వంటగది పరిశుభ్రతతో..అనారోగ్యానికి చెక్

 home improvement
నిత్యం మనం వినియోగించే వంటగది శుభ్రంగా ఉంచుకోకుంటే... ఆహారం కూడా విషతుల్యమై... రోగాల బారిన పడే ప్రమాదం ఉంది. అందుకే వంట కాగానే ముందు కూరగాయల చెత్త, మిగిలి పోయిన ఆహార పదార్ధాలు బైట పడేయండి. ఇవి బాక్టీరీయాలకు ఆలవాలంగా మారే ప్రమాదం ఉంది. ఇల్లంతా చెడు వాసన విస్తరించేలా చేయటమే కాక మీమ్మల్ని అనారోగ్యం బారిన పడేలా చేస్తాయి.

వంటిల్లుకు ప్రత్యేకత ఉంది. ఇది మిగతా గదులన్నింటి కన్నా శుభ్రంగా వుండాలి. దీనిపై శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఆహార పదార్థాలు నిల్వచేసేది, వండేది ఇక్కడే కదా. అజాగ్రత్తగా వుంటే బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం వుంటుంది. ఆహారం కలుషితమై రోగాల బారిన పడేందుకు ఆస్కారం ఉంది. వంట గదిలో ఉపయోగించే పాత్రలు, రిఫ్రిజిరేటర్‌, మైక్రో ఓవెన్‌ వంటి వస్తువులను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ఉండాలి.

వంటగది ప్రత్యేకంగా ఒక సారి శుభ్రం చేయాల్సిన అవసరం లేదు. వంట పూర్తిగాకానే వాడిన పాత్రలతో పాటు పరిసరాలను శుభ్రం చేసుకుంటే మంచింది. కూరగాయలు, పండ్లను ఉపయోగించే పాత్రలు, ఇతర ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్‌ వస్తువులైన ఫ్రిజ్‌, ఓవెన్‌ వంటి వాటి శుభ్రతలో జాగ్రత్తలు పాటించాలి.

రోజూ కూరగాయలను కత్తి పీటతో గానీ, చాక్‌తో గానీ కట్‌ చేస్తుంటాం. కూరగాయలు ట్‌ చేసి వాటిని అలాగే పడేయకుండా శుభ్రంగా డిగి, దాన్ని ఒక చోట భద్రపరచాలి. చాక్‌తో చికెన్‌, మటన్‌, కట్‌ చేసినప్పుడు వాటిని నిమ్మరసంతో కడగాలి.

Story first published: Wednesday, January 4, 2012, 17:15 [IST]
Desktop Bottom Promotion