Latest Updates
-
దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే!
పిల్లాడి తుంటరి పనికి 4 కోట్ల ఫైన్, వెంగిలి వేలితో అలా చేయడంతో జపాన్ కంపెనీ దావా
పిల్లలు తుంటరి పనులు చేస్తుంటారు. అది చాలా సాధారణం. జపాన్ లోని ఓ కుర్రాడు కూడా అలాగే తుంటరి పని చేశాడు. ఇప్పుడు ఏకంగా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాడు. జపాన్ లోని ఓ రెస్టారెంట్ కు వెళ్లిన కుర్రాడు అక్కడ అల్లరి పని చేశాడు. తనతో వచ్చిన మరో వ్యక్తి దానినంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. అదే సమయంలో సుషీర్ చైన్ అనే వ్యాపార సంస్థకు 16 బిలియన్ యెన్ ల నష్టాన్ని తెచ్చిపెట్టింది.

అసలేం జరిగిందంటే?
జపాన్ లోని ప్రధాన కన్వేయర్ బెల్ట్ సుషీ రెస్టారెంట్ చైన్, సుషిరో కు చెందిన అవుట్లెట్లలో ఒకదానికి ఓ పిల్లాడు వెళ్లాడు. తనతో పాటు మరో వ్యక్తి వచ్చాడు. అక్కడ ఆ పిల్లాడు అల్లరి పని చేశాడు. తనతో పాటు వచ్చిన మరో వ్యక్తి దానినంతా వీడియో తీశాడు.
ఆ వీడియోలో ఏముందంటే.. ఆ పిల్లాడు సోయా సాస్ ను నోట్లో వేసుకున్నాడు. తర్వాత పక్కనే ఉన్న ఓ కప్ ను తీసుకుని దానిని నాలుకతో మొత్తం నాకేసి దాని స్థానంలో పెట్టేశాడు. తర్వాత తన వేలికి లాలాజలం రాసుకుని పక్కనుండి కన్వేయర్ బెల్ట్ పై వెళ్తున్న సుషీ పాసింగ్ ప్లేట్ ను తాకాడు. ఇదంతా ఆ వీడియోలో కనిపించింది. ఈ తుంటరి పని వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా.. అది కాస్త వైరల్ గా మారింది.
రెస్టారెంట్ లో ఆ బాలుడు చేసిన పనితో ఆ రెస్టారెంట్ పై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లింది. అక్కడి హైజీన్ పై ప్రశ్నలు తలెత్తాయి. అపరిశుభ్రత గురించి ఆందోళన వ్యక్తం అయింది. దీంతో జపాన్ వ్యాప్తంగా 'సుషీ టెర్రరిజం' అనే పదం కూడా ట్రెండ్ లోకి వచ్చింది. 'సుషీ టెర్రరిజం' అంటే రెస్టారెంట్లలో కావాలనే చేసే అపరిశుభ్రమైన ప్రవర్తనగా ప్రజలు అభివర్ణిస్తున్నారు.
దీంతో ఆ కంపెనీ నష్టాలు వచ్చాయి. ఆ బాలుడు చేసిన పనికి ఏకంగా సుషిరో కంపెనీ 16 బిలియన్ యెన్ లు నష్టపోయింది. దీంతో ఆ కుర్రాడిపై సుషిరో కంపెనీ దావా వేసింది. $480,000 USD (రూ. 3,95,86,995) నష్టపరిహారం కట్టాలంటూ కోర్టులో దావా వేసింది. కంపెనీ నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
కంపెనీ ఏం చెబుతోందంటే?
45 సెకన్ల నిడివి గల వీడియోతో తమ మార్కెట్ క్యాపిటలైజేషన్ కు 16 బిలియన్ యెన్ ల పడిపోయిందని కంపెనీ పేర్కొంది. ఈ సంఘటన తర్వాత కంపెనీ అనేక చర్యలు తీసుకుంది. దేశవ్యాప్తంగా 600 కంటే ఎక్కువ ఉన్న ఔట్లెట్లలో ప్లాస్టిక్ బారియర్స్ ఏర్పాటు చేసింది. ఇందుకోసం 90 మిలియన్ యెన్ లు ఖర్చు చేసింది ఆ సంస్థ.



Click it and Unblock the Notifications