Latest Updates
-
అన్నం, పప్పు,పరాఠా, రోటీల్లోకి బెస్ట్ కాంబినేషన్..రాజస్థానీ స్పెషల్ వెల్లుల్లి ఎర్ర మిరప చట్నీ -
ఉగాది స్పెషల్..ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ క్రంచీ బేబీ కార్న్ 65..వాహ్ అనిపించే బెస్ట్ స్టార్టర్! -
గుంటూరు కారం పొడి, చిట్టి ఇడ్లీ..ఇలా చేస్తే ప్లేట్లు ఖాళీ అవ్వాల్సిందే! -
నో గ్యాస్, నో స్టవ్.. నిమిషాల్లో తయారయ్యే కమ్మని పల్లెటూరి రోటి పెరుగు పచ్చడి..ప్లేట్ అన్నం ఖాళీ అవ్వాల్సిందే! -
రోజూ తినే పప్పు బోర్ కొట్టిందా? అయితే ఈ ధాబా స్టైల్ దాల్ తడ్కా ట్రై చేయండి..గిన్నెలు గిన్నెలు లేపేస్తారు! -
తెలుగువారి తొలి పండుగ: ఉగాది 2026 తేదీ, పేరు, ఆచారాలు, సంప్రదాయాలు -
కేవలం 10 నిమిషాల్లో దూదిలాంటి టమాటో సెట్ దోశ.. పప్పు నానబెట్టే పనే లేదు..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్! -
భాగస్వామి సంతృప్తిలో అట్టడుగు స్థానంలో భారత్..మూసిన తలుపుల వెనుక అసలు కథ! -
ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు.. ఇలా చేస్తే పర్ఫెక్ట్ గా వస్తాయి..నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతూ అమృతమే! -
పండిన అరటిపండ్లతో సింపుల్ అండ్ సూపర్ స్వీట్..హెల్తీ బనానా బర్ఫీ ఎలా చేసుకోవాలంటే..
Burundi Mysterious Virus: ఆఫ్రికాలో అంతుచిక్కని వైరస్, ముక్కు నుండి రక్తం కక్కుకుని చనిపోతున్న జనాలు
ఒకదాని తర్వాత మరో వైరస్ ప్రపంచదేశాలను వణికిస్తున్నాయి. కరోనా తర్వాత దాని వేరియంట్లు ఆందోళన కలిగించాయి. ఈ మధ్యే H3N2 ఫ్లూ భయాందోళన కలిగించగా.. ఇప్పుడు మరో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తోంది.
ముక్కు నుండి తీవ్ర రక్తస్రావం:
ఆఫ్రికాలోని బురుండి దేశంలో ఈ కొత్త వైరస్ వ్యాప్తి తీవ్ర ఆందోళనకు దారి తీస్తోంది. అంతుచిక్కని ఈ వైరస్ వల్ల ఇప్పటి వరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

ఈ వైరస్ సోకిన 24 గంటల్లోనే బాధితులు చనిపోయినట్లు బురుండి ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వైరస్ సోకగానే ముక్కు నుండి రక్తం కారడం, తీవ్రమైన తలనొప్పి, జ్వరం, విపరీతమైన వాంతులు లాంటి లక్షణాలు ఉన్నట్టుండి కనిపిస్తున్నాయని అధికారులు చెప్పారు.
మృతులంతా ఒకే తెగకు చెందిన వారు:
బురుండి దేశంలోని బజిరో ప్రాంతంలో ఈ వైరస్ కనిపించింది. ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులు గిటోబ్ అనే తెగకు చెందినవారు. వారు బజిరో ప్రాంతంలోని మిగ్వా కొండ సమీపంలో నివసిస్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ కొత్త వైరస్ బాధితులంతా ఈ ప్రాంతానికి చెందినవారేనని వెల్లడించారు. అప్రమత్తమైన అదికారులు బజిరో పట్టణాన్ని క్వారంటైన్ చేశారు.
మార్బర్గ్ వైరస్పై అనుమానాలు:
ఇటీవల బురుండి దేశ దాయాది దేశమైన టాంజానియాలో మార్ బర్గ్ అనే వైరస్ కనిపించింది. ఈ వైరస్ ముప్పు ఇతర దేశాలకు కూడా పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ- WHO హెచ్చరించింది. ఇప్పుడు బురుండిలో కనిపించిన వైరస్ మార్ బర్గ్ వైరసా అనేది తేలాల్సి ఉంది.
ఈ వైరస్ మొత్తం 8 మందికి వ్యాపించగా అందులో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ వైరస్ కేసులు మొదట ఫిబ్రవరిలో కనిపించాయి. ఆ తర్వాత పశ్చిమ ఆఫ్రికాలోని ఈక్వటోరియల్ గినిమయాలో వెలుగు చూశాయి. గత వారం ఈ కొత్త వైరస్ కు సంబంధించి మరో 8 కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
దక్షిణ టాంజానియాలో గతేడాది ఇదే తరహా వైరస్:
గత ఏడాది జులైలో దక్షిణ టాంజానియాలో ముగ్గురు వ్యక్తులు ఈ నోస్ బ్లీడ్ వైరస్ సోకి చనిపోయారు. ఈ వ్యాధిని పరిశీలించడానికి ప్రస్తుతం వైద్య పరిశోధనా బృందాన్ని పంపారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











