Latest Updates
-
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది
ఆ మందుల ధరలను మరింతగా తగ్గించిన నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ.. అవేంటంటే..
నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ప్రజలకు మరోసారి శుభవార్త చెప్పింది. ఈసారి ఏకంగా 127 మందుల ధరలపై పరిమితి విధించింది. ఈ నిర్ణయంతో 127 ఔషధాల ధరలు తగ్గనున్నాయి.
నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ప్రజలకు మరోసారి శుభవార్త చెప్పింది. ఈసారి ఏకంగా 127 మందుల ధరలపై పరిమితి విధించింది. ఈ నిర్ణయంతో 127 ఔషధాల ధరలు తగ్గనున్నాయి. ఇందులో క్యాన్సర్ మందులు కూడా ఉండటం గమనార్హం. ఔషధాల ధరలపై పరిమితి విధించడం ఈ సంవత్సరంలో ఇది ఐదోసారి కావడం విశేషం. పారాసెటమాల్ సహా ఇతర మందుల ధరలు తగ్గనున్నాయి. అయితే మెట్ఫార్మిన్, మాంటెలుకాస్ట్ సహా కొన్న ఔషధాల ధరలు పెరగనున్నాయి.

నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ విడుదల చేసిన జాబితాలో 127 మందుల్లో పారాసెటమాల్, అమోక్సిసిలిన్, రాబెప్రజోల్ వంటి మందులు ఉన్నాయి. వీటిలో చాలా మందులను రోగులు చాలా తరచుగా ఉపయోగిస్తారు. ఒక్కో ట్యాబ్లెట్ రూ.2.3కు విక్రయించే పారాసెటమాల్(650ఎంజీ) ఇప్పుడు ఒక్కో ట్యాబ్లెట్పై రూ.1.8కి పరిమితం అయింది. ఎన్పీపీపీఏ పారాసెటమాల్ ఫార్ములేషన్ ధరలను తగ్గించింది. అదే విధంగా అమోక్సిసిలిన్, పొటాషియం క్లావులనేట్ ధర కూడా రూ.22.3 నుండి రూ. రూ.16.8కి తగ్గింది.
మోక్సిఫ్లోక్సాసిన్(400ఎంజీ) ఒక ట్యాబ్లెట్ ధరను రూ.31.5 నుండి రూ.22.8కు తగ్గించింది. న్యుమోనియా వంటి బాక్టీరియా వ్యాధుల చికిత్సకు ఉపయోగించే ఈ మందుల ధరను నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ఈ సంవత్సరంలో మొదటిసారిగా తగ్గించింది. అయితే కొత్త జాబితా మెట్ఫార్మిన్(500ఎంజీ) వంటి కొన్ని మందుల ధరను రూ.1.7 నుండి రూ.1.8కి పెంచింది. గత ఏడాదిలో టైప్-2 డయాబెటిస్కు చికిత్స చేయడానికి ఉపయోగించే మెట్ఫార్మిన్ కలయిసు ఫార్ములేషన్ కోసం ధరల్లో అనేక మార్పులు జరిగాయి.
పారాసెటమాల్, మోక్సిసిలిన్, పొటాషియం క్లావులనేట్ వంటి మందులతో పాటు, క్యాన్సర్ మందులపై కూడా నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ పరిమితి విధించింది. క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే ఔషధాల ధరలను ఎన్పీపీఏ 40 శాతం వరకు పరిమితం చేసింది. జ్వరం, డయాబెటిస్ వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగించే మందుల ధరలు కూడా 40 శాతం మేరక తగ్గించింది నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications