Latest Updates
-
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి!
చాణక్యుడి ప్రకారం డబ్బు ఎవరి వద్ద నిలుస్తుందంటే..!
వందల ఏళ్లు గడిచినా చాణక్య నీతులు ఇప్పటికీ అలాగే పాపులారిటీని నిలబెట్టుకున్నాయ్. పూర్వం రాజు చంద్రగుప్తుడి రాజ్యంలో రాజులకు, మంత్రులకు సలహాదారుడిగా ఉన్న చాణక్యుడు చరిత్రలో గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారు. చాణక్య నీతులు మనిషిని ఉన్నతంగా, లక్ష్యం వైపు విజయం వైపు తీసుకువెళ్తాయని ఎందరో విజేతలు ఇప్పటికీ చెబుతుంటారు.

జీవితంలో డబ్బు చాలా ముఖ్యమైంది. పురాణాల్లో రాజరిక కాలంలో డబ్బును భాగ్యలక్ష్మితో, లక్ష్మీ దేవితో పోలుస్తారు. ఎవ్వరివద్దైనా డబ్బు ఉంది అంటే వారి ఇంట్లో భాగ్యలక్ష్మి ఉన్నట్లు భావించేవారు. చాణక్య నీతిలో భాగ్యలక్ష్మి ఎవరి వద్ద నిలుస్తుంది. ఎవ్వరికి ఆమె ఆశిస్సులుంటాయో చాణక్యుడు స్పష్టంగా చెప్పాడు. డబ్బు విషయంలో చాణక్యుడు ఏమి చెప్పాడో తెలుసుకుందాం.
చాణక్య నీతి ప్రకారం మనిషి ఎప్పుడంటే అప్పుడు నిద్రకు ఉపక్రమించకూడదు. ఒక సరైన పద్ధతిలోనే నిద్రపోవాలి. సూర్యోదయం తరువాత లేదా సూర్యాస్తమయం సమయంలో నిద్రించవద్దని చాణక్యుడు చెబుతాడు. అలా ఉదయం నిద్రిస్తే వారి వద్ద జీవితాంతం డబ్బు ఉండదని వారికి ఇతరులు సహాయం కూడా చేయవద్దంటాడు.
చాణక్యుడి ప్రకారం దంతాలు శుభ్రంగా ఉంచుకోని వ్యక్తి వద్దకు కూడా భాగ్యలక్షి రాదని అంటాడు. వారు ఎల్లప్పుడు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారంటాడు. కాబట్టి శరీరాన్ని ఎప్పటికీ శుభ్రంగా ఉంచుకోవాలంటాడు.
కొంతమంది అవసరమైనదానికంటే కూడా ఎక్కువగా తింటుంటారు. అలాంటి వారివద్ద కూడా డబ్బు ఉండదంటాడు. ఎక్కువగా తినడానికి అనవసరంగా ఎక్కువ ఖర్చు చేసి డబ్బును వృధా చేస్తారంటాడు. చాణక్యుడి ప్రకారం ఎంత ఆకలి ఉందో అంతే తినాలి, ఎంత అవసరం ఉందో అంత మాత్రమే ఖర్చు చేయాలి.
కోపం, గంభీరం, కఠినంగా ఉండే వ్యక్తి వద్ద డబ్బు ఉండదని చాణక్యుడు చెబుతాడు. వారికి డబ్బు ఆదా చేయడం కూడా తెలియదంటాడు. మధురమైన భాషలో మాట్లాడేవారి వద్దకు భాగ్యలక్ష్మి వెళ్తుందని వారింట్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయంటాడు.
ఎవ్వరైతే తమ ఇంట్లో అతిథులను అగౌరవపరుస్తారో వారి ఇంట్లో కూడా భాగ్యలక్షి నిలవదని అంటాడు చాణక్యుడు. వారికి జీవితాంతం డబ్బు, గౌరవమర్యాదలు లేకుండాపోతాయంటాడు.
చెడు మార్గాల ద్వారా డబ్బు సంపాదించినా లేదా అక్రమాలకు పాల్పడినా అలాంటి వారి వద్ద డబ్బు పదేళ్లవరకే ఉంటుంది. తరువాత పదకొండవ ఏట నుంచి ఆ డబ్బు దూరమవడం ప్రారంభమవుతుందని చాణక్య నీతి చెబుతుంది.
డబ్బు పై వ్యామోహం పెంచుకోవద్దని చాణక్యుడు అంటాడు. ఎందుకంటే డబ్బు మరింత సంపాదించాలనే వ్యామోహంతో గర్వం పెరుగుతుంది. దాంతో పాటు అహంకారం కూడా పెరుగుతుందంటాడు. సంపదపై అహంకారం ఉండే వ్యక్తుల వద్ద డబ్బు ఎక్కువ కాలం ఉండదని చాణక్య నీతి చెబుతుంది.



Click it and Unblock the Notifications