Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
ఈ 5 వైట్ ఫుడ్స్కు వీలైనంత దూరంగా ఉండండి.. ఎందుకో తెలుసా?
ప్రతి మనిషికి చాలా అవసరమైనది, అత్యంత ముఖ్యమైనది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో, మెరుగుపరచుకోవడంలో ఆహారానిదే కీలక పాత్ర. వ్యాయామం ఎంత చేసినప్పటికీ.. సరైన ఆహారం తీసుకోకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆరోగ్యం విషయానికి వస్తే.. చాలా మంది వైద్య నిపుణులు చెప్పే మాట తెలుపు రంగు ఆహారాలకు దూరంగా ఉండాలని. తెల్లని రంగు ఆహారాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల కంటే.. అనార్థాలే ఎక్కువ అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
కొన్ని రకాల వైట్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల క్యాన్సర్, రక్తపోటు, ఎముక ఆరోగ్యం క్షీణించడం, ఎక్కువ కేలరీల వల్ల బరువు పెరగడం, డయాబెటిస్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది.

పాశ్చరైజ్డ్ ఆవు పాలు
పాశ్చరైజేషన్ ప్రక్రియ వల్ల పాలు ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి. కానీ పాలలోని పోషకాలు తొలగిపోతాయి. పాలలోని ఎంజైమ్ లు, విటమిన్ ఏ, బి 12, సి లు తొలగిపోతాయి. ఈ ప్రక్రియ వల్ల హార్మోన్లు, యాంటీబయోటిక్ లు పాలలో చేరుతాయి. పాశ్చరైజేషన్ ప్రక్రియ వల్ల పచ్చి పాలలో ఉండే ప్రయోజనకరమైన బ్యాక్టీరియా నశించిపోతుంది. సహజ ఎంజైమ్ లను చంపుతుంది. ఫాస్పేటేస్ ను నాశనం చేస్తుంది. పిల్లల్లో పెరగుదలపై ప్రభావం చూపిస్తుంది. రోగనిరోధక
రిఫైన్డ్ రైస్
బియ్యాన్ని శుద్ధి చేసే ప్రక్రియ వల్ల బియ్యంపై ఉండే పొర తొలగిపోతుంది. దీని వల్ల బియ్యంపై ఉండే పోషకాలు తొలగిపోతాయి. రిఫైన్డ్ ప్రక్రియతో కేవలం ఎండోస్పెర్మ్ మాత్రమే మిగిలిపోతుంది. ఇందులో అధిక మొత్తంలో స్టార్చ్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను, గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది.
రిఫైన్డ్ షుగర్
చక్కెరలో అధిక మొత్తంలో కేలరీలు ఉంటాయి. చక్కెరలో పోషకాలేవీ ఉండవు. క్యాన్సర్, టైప్-2 డయాబెటిస్, బరువు పెరగడం, కాలేయ వ్యాధులు వంటి అనేక రకాల వ్యాధులకు చక్కెర దోహదం చేస్తుంది. చక్కెర ఫ్రక్టోజ్, గ్లూకోజ్ గా మారుతుంది. ఫ్రక్టోజ్ కాలేయంలో కొవ్వుగా మారుతుంది. ఇది ఇన్సులిన్ పనితీరుపై హానికరమైన ప్రభావం చూపిస్తుంది. ఇది టైప్-2 డయాబెటిస్ కు దారితీస్తుంది.
రిఫైన్డ్ సాల్ట్
ఉప్పు అధికంగా తినడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. బీపీ పెరిగి గుండె సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది. ఉప్పులో ఉండే అయోడిన్ శరీరానికి కావాల్సిన పోషకం. అయితే ఆ ఉప్పును శుద్ధి చేయడం వల్ల అయోడిన్ తొలగిపోయి.. కేవలం ఉప్పు మాత్రమే మిగిలిపోతుంది. అలాంటి ఉప్పు తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయి.
మైదా
మైదా పిండిని వైట్ పాయిజన్ గా పిలుస్తారు పోషకాహార నిపుణులు. బ్రెడ్లు తయారు చేయడంలో, ఫాస్ట్ ఫుడ్స్ లో, ఇంకా చాలా ఉత్పత్తుల్లో మైదాను వాడతారు. గోధుమను రిఫైన్డ్ చేయడం వల్ల అందులోని ఎండోస్పెర్మ్ తొలగిపోయి కేవలం సాధారణ పిండి పదార్థం మిగిలిపోతుంది. ఇందులో ఎలాంటి పోషకాలూ ఉండవు.
Disclaimer: ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications