Latest Updates
-
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా..
పిల్లాడి తుంటరి పనికి 4 కోట్ల ఫైన్, వెంగిలి వేలితో అలా చేయడంతో జపాన్ కంపెనీ దావా
పిల్లలు తుంటరి పనులు చేస్తుంటారు. అది చాలా సాధారణం. జపాన్ లోని ఓ కుర్రాడు కూడా అలాగే తుంటరి పని చేశాడు. ఇప్పుడు ఏకంగా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాడు. జపాన్ లోని ఓ రెస్టారెంట్ కు వెళ్లిన కుర్రాడు అక్కడ అల్లరి పని చేశాడు. తనతో వచ్చిన మరో వ్యక్తి దానినంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. అదే సమయంలో సుషీర్ చైన్ అనే వ్యాపార సంస్థకు 16 బిలియన్ యెన్ ల నష్టాన్ని తెచ్చిపెట్టింది.

అసలేం జరిగిందంటే?
జపాన్ లోని ప్రధాన కన్వేయర్ బెల్ట్ సుషీ రెస్టారెంట్ చైన్, సుషిరో కు చెందిన అవుట్లెట్లలో ఒకదానికి ఓ పిల్లాడు వెళ్లాడు. తనతో పాటు మరో వ్యక్తి వచ్చాడు. అక్కడ ఆ పిల్లాడు అల్లరి పని చేశాడు. తనతో పాటు వచ్చిన మరో వ్యక్తి దానినంతా వీడియో తీశాడు.
ఆ వీడియోలో ఏముందంటే.. ఆ పిల్లాడు సోయా సాస్ ను నోట్లో వేసుకున్నాడు. తర్వాత పక్కనే ఉన్న ఓ కప్ ను తీసుకుని దానిని నాలుకతో మొత్తం నాకేసి దాని స్థానంలో పెట్టేశాడు. తర్వాత తన వేలికి లాలాజలం రాసుకుని పక్కనుండి కన్వేయర్ బెల్ట్ పై వెళ్తున్న సుషీ పాసింగ్ ప్లేట్ ను తాకాడు. ఇదంతా ఆ వీడియోలో కనిపించింది. ఈ తుంటరి పని వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా.. అది కాస్త వైరల్ గా మారింది.
రెస్టారెంట్ లో ఆ బాలుడు చేసిన పనితో ఆ రెస్టారెంట్ పై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లింది. అక్కడి హైజీన్ పై ప్రశ్నలు తలెత్తాయి. అపరిశుభ్రత గురించి ఆందోళన వ్యక్తం అయింది. దీంతో జపాన్ వ్యాప్తంగా 'సుషీ టెర్రరిజం' అనే పదం కూడా ట్రెండ్ లోకి వచ్చింది. 'సుషీ టెర్రరిజం' అంటే రెస్టారెంట్లలో కావాలనే చేసే అపరిశుభ్రమైన ప్రవర్తనగా ప్రజలు అభివర్ణిస్తున్నారు.
దీంతో ఆ కంపెనీ నష్టాలు వచ్చాయి. ఆ బాలుడు చేసిన పనికి ఏకంగా సుషిరో కంపెనీ 16 బిలియన్ యెన్ లు నష్టపోయింది. దీంతో ఆ కుర్రాడిపై సుషిరో కంపెనీ దావా వేసింది. $480,000 USD (రూ. 3,95,86,995) నష్టపరిహారం కట్టాలంటూ కోర్టులో దావా వేసింది. కంపెనీ నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
కంపెనీ ఏం చెబుతోందంటే?
45 సెకన్ల నిడివి గల వీడియోతో తమ మార్కెట్ క్యాపిటలైజేషన్ కు 16 బిలియన్ యెన్ ల పడిపోయిందని కంపెనీ పేర్కొంది. ఈ సంఘటన తర్వాత కంపెనీ అనేక చర్యలు తీసుకుంది. దేశవ్యాప్తంగా 600 కంటే ఎక్కువ ఉన్న ఔట్లెట్లలో ప్లాస్టిక్ బారియర్స్ ఏర్పాటు చేసింది. ఇందుకోసం 90 మిలియన్ యెన్ లు ఖర్చు చేసింది ఆ సంస్థ.



Click it and Unblock the Notifications