Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఆలస్యంగా ఆఫీసుకు వచ్చే కంపెనీ ఉద్యోగులకు ఫైన్, బాస్ ఐడియా రివర్స్
ప్రైవేట్ లేదా ప్రభుత్వ కార్యాలయంలో ఈ రోజు ప్రతి ఒక్కరిలో పోటీ ఉంది. అటువంటి పరిస్థితిలో టైమింగ్స్ అనేది ఒక ముఖ్యమైన అంశం, ఇది ఏదైనా వ్యాపార విజయంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రైవేట్ కార్యాలయాల్లో ఉద్యోగులు ఆలస్యంగా వస్తుంటారు. ఈ సమస్యను పరిష్కరించడానికి, తరచుగా జరిమానా విధించబడుతుంది.
దీని వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటంటే ఉద్యోగులను సమయానికి చేరుకోవడానికి, క్రమశిక్షణను తీసుకురావడానికి ముంబాయిలోని ఒక స్టార్టప్ కంపెనీ యజమాని ఇదే విధమైన పని చేసాడు.

అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బాస్ ఆదేశాలే అతడిని కొంపలు ముంచేశాయి. అది ఎలాగో తెలుసుకున్న అదే కంపెనీ యజమాని తరువాత తల పట్టుకున్నాడు. ముంబాయిలోని ఐవోర్ బ్యూటీ కంపెనీ యజమాని కౌశల్ మాట్లాడుతూ గత వారం ఆఫీసులో ప్రాడక్ట్ పెంచేందుకు ఉద్యోగులు అందరూ ఉదయం 9. 30 గంటలకే కచ్చితంగా ఆఫీసుకు రావాలని నిబంధన పెట్టాడు. ఎలాగూ ఫైన్ కడుతాము కదా అంటూ చాలా మంది ఉద్యోగులు 10 గంటలకు, కొందరు 11 గంటలకు రావడం మొదలుపెట్టారు.
కంపెనీ బాస్ కొత్త రూల్ పెట్టాడు. ఉద్యోగానికి ఆలస్యంగా వస్తే రూ. 200 జరిమానాగా చెల్లించాలనే నిబంధనను అమలు చేశారు. ఈ నిబంధనను బాస్ ఆ కంపెనీలో పని చేసే ఉద్యోగులందరికీ అమలు చేశారు.
ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ కంపెనీ బాస్ తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. నేను 5 వ సారి ఫైన్ కట్టానని ఆ కంపెనీ యజమాని కౌశల్ తెలిపాడు. ఇప్పటి వరకు కౌశల్ మొత్తం రూ.1,000 జరిమానా చెల్లించాల్సి వచ్చింది.
ఈ పోస్ట్ వెనుక నా ఉద్దేశ్యం తప్పుగా అర్థం చేసుకున్నట్లు కనిపిస్తోందని, మీరు మీ ఉద్యోగుల కోసం ఏదైనా నియమాలు చేస్తే మీరు మొదట వాటిని పాటించాలని ఆయన అన్నారు. నా స్వంత మనీ వాలెట్లో జరిమానా చెల్లించడం జరిగింది. నేను ప్రత్యేకంగా టీమ్ ఫండ్గా ప్రత్యేక UPI లైట్ ఖాతాను సృష్టించానని దయచేసి గమనించండి. సేకరించిన ఫైన్ డబ్బు ఉద్యోగులకు ఆహారం, ఇతర ఈవెంట్ల వంటి ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించబడుతుంది అని కంపెనీ బాస్ వివరించాడు.
.ఈ దెబ్బకు కంపెనీ బాస్ కు పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మీరు మీ కంపెనీని హైలైట్ చేయాలనుకుంటున్న దానితో నేను ఏకీభవిస్తున్నాను. కానీ ఇప్పుడు సమయ భాగానికి తిరిగి వద్దాం అని ఒక వినియోగదారు చెప్పారు. ఉద్యోగులు నిర్దిష్ట సమయానికి వస్తే ప్రాడెక్ట్ ఎందుకు పెరుగుతుందని మీరు అనుకుంటున్నారు? లాగిన్ సమయం, ప్రాడెక్ట్ మధ్య సంబంధాన్ని మీరు ఎలా కనుగొన్నారు? మేము స్పష్టత కోసం డేటాను చూడగలమా? అని ప్రశ్నించారు.
మరో నెటిజన్ అయితే మీరు పాఠశాల సంస్కృతిని కంపెనీలో సృష్టించడం పద్దతిగా లేదని, మీరు కంపెనీ బాస్ లాగా, ఓ పెద్ద మనిషిగా ప్రవర్తించండి అని మరొక నెటిజన్ ఆ కంపెనీ యజమానికి ఉచిత సలహా ఇచ్చాడు. ఆఫీసుకు సక్రమంగా ఉద్యోగులు వచ్చేలా చేయండి, దానికి ఫైన్ రూల్ పెట్టడం సరైన నిర్ణయం కాదని, మీ కంపెనీ ఉన్నత స్థానానికి తీసుకువెళ్లాలంటే కొన్ని పద్దతులు ఉన్నాయి, దీన్ని ఎలా చేయాలో మీకు చిట్కాలు కావాలంటే మమ్మల్ని సంప్రదించడానికి సంకోచించకండి అని ఓ నెటిజన్ సూచించాడు.
ఐదవసారి జరిమానా చెల్లించినప్పుడు కంపెనీకి రావడం ఒక్కోసారి ఆలస్యం అవుతుందని మీరే అర్థం చేసుకోవాలని ఒక నెటిజన్ సూచించాడు. మీరు ముంబాయిలో నివసిస్తున్నారని, రైలులో ప్రయాణం, రద్దీ, వర్షం, రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని ముందు మీరు తెలుసుకోండి అంటూ మరో నెటిజన్ ఉచిత సలహా ఇచ్చాడు. మొత్తం మీద ఆ కంపెనీ యజమాని పెట్టిన ఫైన్ రూల్, ఆయన ఐదు సార్లు ఫైన్ కట్టడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.



Click it and Unblock the Notifications