Latest Updates
-
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి!
శ్రీ కృష్ణుడు యొక్క పుట్టుక వెనుక ఉన్న కథ
కృష్ణుడు యొక్క కథ హిందూమతం యొక్క భూభాగంలో ప్రముఖంగా చర్చించబడినది. ఇలానే విస్మయం మరియు ఉద్వేగానికి కారణమైంది. అత్యంత ప్రసిద్ధ హిందూ మతం దేవతల మధ్య ముఖ్యంగా ఆకర్షణ మరియు శక్తివంతమైన వ్యక్తిత్వం ఉంటుంది. కృష్ణుడు విష్ణువు యొక్క 8 వ అవతారంగా పరిగణించబడుతుంది.ఆ కధ ఇలా నడుస్తుంది ...
భూదేవికి మానవులు చేసే పాపాల భారం భరించడం సాధ్యం కాలేదు. మనుషులు చేసిన పాపాల వలన మొక్కలు,జంతువులు,నీరు,గాలి మరియు భూమి నాశనం అవుతున్నాయి. భూదేవి విష్ణువు దగ్గరకు వెళ్లి తనను కాపాడమని కోరెను. హిందూ మతం గ్రంధముల ప్రకారం,ఈ ప్రధాన సంఘటన భగవంతుడైన కృష్ణుడి జన్మకు ప్రేరేపించింది. ఇది కృష్ణుడు జన్మించటానికి మొట్టమొదటి కారణం.
మథుర పాలకుడు అయిన కంసుడు ఒక దుష్ట శక్తిగా మారెను. కంసుడు చేసే పాపాలు పరాకాష్టకు చేరుకున్నాయి. కంసుడి యొక్క సోదరి దేవకి వివాహం వాసుదేవునితో జరిగెను. వివాహం జరిగిన వెంటనే ఆ ప్రదేశంలో ఆకాశ వాణి 'దేవకి,వసుదేవునికి పుట్టిన 8 సంతానంతో కంసుడికి మరణం సంభవిస్తుందని' పలికెను. ఆ మాటలు విన్న వెంటనే కంసుడు కత్తి తీసి చంపటానికి వెళ్ళెను. అప్పుడు వాసుదేవుడు మరియు అతని భార్య దేవకి కంసుడితో తమకు పుట్టిన పిల్లలను అప్పగిస్తామని వాగ్దానం చేసెను. కంసుడు ఈ జంటను ఖైదు చేసి కాపలా పెట్టెను.

ఈ జంటకు పుట్టిన ప్రతి బిడ్డను కంసుడు వధించేను. కంసుడు 7 వ బిడ్డను వధించిన తర్వాత,ఈ జంట 8 వ బిడ్డను రక్షించమని విష్ణువును కోరెను. ఒక రాత్రి స్వప్నంలో వసుదేవునికి విష్ణువు కనిపించి గోకులంలో ఉన్న విష్ణు భక్తుడైన నందుని ఇంట ఉన్న చిన్నారిని తెమ్మని చెప్పెను. వసుదేవునికి పుట్టిన అబ్బాయిని తీసుకువచ్చి గోకులంలో ఉంచి,అదే రోజు జన్మించిన నంద కుమార్తెను తీసుకోని వెళ్ళమని ఆదేశించేను.
8 వ బిడ్డ జన్మించిన తర్వాత, విష్ణువు యొక్క అవతారం జరిగినది. వసుదేవుని యొక్క సంకెళ్ళు మరియు జైలు తలుపులు వాటి అంతటా అవే తొలగించబడ్డాయి. కుండపోత వర్షాలు మరియు తుఫాను వచ్చాయి. ఆ సమయంలో నందుని యొక్క కుమార్తెను తీసుకువస్తున్న వసుదేవునికి నదులు దారి ఇచ్చాయి. వాసుదేవుడు నందా యొక్క కొత్తగా పుట్టిన పిల్లతో జైలు వెళ్ళాడు. కంసుడికి జరిగిన సంఘటనల గురించి తెలియదు.
కంసుడు నంద కుమార్తెను చంపటానికి వెళ్ళినప్పుడు,ఆమె అకస్మాత్తుగా ఒక దేవదూతగా మారి నిన్ను సంహరించేవాడు వేరే చోట పెరుగుతున్నాడని పలికెను. అతనికి నిన్ను చంపే వయస్సు వచ్చే వరకు అతను ఎవరని తెలియదని చెప్పెను. ఇది కృష్ణుడు యొక్క జననం వెనుక ఉన్న కథ.
ఈ కథ హిందూ మతం పురాణాలలో ఈ విధంగా ప్రచారంలో ఉన్నది.



Click it and Unblock the Notifications