Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
చాణక్యుడి ప్రకారం డబ్బు ఎవరి వద్ద నిలుస్తుందంటే..!
వందల ఏళ్లు గడిచినా చాణక్య నీతులు ఇప్పటికీ అలాగే పాపులారిటీని నిలబెట్టుకున్నాయ్. పూర్వం రాజు చంద్రగుప్తుడి రాజ్యంలో రాజులకు, మంత్రులకు సలహాదారుడిగా ఉన్న చాణక్యుడు చరిత్రలో గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారు. చాణక్య నీతులు మనిషిని ఉన్నతంగా, లక్ష్యం వైపు విజయం వైపు తీసుకువెళ్తాయని ఎందరో విజేతలు ఇప్పటికీ చెబుతుంటారు.

జీవితంలో డబ్బు చాలా ముఖ్యమైంది. పురాణాల్లో రాజరిక కాలంలో డబ్బును భాగ్యలక్ష్మితో, లక్ష్మీ దేవితో పోలుస్తారు. ఎవ్వరివద్దైనా డబ్బు ఉంది అంటే వారి ఇంట్లో భాగ్యలక్ష్మి ఉన్నట్లు భావించేవారు. చాణక్య నీతిలో భాగ్యలక్ష్మి ఎవరి వద్ద నిలుస్తుంది. ఎవ్వరికి ఆమె ఆశిస్సులుంటాయో చాణక్యుడు స్పష్టంగా చెప్పాడు. డబ్బు విషయంలో చాణక్యుడు ఏమి చెప్పాడో తెలుసుకుందాం.
చాణక్య నీతి ప్రకారం మనిషి ఎప్పుడంటే అప్పుడు నిద్రకు ఉపక్రమించకూడదు. ఒక సరైన పద్ధతిలోనే నిద్రపోవాలి. సూర్యోదయం తరువాత లేదా సూర్యాస్తమయం సమయంలో నిద్రించవద్దని చాణక్యుడు చెబుతాడు. అలా ఉదయం నిద్రిస్తే వారి వద్ద జీవితాంతం డబ్బు ఉండదని వారికి ఇతరులు సహాయం కూడా చేయవద్దంటాడు.
చాణక్యుడి ప్రకారం దంతాలు శుభ్రంగా ఉంచుకోని వ్యక్తి వద్దకు కూడా భాగ్యలక్షి రాదని అంటాడు. వారు ఎల్లప్పుడు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారంటాడు. కాబట్టి శరీరాన్ని ఎప్పటికీ శుభ్రంగా ఉంచుకోవాలంటాడు.
కొంతమంది అవసరమైనదానికంటే కూడా ఎక్కువగా తింటుంటారు. అలాంటి వారివద్ద కూడా డబ్బు ఉండదంటాడు. ఎక్కువగా తినడానికి అనవసరంగా ఎక్కువ ఖర్చు చేసి డబ్బును వృధా చేస్తారంటాడు. చాణక్యుడి ప్రకారం ఎంత ఆకలి ఉందో అంతే తినాలి, ఎంత అవసరం ఉందో అంత మాత్రమే ఖర్చు చేయాలి.
కోపం, గంభీరం, కఠినంగా ఉండే వ్యక్తి వద్ద డబ్బు ఉండదని చాణక్యుడు చెబుతాడు. వారికి డబ్బు ఆదా చేయడం కూడా తెలియదంటాడు. మధురమైన భాషలో మాట్లాడేవారి వద్దకు భాగ్యలక్ష్మి వెళ్తుందని వారింట్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయంటాడు.
ఎవ్వరైతే తమ ఇంట్లో అతిథులను అగౌరవపరుస్తారో వారి ఇంట్లో కూడా భాగ్యలక్షి నిలవదని అంటాడు చాణక్యుడు. వారికి జీవితాంతం డబ్బు, గౌరవమర్యాదలు లేకుండాపోతాయంటాడు.
చెడు మార్గాల ద్వారా డబ్బు సంపాదించినా లేదా అక్రమాలకు పాల్పడినా అలాంటి వారి వద్ద డబ్బు పదేళ్లవరకే ఉంటుంది. తరువాత పదకొండవ ఏట నుంచి ఆ డబ్బు దూరమవడం ప్రారంభమవుతుందని చాణక్య నీతి చెబుతుంది.
డబ్బు పై వ్యామోహం పెంచుకోవద్దని చాణక్యుడు అంటాడు. ఎందుకంటే డబ్బు మరింత సంపాదించాలనే వ్యామోహంతో గర్వం పెరుగుతుంది. దాంతో పాటు అహంకారం కూడా పెరుగుతుందంటాడు. సంపదపై అహంకారం ఉండే వ్యక్తుల వద్ద డబ్బు ఎక్కువ కాలం ఉండదని చాణక్య నీతి చెబుతుంది.



Click it and Unblock the Notifications











