Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
మటన్లో ప్రాణాలు తీసే బ్యాక్టీరియా.. తింటే ఇక మటాష్.. సంచలన నిజం బయటపెట్టిన సైంటిస్ట్స్
మన దేశంలో చాలా మంది మాంసాహార ప్రియులు ఉంటారు. వారందరూ ఆదివారం వచ్చిందంటే చాలు చికెన్, మటన్ షాపుల ముందు క్యూలు కట్టుకొని నిలబడిపోతారు. అయితే చికెన్, మటన్ తినే వారికి ఆరోగ్య నిపుణులు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వీటిని తినడం వల్ల రోగాల బారిన పడే అవకాశం ఉందని చెబుతున్నారు. వీటిలో మానవులకు హాని చేసే యాంటీ బయోటిక్స్ ఉన్నాయని, ఇవి తినడం వల్ల అనేక రోగాలు వస్తాయని పేర్కొంటున్నారు. అయితే మటన్ తినడం వల్ల ఎలాంటి రోగాలు వస్తాయి? ఎందుకు ఆ ప్రమాదం అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఎందుకు ప్రమాదకరమంటే?
మన దేశంలో చాలా మంది పాడి రైతులు తమ తమ జంతువులను పెంచుకోవడానికి యాంటీ బయోటిక్స్ని వాడుతున్నట్లు తేలింది. కోళ్లను పెంచుకోవడానికి, మేకలను పెంచడానికి యాంటీ బయోటిక్స్ వాడుతున్నట్లు పరిశోధనలో వెల్లడైంది. ఇవి తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. కేజీ మటన్లో 243 మిల్లి గ్రాముల యాంటీ బయోటిక్స్ ఉంటాయని, అదే కిలో చికెన్లో 35 మిల్లి గ్రాముల యాంటీ బయోటిక్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

అలాగే మాంసంలో సిప్రోఫ్లాక్సాసిన్, ఎన్రోఫ్లాక్సాసిన్, డాక్సీసైక్లిన్, స్టెప్టోమైసిన్ వంటి ప్రమాదకరమైన యాంటీ బయోటిక్స్ అవశేషాలను గుర్తించామని వీటిని తింటే కచ్చితంగా మనిషికి ప్రాణాపాయం అని వెల్లడించారు.
ఎలాంటి వ్యాధులు వస్తాయంటే?
యాంటీ బయోటిక్స్ ఉన్న మాంసం తినడం వల్ల మనుషులు అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని చెబుతున్నారు. మాంసం తినడం వల్ల చర్మ సమస్యలతో పాటు అనేక రకాల రోగాలు వస్తాయట. జీర్ణ సంబంధిత సమస్యలు, క్యాన్సర్ సమస్యలు కూడా వస్తాయని పేర్కొంటున్నారు. కొన్ని కొన్ని సందర్భాల్లో మనిషి ప్రాణం కూడా పోయే అవకాశం ఉందని, యాంటీ బయోటిక్స్ అంత ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.
యాంటీ బయోటిక్స్ వేసిన జంతువుల్లో ఆ అవశేషాలు 14 రోజుల పాటు ఉంటాయని, అప్పటి వరకు వాటిని తినకూడదని పేర్కొంటున్నారు. వీటిని తినడం వల్ల అమ్మాయిలు 10 సంవత్సరాల లోపే రసజ్వల బారిన పడుతున్నారని, క్రమంగా వారి ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని పేర్కొంటున్నారు. అందుకే మాంసం తినేటప్పుడు కచ్చితంగా ఒకటిని రెండుసార్లు చూసుకొని తినాలని, మరీ ముఖ్యంగా బాగా ఉడికిన తరువాతే తినాలని పేర్కొంటున్నారు.
ఎందుకు ఈ సమస్యలు
సాధారణంగా వ్యాపారులు తమ వ్యాపారం బాగా జరగాలని చూస్తారు. అందుకు అనుగుణంగానే తమ పెంపకాలకు యాంటీ బయోటిక్స్ ఇస్తున్నారని చెబుతున్నారు. 40 రోజుల్లోనే పెరగాలనే ఉద్దేశంతో వీటిని ఇవ్వడం వల్ల ఇలాంటి రోగాలు వస్తున్నాయని చెబుతున్నారు. అందుకే మాంసం తినేటప్పుడు మంచి మాంసాన్ని ఎంచుకోవాలని పేర్కొంటున్నారు.
గమనిక: ఈ స్టోరీలో మేము చెప్పిందంతా ఇంటర్నెట్లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించడింది. వీటిని మేము కరెక్ట్ అని నిర్ధారించడం లేదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications