Latest Updates
-
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే!
అసలైన దసరా వేడుక చూడాలంటే.. అక్కడికి వెళ్లాల్సిందే!
మన భారతదేశంలో దసరా పండగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. చెడుపై మంచి విజయం సాధించింది అనే దానికి ప్రతీకగా ఈ పండుగను చేసుకుంటారు. పది తలలు గల రావణాసురిడిని రాముడు అంతం చేశాడనే కారణంగా దీనికి దసరా అనే పేరొచ్చింది. దసరాతో పాటు దేవి శరన్నవరాత్రులను కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటారు. అయితే మన దేశంలోని ఏ ఏ నగరాల్లో దసరాను ఎలా నిర్వహించుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణలో బతుకమ్మ:
తెలంగాణలో దసరాకు, బతుకమ్మకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. తొమ్మిది రోజుల పాటు మహిళలందరూ పూలతో బతుకమ్మను పేర్చి, పూజిస్తారు. రోజుకో పేరుతో తొమ్మిది రోజుల పాటు బతుకమ్మను కొలుస్తారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఒక విధంగా దసరా ఉత్సవాలు జరిగితే.. తెలంగాణలో మాత్రం బతుకమ్మ రూపంలో భిన్నంగా ఘనంగా, చూడముచ్చటగా జరుగుతాయి.

కోల్కతాలో దేవి నవరాత్రులు:
దేవి నవరాత్రుల పేరు వచ్చిందంటే ముందుగా గుర్తొచ్చే రాష్ట్రం పశ్చిమ బెంగాల్. ఈ రాష్ట్రంలో దేవి శరన్నవరాత్రులు ఎంతో భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ప్రతీ వీధి దేవి నామస్మరణతో మార్మోగిపోతోంది. దసరా ఉత్సవాల సందర్భంగా కోల్కతా మొత్తం ప్రత్యేక శోభను సంతరించుకుంటుంది. ఇక్కడ స్థానిక సాంప్రదాయ నృత్య కేరింతలు ఆకట్టుకుంటాయి.
ఢిల్లీలో రామ్ లీలా ఉత్సవాలు:
దేశ రాజధాని ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో నిర్వహించే దసరా ఉత్సవాలు అన్నిటికంటే అత్యంత వైభవంగా జరుగుతాయి. తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి.. పదోరోజు రామ్ లీలా మైదానంలో రావణాసురుడిని దహనం చేస్తారు. దసరా ఉత్సవాల సందర్భంగా రంగస్థల నటులు రామాయణం నాటాకాన్ని ప్రదర్శిస్తారు. ఈ అత్యంత ఘనమైన వేడుకలను చూసేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు, పర్యాటకులు ఢిల్లీకి వెళ్తుంటారు.

మైసూర్ దసరా ఉత్సవాలు:
కర్ణాటకలోని మైసూరు ప్యాలెస్ లో నిర్వహించే దసరా ఉత్సవాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. దసరా పండగ రోజున ప్యాలెస్ ను ముస్తాబు చేసి, అంగరంగ వైభవంగా మైసూరు రాజ వంశస్థులు నిర్వహిస్తారు. దసరా ఉత్సవాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, కళాకారుల ప్రదర్శనలు, వివిధ పోటీలు నిర్వహించి ఘనంగా జరుపుతారు. ఈ ఉత్సవాలను చూసేందుకు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకతో పాటు దేశం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు.

కులు రఘునాథ శోభ యాత్ర:
అత్యంత వైభవంగా జరిగే దసరా ఉత్సవాల్లో హిమాచల్ ప్రదేశ్ లోని కులులో నిర్వహించే రఘునాథుడి శోభాయాత్ర ఒకటి. ఈ శోభాయాత్రను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. కులు అందాల నడుమ రఘునాథుడి శోభాయాత్ర చూడడానికి ఎంతో అందంగా, అద్భుతంగా ఉంటుంది. ఈ శోభాయాత్ర సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ రకాల పోటీలు పర్యాటకులను, వీక్షకులను ఆకట్టుకుంటాయి.



Click it and Unblock the Notifications











