Latest Updates
-
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి!
చలికాలంలో ఎర్రమాంసం మరియు పాల ఉత్పత్తులకి దూరంగా ఉండండని నిపుణులు సూచిస్తున్నారు
చలికాలంలో ఎర్రమాంసం మరియు పాల ఉత్పత్తులకి దూరంగా ఉండండని నిపుణులు సూచిస్తున్నారు..
చలి మెల్లగా తరుముకొస్తోంది మరియు వాతావరణం కూడా వణుకు పుట్టిస్తోంది. ఉష్ణోగ్రత హఠాత్తుగా పడిపోవడం వలన వేసవి వేడి తప్పక తగ్గి మీకు ఉపశమనం లభిస్తుంది. అదే సమయంలో మీ ఉన్ని దుస్తుల అందాలన్నీ చూపే అవకాశం దొరుకుతుంది.
ఇది ఒక కారణమైతే చలికాలం వస్తున్నప్పుడు శరీర శ్రద్ధ కూడా ముఖ్యమే. ఏం తింటున్నారో జాగ్రత్తగా తినాలి ఎందుకంటే ఈ రుతువులో కొన్ని పదార్థాలు తినటం ఆరోగ్యానికి హానికరం కావచ్చు.
మరోవైపు కొన్ని పదార్థాలను ఆహారంలో జత చేసి తినటం వలన మీ శరీరం వెచ్చబడి చలికాలంలో ఎటువంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటుంది.

నిపుణులు ఏమంటున్నారు?
98ఎఫ్ ఐటి స్థాపకుడు భవిష్య వధ్వాన్ మరియు న్యూట్రిషనిష్ట్ మరియు జీవనవిధాన ఎడ్యుకేటర్ నేహ రంగ్లానీల అభిప్రాయం ప్రకారం చలికాలంలో పాలు మరియు ఎర్రని మాంసం తినటం చాలా తగ్గిస్తే మంచిదని సూచిస్తున్నారు. నిపుణుల ప్రకారం, పాల వల్ల కఫం వస్తుంది లేదా ఉన్న కఫాన్ని మరింత ఎక్కువ చేస్తుంది. దీని వల్ల గొంతులో గరగర మరియు అసౌకర్యంగా ఉంటుంది.

అదనంగా, చలికాలంలో రెడ్ మీట్ కూడా అస్సలు తినవద్దు. ఇందులో ఉండే అధిక ప్రొటీన్లు మీ గొంతులో మ్యూకస్ పెంచుతాయి. ప్రాసెస్ చేసిన మాంసం మరియు అధిక కొవ్వు ఉన్న మాంసం తినకూడదు. కానీ కొవ్వులేకుండా కేవలం ప్రొటీన్లుండే చేపలలో మరియు అలాంటి మాంసం సురక్షితమైనవి.
అదేసమయంలో, చలికాలంలో తినదగ్గ మేటి ఆహార పదార్థాలను తెలుసుకోండి.

1. అల్లం
అల్లంలో ముఖ్యమైన పదార్థం జింజరాల్ ఉంటుంది, ఇది యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటుంది. అదనంగా అల్లంలో వాపును తగ్గించే, యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి ఎలాంటి వాపునైనా, నొప్పినుంచైనా ఉపశమనం కల్పిస్తాయి. ఎటువంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా కూడా చేస్తుంది.
మీరు చేయాల్సిందల్లా చిన్న అల్లం ముక్కను తీసుకొని చెక్కు తీసేసి నీళ్లలో మరిగించండి. 5 నిమిషాలు మరిగాక, నీరును వడగట్టి రోజుకి 2-3 సార్లు తాగి మంచి ఫలితాలు పొందండి.

2. పసుపు
పసుపు కేవలం వంటల్లో వాడే దినుసు మాత్రమే కాదు, ఆరోగ్యానికి అనేక లాభాలు ఉన్నాయి. ఇన్ని లాభాలు ఉండటం వలన పసుపును ఆయుర్వేదంలో అనేక వ్యాధులను చికిత్స చేయడానికి వాడతారు. పసుపు వాపులను తగ్గించే లక్షణాలు కూడా ఉండటం కాబట్టి పసుపును మీ ఆహారంలో రెగ్యులర్ గా వాడండి.

3. నట్’స్
నట్లలో అధికంగా ఉండే ఒమేగా -3 -కొవ్వు పదార్థాలను మంచి కొవ్వుగా భావిస్తారు. అందులో రోగనిరోధక శక్తిని బలంగా మార్చే మరియు గాయాలను త్వరగా తగ్గించే ముఖ్యమైన అమినో యాసిడ్ కూడా కలిగి ఉంటుంది.

4. తులసి (బేసిల్);
తులసిని చాలా పవిత్రమైన మొక్కగా పూజిస్తారు. ఇందులో బ్యాక్టీరియా వ్యతిరేక, వైరస్ వ్యతిరేక లక్షణాలుంటాయి.ఇది మన రోగనిరోధక శక్తిని ధృఢపరిచి అనేక ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. కొన్ని తులసి ఆకులు తీసుకుని, శుభ్రంగా కడిగి నమలండి. బాగా ఉపయోగం.

5. తేనె
చలికాలంలో పనికొచ్చే మరో సహజ పదార్థం తేనె. ఒక చెంచా తేనెను ఒక కప్పు గోరువెచ్చని నీటిలో కలిపి తాగితే మీ గొంతునొప్పికి ఉపశమనం లభిస్తుంది. పైగా ఇలా తాగటం వలన పేరుకుపోయిన కఫాన్ని కరిగించి బయటకి తెస్తుంది కూడా.
(ఏజెన్సీ వార్తాకథనం)



Click it and Unblock the Notifications