Latest Updates
-
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి!
చనిపోయిన తాతలా ప్రవర్తిస్తున్న మనవడు.. అమ్మమ్మను భార్యగా, తల్లిని కుమార్తెగా పిలుస్తున్న బాలుడు
చనిపోయిన వ్యక్తులు మళ్లీ పుడుతుంటారని చాలా మంది నమ్ముతుంటారు. పునర్జన్మ నిజమేనని.. మోక్షం పొందే వరకు మళ్లీ మళ్లీ జన్మిస్తూనే ఉంటామని బలంగా విశ్వసిస్తారు. శరీరం శాశ్వతం కాదని, ఆత్మ మాత్రమే శాశ్వతమని చెబుతుంటారు. పాత చొక్కా విడిచేసి కొత్త చొక్కా వేసుకున్నట్లు.. పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరంలోకి ఆత్మ ప్రవేశిస్తుందని అంటారు. ఆత్మ అలా మరో శరీరంలోకి ప్రవేశించినప్పుడు అన్నీ మర్చిపోతుంటామని, గత జన్మల గురించి ఏదీ గుర్తుండదని కూడా అంటారు.

చిన్న వాళ్లు పెద్ద వారిగా ప్రవర్తించడం, పుట్టగానే మాట్లాడటం, పుడుతూనే ఎడవకుండా గత జన్మల గురించి చెప్పడం, చిన్న పిల్లలు పూర్వజన్మల గురించి బోధించడం లాంటి వాటి గురించి చాలా మంది చాలా సార్లు వినే ఉంటారు. అవి ఎంతవరకు నిజాలు అనే దానికి సరైన ఆధారాలు లేవు కానీ.. కొందరు మాత్రం వాటిని బలంగా విశ్వసిస్తారు.
అమ్మమ్మే నా భార్య, అమ్మ నా కూతురు..
తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తర్ ప్రదేశ్లోని మైన్పురి జిల్లాలో జరిగింది. ఓ ఎనిమిదేళ్ల బాలుడు పూర్వజన్మ గురించి చెబుతుండటం ఇప్పుడు వార్తల్లో చర్చనీయాంశంగా మారింది. అమ్మమ్మ తన భార్య అని, తల్లి తన కుమార్తె అని, మేన మామలు తన కుమారులంటూ ఆ పిల్లాడు చెబుతుండటం కుటుంబ సభ్యులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
తాత చనిపోయిన 20 రోజులకు జన్మించిన బాలుడు:
2015 జనవరి 9వ తేదీన మనోజ్ మిశ్ర అనే వ్యక్తి చనిపోయాడు. ఉత్తర్ ప్రదేశ్లోని రతన్ పుర్లో పొలానికి నీరు పారించేందుకు వెళ్లి పాము కాటుకు గురవ్వడంతో మనోజ్ మిశ్ర చనిపోయాడు. మనోజ్ కు భార్య, ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. మనోజ్ మిశ్ర చనిపోయే నాటికే వారికి పెళ్లిళ్లు అయిపోయాయి. మనోజ్ మిశ్ర చనిపోయే సమయంలో అతని కుమార్తె రంజన నిండు గర్భంతో ఉంది. మనోజ్ చనిపోయిన 20 రోజులకు ఆమెకు కుమారుడు పుట్టాడు. అతడికి ఆర్యన్ అని పేరు పెట్టుకున్నారు.
అమ్మమ్మ ఇంటికెళ్లి.. తన పేరును మనోజ్గా చెప్పిన బాలుడు:
ప్రస్తుతం ఆర్యన వయస్సు 8 సంవత్సరాలు. జూన్ 15వ తేదీన అమ్మమ్మ ఇంటికి వెళ్లిన ఆర్యన్ అప్పటి నుంచి విచిత్రంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. తన తాత పేరు మనోజ్ మిశ్ర కాగా.. అదే తన పేరు అని చెబుతున్నాడు. అమ్మమ్మే తన భార్య అని, తన తల్లిని కుమార్తె అని, మేనమామలను కుమారులను సంభోదించాడు. తన పేరిట బ్యాంకులో డబ్బులు కూడా ఉన్నాయని కూడా చెప్పాడు.
ఈ వార్త విన్న గ్రామస్థులు అంతా ఆ ఇంటి వద్దకు పెద్ద ఎత్తున చేరుకుని ఆ బాలుడి వింత ప్రవర్తన చూసి ఆశ్చర్యపోతున్నారు. కొందరు నిజంగానే పునర్జన్మ ఉందని నమ్ముతున్నారు. తిరిగి తన ఇంటికి రావడంతోనే గత జన్మ మొత్తం గుర్తుకు వచ్చి ఉంటుందని స్థానికులు అనుకుంటున్నారు.



Click it and Unblock the Notifications