షాకింగ్..అయోధ్య రామాలయం ప్రధాన పూజారి కన్నుమూత

అయోధ్య రామాలయం ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్ కన్నుమూశారు. ఫిబ్రవరి3వ తేదీన బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో మహంత్ సత్యేంద్ర దాస్ ని లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యేయేట్ మెడికల్ సైన్సెస్(SGPGI)హాస్పిటల్ లో చేర్పించారు. అప్పటినుంచి హాస్పిల్ లో ట్రీట్మెంట్ పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించి ఇవాళ(ఫిబ్రవరి 12)ఉదయం తుదిశ్వాస విడిచారు.

గత 20 ఏళ్ల నుంచి అయోధ్యలో తాత్కాలిక రామాలయానికి కూడా ప్రధాన పూజారి దాస్ కొనసాగారు. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో కూడా ఆయన తాత్కాలిక రామాలయ ప్రధాన పూజారిగా ఉన్నారు. గతేడాది అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సమయంలో కూడా దాస్ కీలక పాత్ర పోషించారు. అయోధ్య మందిర నిర్మాణం తర్వాత అక్కడ రామాలయ ప్రధాన పూజారిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం దాస్ వయస్సు 85 సంవత్సరాలు.

ayodhya ram mandir head priest mahant satyendra passes away

మహంత్ సత్యేంద్ర దాస్ కన్నుమూతపై పలువురు నేతలు, ప్రముఖులు, ఆధ్యాత్మిక గురువులు సంతాపం తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ఆయనతో వారికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

Story first published: Wednesday, February 12, 2025, 11:16 [IST]
Desktop Bottom Promotion