలో వాడే ఆయిల్ ని పదేపదే వేడి చేయడం, కలుషితమైన నీటిని వాడటం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ రుచులు తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చినా దీర్ఘకాలంలో ఆరోగ్యానికి పెద్ద ముప్పుని కలిగిస్తాయి.
సీ ఫుడ్
వర్షాకాలంలో సముద్రంలో నీరు కలుషితమయ్యే అవకాశం ఎక్కువ. దీనివల్ల సీఫుడ్ ఫ్రెష్ గా ఉండదు.. హానికరమైన బ్యాక్టీరియాతో నిండి ఉంటుంది. కాబట్టి ఈ సీజన్ లో సముద్రపు ఆహారానికి దూరంగా ఉండటమే బెటర్.
కూల్ డ్రింక్స్ కు దూరం
కూల్ డ్రింక్స్, సోడాలు మన జీర్ణవ్యవస్థను బలహీనపరుస్తాయి. ఇవి శరీరంలోని ఖనిజ లవణాలను గ్రహించే శక్తిని తగ్గించి ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలను సృష్టిస్తాయి. వీటికి బదులుగా గోరువెచ్చని హెర్బల్ టీ, నిమ్మరసం లేదా అల్లం టీ తాగడం ఉత్తమం.
పెరుగు, మజ్జిగతో కాస్త జాగ్రత్త
ఎండాకాలంలో అమృతంలా పనిచేసే పెరుగు, మజ్జిగ వర్షాకాలంలో శరీరానికి చలువ చేసి జలుబు, దగ్గు, గొంతు నొప్పికి కారణమవుతాయి. వీటిని పూర్తిగా మానాల్సిన అవసరమేమీ లేదు కానీ మితంగా కేవలం పగటిపూట మాత్రమే తీసుకోవడం ఉత్తమం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications