Latest Updates
-
ఆన్లైన్లో విపరీతంగా ఆభరణాలు కొంటున్నారా.. 'మెరిసే' నగలతో మోయలేని ఆరోగ్య సమస్యలు.! -
మీ భాగస్వామి ఈ విషయాల్లో మీకు దూరంగా ఉంటున్నారా.. ఈ సంకేతాలతో చాలా డేంజర్.! -
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ ! -
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.! -
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.?
మామిడి పండ్లు తింటే ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా?
పండ్లలో మామిడి పండ్లను రారాజు అంటారు. వేసవి కాలం వచ్చిందంటే మామిడి పండ్ల సీజన్ వచ్చేసినట్లే. ఈ సీజనల్ ఫ్రూట్ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం ఉంటుంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. అయితే మామిడి పండ్లు ఎక్కువగా తినడం వల్ల ముఖంపై మొటిమలు వస్తాయని భయపడుతుంటారు చాలా మంది.

మామిడి పండ్లు తింటే మొటిమలు ఎందుకొస్తాయి?
మామిడి పండ్లలో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. ఈ ఫైటిక్ యాసిడ్ శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఈ వేడి వల్ల ముఖంపై మొటిమలు వస్తాయి. మామిడి పండ్లలో ఉండే తెల్లటి రసవంతమైన ద్రవంలో యాంటీ-న్యూట్రియంట్ ఫైటిక్ యాసిడే మొటిమలకు కారణం. ఇది శరీరంలో థర్మో జెనిసిస్ ను ఉత్పత్తి చేస్తుంది.
మొటిమలు రావొద్దంటే ఏం చేయాలి?
మామిడి పండ్లు తిన్నా కూడా మొటిమలు రాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటింంచాలి. మామిడి పండ్లు తినడానికి ముందు వాటిని కనీసం రెండు గంటల పాటు నీటిలో నానబెట్టడం మంచి మార్గం. ఇలా చేయడం వల్ల ఫైటిక్ యాసిడ్ తొలగిపోతుంది. అలా అవి ఉత్పత్తి చేసే వేడిని తగ్గిస్తుంది. మామిడిలోని యాంటీ న్యూట్రీయెంట్ ఫైటిక్ యాసిడ్.. విటమిన్లు, ఖనిజాలు గ్రహించే శరీర సామర్థ్యానికి కూడా ఇది ఆటంకం కలిగిస్తుంది. మామిడి పండ్లను నీటిలో నానబెట్టడం వల్ల థర్మోజెనిసిస్ ప్రభావం తగ్గి శరీరం వేడికి గురవ్వదు. అలా మొటిమలు రాకుండా ఉంటాయి.
అసిడిటీ, గుండెల్లో మంటను తగ్గించడానికి ఏం చేయాలంటే..:
మామిడి పండ్లను నానబెట్టకుండా తినడం వల్ల మొటిమలు రావడంతో పాటు అసిడిటీ, గుండెల్లో మంట కూడా వస్తాయి. ఈ ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి ఈ చిట్కా పాటించడం ఈ సమస్యల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది.
పిత్తదోషం ఉన్న వాళ్లు మామిడి పండ్లు తినొచ్చా?
ఆయుర్వేదం ప్రకారం పిత్తదోషం ఉన్న వాళ్లు మామిడి పండ్లు తినడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. పిత్త దోషం ఉన్న వారి శరీరంలో వేడి అధికంగా ఉంటుంది. మామిడి పండ్లు తినడం వల్ల ఆ వేడి మరింతగా పెరుగుతుంది. దీని వల్ల కొందరిలో గుండెల్లో మంట, అసిడిటీ, అజీర్ణం వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే పిత్త దోషం ఉన్న వాళ్లు మామిడి పండ్లు రోజుకు ఒకటి మాత్రమే తినాలని వైద్యులు సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications