For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెండు రాళ్లను వెనకేసుకోమంటే కిడ్నీలో రాళ్లను వెనకేసుకోవడం కాదు.. కిడ్నిలో రాళ్లను ఇలా తొలగించుకోండి

మూత్రాశయంలో కిడ్నీ స్టోన్స్ ఆగిపోతే వారికి ఫ్లూ జ్వరం లక్షణాలు కనిపిస్తాయి. అలసట, వణుకుతో కూడిన జ్వరం వంటి లక్షణాలు ఉంటాయి. కొన్ని సార్లు వికారంగా కూడా అనిపిస్తుంది.

|

రెండు రాళ్లను వెనకేసుకోమంటే కిడ్నీలో రాళ్లను వెనకేసుకోవడం కాదు. కిడ్నీ స్టోన్స్..! ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అధిక శాతం మంది బాధపడుతున్న శారీరక రుగ్మతల్లో ఇది ఒకటిగామారింది.మూత్రాశయం, కిడ్నీల్లో ఏర్పడే రాళ్ల వల్ల విపరీతమైన నొప్పి కలగడం ఇందులోనిప్రధాన లక్షణం.

మూత్రం పోసే సమయంలో నొప్పి, మంట, వికారం, జ్వరం, పొట్ట కింది భాగంలో నొప్పి,మూత్రం రంగు మారడం, ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్లడం, తక్కువ మొత్తంలో మూత్రం విసర్జించడం,మూత్రంలో దుర్వాసన వస్తుండడం వంటివి కిడ్నీ స్టోన్స్ ఉన్న వారిలో కనిపించే సాధారణ లక్షణాలు.

ఆక్జలేట్స్‌ను మూత్రాశయంలోకి రానివ్వకుండా

ఆక్జలేట్స్‌ను మూత్రాశయంలోకి రానివ్వకుండా

కాల్షియం ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తినే వారి కంటే తక్కువగా తినే వారికే కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రాళ్లు ఏర్పడేందుకు కారణమయ్యే ఆక్జలేట్స్‌ను మూత్రాశయంలోకి రానివ్వకుండా కాల్షియం అడ్డుకుంటుంది. ఇందుకోసం అది వివిధ రకాల రసాయనాలతో మిళితమై పనిచేస్తుంది.

నొప్పిగా ఉంటుంది

నొప్పిగా ఉంటుంది

కిడ్నీ స్టోన్స్ తొలి దశలో పొట్ట కింది భాగంలో లేదా వెన్నులో నొప్పిగా ఉంటుంది. ఈ నొప్పి ఒక్కోసారి తక్కువగా, ఒక్కో సందర్భంలో ఎక్కువగా ఉండొచ్చు. ఒకవేళ నొప్పి ఎక్కువగా ఉంటే మాత్రం తక్షణమే వైద్యున్ని సంప్రదించాలి.

మూత్రం రంగు కూడా మారుతుంది

మూత్రం రంగు కూడా మారుతుంది

కిడ్నీ స్టోన్స్ ఉన్నవారి మూత్రం రంగు కూడా మారుతుంది. ఎందుకంటే ఆ రాళ్లు మూత్రశాయంలో అటు ఇటు కదులుతూ ఉండడం వల్ల దాంతో ఉండే మూత్రం రంగు మారి అలాగే బయటికి వస్తుంది. ఇది ఘాటైన దుర్వాసనను కలిగి ఉంటుంది.

నొప్పి కూడా ఉంటుంది

నొప్పి కూడా ఉంటుంది

మూత్రాశయంలోకి రాళ్లు వస్తే అవి సదరు అవయవాన్ని వాపులకు గురి చేస్తాయి. ఇది ఎంతగానో ఇబ్బందిని కలిగిస్తుంది. అంతేకాదు దీని వల్ల తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. వెళ్లినప్పుడల్లా నొప్పి కూడా ఉంటుంది. అయితే తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావడం వెనుక మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు, లైంగిక వ్యాధుల వంటి ప్రమేయం కూడా ఉంటుంది.

మూత్రంలో రక్తం కూడా వస్తుంది

మూత్రంలో రక్తం కూడా వస్తుంది

మూత్రాశయంలో కిడ్నీ స్టోన్స్ ఆగిపోతే వారికి ఫ్లూ జ్వరం లక్షణాలు కనిపిస్తాయి. అలసట, వణుకుతో కూడిన జ్వరం వంటి లక్షణాలు ఉంటాయి. కొన్ని సార్లు వికారంగా కూడా అనిపిస్తుంది. కిడ్నీస్టోన్స్ ఉంటే ఒక్కోసారి మూత్రంలో రక్తం కూడా వస్తుంది. అయితే ఇది ఎరుపు రంగులో కాక ఎరుపు, పసుపు మిక్స్ చేసిన డార్క్ రంగులో కనిపిస్తుంది. కుటుంబంలో, వారి రక్త సంబంధీకుల్లో ఎవరికైనా కిడ్నీ స్టోన్లు ఉంటే వారి నుంచి వారి పిల్లలకు కూడా అవి వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది.

డయేరియా ఉన్నవారు

డయేరియా ఉన్నవారు

ఇన్‌ఫ్లామేటరీ బౌల్ డిసీజ్ (ఐబీడీ), క్రాన్స్ డిసీజ్, అల్సరేటివ్ కొలైటిస్ వంటి వ్యాధులు ఉన్నవారికి కిడ్నీ స్టోన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరిలో డయేరియా ఉన్నవారు కూడా ఉంటే అది డీహైడ్రేషన్‌కు దారి తీసి కిడ్నీ స్టోన్లు ఏర్పడేలా చేస్తుంది.

పరీక్షలు చేయించుకోవాలి

పరీక్షలు చేయించుకోవాలి

మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు తరచూ వస్తున్నా కూడా కిడ్నీ స్టోన్లు ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది. ఇలా గనక జరిగితే వెంటనే వైద్యులను సంప్రదించి అందుకు అనుగుణంగా పరీక్షలు చేయించుకుని చికిత్స ప్రారంభించాలి. విరేచనకారులు (లాక్సేటివ్స్)ను ఎక్కువగా వాడడం వల్ల కూడా కిడ్నీస్టోన్లు ఏర్పడేందుకు అవకాశం ఉంది.

టమోటాల పైన పల్చగా వుండే పొర

టమోటాల పైన పల్చగా వుండే పొర

ఆ లాక్సేటివ్స్ శరీరంలో ఎలక్ట్రోలైట్ అసమతుల్యతను కలగజేస్తాయి. తద్వారా శరీరం పోషకాలను తక్కువగా గ్రహిస్తుంది. డీహైడ్రేషన్ కూడా కలుగుతుంది. ఇది కిడ్నీ స్టోన్లు ఏర్పడేందుకు కారణమవుతుంది. టమోటాల పైన పల్చగా వుండే పొర, కొబ్బరిపై వుండే టెంకలాంటివి కిడ్నీలలో రాళ్లు ఏర్పడేందుకు కారణాలవుతాయి. అందుకే కిడ్నీలను కాపాడుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి.

రెండున్నర లీటర్ల మూత్రం

రెండున్నర లీటర్ల మూత్రం

క్యాల్షియం సప్లిమెంట్లు తగిన మోతాదులో వుండేలా చూసుకోవాలి. వైద్యుల సలహా మేరకు వాటిని తీసుకుంటూ వుండాలి. రోజుకు తప్పనిసరిగా రెండు నుంచి రెండున్నర లీటర్ల మూత్రం విసర్జించాల్సి వుంటుంది. కాబట్టి శరీర కణాల నిర్వహణకుపోను ఆ మోతాదులో మూత్ర విసర్జన జరగాలంటే రోజుకు కనీసం మూడు నుంచి 4 లీటర్ల మంచినీళ్లు తాగాలి.

ఆరెంజ్ రసం మంచిదే

ఆరెంజ్ రసం మంచిదే

ఆల్కహాల్ వల్ల మూత్రం ఎక్కువగా వస్తుంది. దాంతో దేహంలో నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్, క్రమేణా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఎక్కువ. కాబట్టి వాటిని తీసుకోరాదు. ఆరెంజ్ రసానికి క్యాల్షియం ఆక్సలేటును రాయిగా మారకుండా నిరోధించే లక్షణం వుంది. కాబట్టి ఆరెంజ్ రసం మంచిదే.

నిర్లక్ష్యం చేస్తుంటారు

నిర్లక్ష్యం చేస్తుంటారు

అయితే విటమిన్ సి ఎక్కువగా తీసుకుంటే కిడ్నీ స్టోన్ సమస్యకు దారితీసే అవకాశం వుంది. అందుకే పుల్లని పండ్లను ఎక్కువగా తీసుకోరాదు. అంతేకాదు కూల్ డ్రింక్స్ జోలికి అసలు వెళ్లకూడదు. కిడ్నీ స్టోన్స్ వల్ల శరీరం సూచించే హెచ్చరికలను కొంత మంది పెడచెవి పెట్టి తమ ఆరోగ్యాన్ని ఇంకా నిర్లక్ష్యం చేస్తుంటారు కూడా. ఇక కిడ్నీలో రాళ్లను నిర్లక్ష్యం చేస్తే త్వరగా పైకి పోతారు

English summary

kidney stones causes symptoms and treatment

kidney stones causes symptoms and treatment
Desktop Bottom Promotion