Latest Updates
-
ఢిల్లీ ఫేమస్ చికెన్ చంగేజీ..నాన్, బటర్ రోటీ, చపాతీ, బగారా రైస్, అన్నంలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
అమ్మమ్మల నాటి పచ్చి టమాటా రోటి పచ్చడి..చికెన్, మటన్ కూడా దేనికీ పనికిరావు! -
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే..
Alert: కోవిషీల్డ్ టీకా తీసుకున్న కొందరిలో రక్తం గడ్డ కడుతోందని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి..
కోవిషీల్డ్ తీసుకున్న కొందరిలో రక్తం గడ్డ కడుతున్న కేసులను ప్రభుత్వం గుర్తించిందట.
ప్రస్తుతం కరోనా వైరస్ అందరినీ భయపెడుతున్నప్పటికీ.. దానికి విరుగుడు కనుగొన్నారు కొన్ని దేశాల నిపుణులు. దీంతో కరోనా నుండి తమను తాము కాపాడుకోవచ్చని చాలా మంది ఊపిరి పీల్చుకున్నారు.

ప్రపంచంలోని చాలా దేశాల్లో కరోనా టీకాలు కూడా ఉత్పత్తి అవ్వడమే కాదు.. చాలా మంది తీసుకుంటున్నారు. కరోనా నుండి కోలుకుంటున్నారు. కరోనా టీకా ఉత్సవ్ కూడా విజయవంతంగా కొనసాగుతోంది.

అయితే అంతా సాఫీగా సాగుతున్న క్రమంలో తాజాగా కోవిషీల్డ్ టీకాలో ఒక సైడ్ ఎఫెక్ట్ కనుగొన్నట్లు ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. కోవిషీల్డ్ కరోనా నుండి మనల్ని రక్షిస్తున్నప్పటికీ, కొందరికి కొన్ని దుష్ప్రభావాలు ఎదురువుతున్నాయి.

అందులో కోవిషీల్డ్ టీకా తీసుకున్న కొందరిలో రక్తం గడ్డ కట్టినట్టు AEFI ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ నివేదికలో వివరించింది. ఈ సందర్భంగా అందుకు సంబంధించిన వివరాలేంటో తెలుసుకుందాం...

ఎంతమందికి రక్తం గడ్డకట్టింది..
భారతదేశంలో ప్రస్తుతం కోవిషీల్డ్ మరియు కోవాక్సిన్ టీకాలను ఎక్కువగా వాడుతున్నారు. అయితే కోవిషీల్డ్ తీసుకున్న వారిలో దాదాపు ఒక శాతం అంటే 0.61% మందికి ఇలా రక్తం గడ్డకట్టినట్లు కనుగొన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో దీని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. యుకె మరియు జర్మనీలలో ఒక మిలియన్ ప్రజల్లో దాదాపు 10 మంది ప్రభావితమయ్యారు. మన దేశంలో ఇప్పటివరకు 7.5 కోట్ల కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకోగా.. సుమారు 700 మందికి ఇలా రక్తం గడ్డ కట్టే సమస్య ఉండొచ్చని AEFI తన నివేదికలో తెలిపింది.

కోవాగ్జిన్ లో రక్తం గడ్డ కట్టలేదు..
మన దేశంలో రెండు రకాల టీకాలు ఇవ్వబడుతున్నాయి. అవి కోవిషీల్డ్ మరియు కోవాక్సిన్, రెండు టీకాలు కరోనా వైరస్ మహమ్మారితో పోరాడగల సామర్థ్యం కలిగి ఉంటాయి. అయితే వీటిలో కోవిషీల్డ్ తీసుకున్న కొంతమందిలో దుష్ప్రభావాలను కలిగిస్తాయి. కోవాగ్జిన్ పొందిన వారిలో రక్తం గడ్డకట్టడం నివేదించబడలేదు.

టీకా ఎప్పుడు దొరుకుతుంది?
కోవిషీల్డ్ యొక్క మొదటి మోతాదు తర్వాత కొన్ని వారాలలో ఈ రకమైన రక్తం గడ్డకట్టే సమస్య కనిపిస్తుంది. సాధారణంగా కోవిషీల్డ్ టీకా ఫస్ట్ డోస్ తీసుకున్న నాలుగు వారాలు లేదా ఆరు వారాల తర్వాత రెండో డోసు తీసుకుంటున్నారు. ఆ తర్వాత కొందరిలో దుష్ప్రభావాలు నెమ్మదిగా బయటపడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

రక్తం గడ్డకట్టే లక్షణాలు ఏమిటి?
కోవిషీల్డ్ వ్యాక్సిన్ అందుకున్న తర్వాత తలనొప్పి, మైకము, వాంతులు, కడుపు నొప్పి లేదా ఊపిరి తీసుకోవడం వంటి లక్షణాలను మీరు ఎదుర్కొంటే, వెంటనే మీ వైద్యుడికి తెలియజేయండి. భారతదేశంలో మార్చి 31 నాటికి 700 మంది ఈ రకమైన దుష్ప్రభావాలను కలిగి ఉన్నారు. 617 మంది పరిస్థితి విషమంగా ఉంది. 130 మంది మరణించారు. గణాంకాల ప్రకారం, మే 14 నాటికి 184 కోట్ల మందికి టీకాలు వేశారు.

మార్చి వరకు జిరో కేసులు..
కరోనా వైరస్ వ్యాక్సిన్ కోవిషీల్డ్ నాణ్యతపై మార్చి మాసంలోనే పలు దేశాల్లో సందేహాల్లో తలెత్తుతున్నాయి. ఈ టీకాను తీసుకున్న వారిలో కొందరికి రక్తం గడ్డ కట్టిన(బ్లడ్ క్లాటింగ్) కేసులు బయటపడ్డాయని వార్తలొచ్చాయి. అయితే మార్చి మాసంలో భారతదేశంలో ఇలాంటి కేసు ఒక్కటి కూడా లేదని నివేదికలు వెల్లడించాయి.



Click it and Unblock the Notifications











