Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
చనిపోయిన తాతలా ప్రవర్తిస్తున్న మనవడు.. అమ్మమ్మను భార్యగా, తల్లిని కుమార్తెగా పిలుస్తున్న బాలుడు
చనిపోయిన వ్యక్తులు మళ్లీ పుడుతుంటారని చాలా మంది నమ్ముతుంటారు. పునర్జన్మ నిజమేనని.. మోక్షం పొందే వరకు మళ్లీ మళ్లీ జన్మిస్తూనే ఉంటామని బలంగా విశ్వసిస్తారు. శరీరం శాశ్వతం కాదని, ఆత్మ మాత్రమే శాశ్వతమని చెబుతుంటారు. పాత చొక్కా విడిచేసి కొత్త చొక్కా వేసుకున్నట్లు.. పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరంలోకి ఆత్మ ప్రవేశిస్తుందని అంటారు. ఆత్మ అలా మరో శరీరంలోకి ప్రవేశించినప్పుడు అన్నీ మర్చిపోతుంటామని, గత జన్మల గురించి ఏదీ గుర్తుండదని కూడా అంటారు.

చిన్న వాళ్లు పెద్ద వారిగా ప్రవర్తించడం, పుట్టగానే మాట్లాడటం, పుడుతూనే ఎడవకుండా గత జన్మల గురించి చెప్పడం, చిన్న పిల్లలు పూర్వజన్మల గురించి బోధించడం లాంటి వాటి గురించి చాలా మంది చాలా సార్లు వినే ఉంటారు. అవి ఎంతవరకు నిజాలు అనే దానికి సరైన ఆధారాలు లేవు కానీ.. కొందరు మాత్రం వాటిని బలంగా విశ్వసిస్తారు.
అమ్మమ్మే నా భార్య, అమ్మ నా కూతురు..
తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తర్ ప్రదేశ్లోని మైన్పురి జిల్లాలో జరిగింది. ఓ ఎనిమిదేళ్ల బాలుడు పూర్వజన్మ గురించి చెబుతుండటం ఇప్పుడు వార్తల్లో చర్చనీయాంశంగా మారింది. అమ్మమ్మ తన భార్య అని, తల్లి తన కుమార్తె అని, మేన మామలు తన కుమారులంటూ ఆ పిల్లాడు చెబుతుండటం కుటుంబ సభ్యులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
తాత చనిపోయిన 20 రోజులకు జన్మించిన బాలుడు:
2015 జనవరి 9వ తేదీన మనోజ్ మిశ్ర అనే వ్యక్తి చనిపోయాడు. ఉత్తర్ ప్రదేశ్లోని రతన్ పుర్లో పొలానికి నీరు పారించేందుకు వెళ్లి పాము కాటుకు గురవ్వడంతో మనోజ్ మిశ్ర చనిపోయాడు. మనోజ్ కు భార్య, ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. మనోజ్ మిశ్ర చనిపోయే నాటికే వారికి పెళ్లిళ్లు అయిపోయాయి. మనోజ్ మిశ్ర చనిపోయే సమయంలో అతని కుమార్తె రంజన నిండు గర్భంతో ఉంది. మనోజ్ చనిపోయిన 20 రోజులకు ఆమెకు కుమారుడు పుట్టాడు. అతడికి ఆర్యన్ అని పేరు పెట్టుకున్నారు.
అమ్మమ్మ ఇంటికెళ్లి.. తన పేరును మనోజ్గా చెప్పిన బాలుడు:
ప్రస్తుతం ఆర్యన వయస్సు 8 సంవత్సరాలు. జూన్ 15వ తేదీన అమ్మమ్మ ఇంటికి వెళ్లిన ఆర్యన్ అప్పటి నుంచి విచిత్రంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. తన తాత పేరు మనోజ్ మిశ్ర కాగా.. అదే తన పేరు అని చెబుతున్నాడు. అమ్మమ్మే తన భార్య అని, తన తల్లిని కుమార్తె అని, మేనమామలను కుమారులను సంభోదించాడు. తన పేరిట బ్యాంకులో డబ్బులు కూడా ఉన్నాయని కూడా చెప్పాడు.
ఈ వార్త విన్న గ్రామస్థులు అంతా ఆ ఇంటి వద్దకు పెద్ద ఎత్తున చేరుకుని ఆ బాలుడి వింత ప్రవర్తన చూసి ఆశ్చర్యపోతున్నారు. కొందరు నిజంగానే పునర్జన్మ ఉందని నమ్ముతున్నారు. తిరిగి తన ఇంటికి రావడంతోనే గత జన్మ మొత్తం గుర్తుకు వచ్చి ఉంటుందని స్థానికులు అనుకుంటున్నారు.



Click it and Unblock the Notifications











