Latest Updates
-
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి
ఫ్రిజ్ వద్దు,కుండే ముద్దు..మట్టికుండ నీళ్లు తాగితే కలిగే అద్భుత ప్రయోజనాలివే!
మండే ఎండలో నుంచి ఇంటికి రాగానే కుండలోని నీళ్లు ఒక గ్లాసు తాగితే ప్రాణం లేచివచ్చినట్లు ఉంటది. కానీ ఇప్పుడు మనమంతా ఫ్రిజ్ లకు అలవాటు పడ్డాం. దాహాన్ని తీర్చుకోవడానికి ప్లాస్టిక్ బాటిళ్లలో ఉండే ఫ్రిజ్ నీళ్ల వైపు పరుగులు తీస్తున్నాము.
అయితే ఫ్రిజ్ నీటి వల్ల గొంతునొప్పి, జీర్ణ సమస్యలు వంటి వస్తుంటాయి. అందుకే మన పూర్వీకులు అనుసరించిన విధానమే మనకు శ్రీరామరక్ష. ఈ వేసవిలో ఫ్రిజ్ వాటర్ కు బదులుగా, సహజసిద్ధంగా నీటిని చల్లబరిచే మట్టికుండను ఉపయోగించడం ఎంతో ఉత్తమం. ఫ్రిజ్ వాటర్ మానేసి కుండ నీళ్లు తాగడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ చూడండి.

గ్యాస్, ఎసిడిటీ సమస్యలకు శాశ్వత పరిష్కారం
మనం ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో ఎక్కువ భాగం శరీరంలో ఆమ్లంగా (యాసిడ్) మారి, విషతుల్యాలను ఉత్పత్తి చేస్తుంది. అయితే మట్టికి సహజంగానే క్షార (ఆల్కలీన్) గుణం ఉంటుంది. మట్టికుండలో నీరు నిల్వ ఉంచినప్పుడు నీటి pH లెవల్స్ బ్యాలెన్స్ గా మారుతుంది.
కుండ నీటిని మనం తాగినప్పుడు మన శరీరంలోని ఆమ్లత్వంతో అది చర్య జరిపి పీహెచ్ (pH) బ్యాలెన్స్ ఏర్పడుతుంది. దీనివల్ల ఎసిడిటీ, మలబద్ధకం, గ్యాస్ట్రిక్ వంటి ఉదర సంబంధిత సమస్యలు దరిచేరవు.
డీటాక్సిఫికేషన్
వివిధ పరిశోధనల ప్రకారం మట్టి పాత్రలలోని నీరు త్రాగటం వల్ల శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు, మలినాలు సులభంగా బయటకు వెళ్లిపోతాయి. దీనివల్ల శరీరం సహజసిద్ధంగా డిటాక్స్ అవుతుంది.
జీవక్రియ మెరుగుపడుతుంది
ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు తాగడం వల్ల శరీరంలోకి ప్రమాదకరమైన రసాయనాలు చేరే అవకాశం ఉంది. కానీ మట్టి కుండలో నిల్వ చేసిన నీటిలో ఎటువంటి రసాయనాలు ఉండవు. అంతేకాకుండా మట్టిలో ఉండే ఎన్నో సహజసిద్ధమైన ఖనిజాలు (మినరల్స్) నీటిలో కలుస్తాయి.
ప్రతిరోజూ ఈ నీటిని తాగడం వల్ల మన జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. తిన్న ఆహారం త్వరగా జీర్ణమై, శరీర జీవక్రియల రేటు అమాంతం పెరుగుతుంది.
ప్రాణాంతక వడదెబ్బ నుండి రక్షణ
వేసవి కాలంలో ఎండల తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో మనకు తెలిసిందే. వడదెబ్బ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి మట్టికుండ నీరు బెస్ట్ ఆప్షన్. ఈ నీటిలో ఉండే అపారమైన పోషకాలు, ఖనిజాలు మన శరీరాన్ని వెంటనే రీహైడ్రేట్ చేస్తాయి. అలసటను దూరం చేసి, శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.
రోగనిరోధక శక్తిని పెంచే సహజ ప్యూరిఫైయర్
మట్టికుండలో నీళ్లు పోసినప్పుడు వచ్చే ఆ కమ్మటి మట్టి వాసన మనస్సుకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. మట్టికి సహజంగానే మలినాలను పీల్చుకునే గుణం ఉంటుంది. ఇది సహజసిద్ధమైన వాటర్ ప్యూరిఫైయర్ లా పనిచేసి నీటిని స్వచ్ఛంగా మారుస్తుంది.
ఫ్రిజ్ వాటర్ తాగితే గొంతు నొప్పి, జలుబు వస్తాయి, కానీ కుండ నీటితో అలాంటి సమస్యలు రావు. పైగా ఈ నీరు గొంతుకు, పేగులకు ఎంతో మేలు చేయడంతో పాటు మన రోగనిరోధక శక్తిని ఇనుమడింపజేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











