Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
మన దేశంలోని అక్కడ ఒక్క పాము కూడా ఉండదు..ఏ రాష్ట్రమో తెలుసా!
భూ గ్రహం మీద పర్యావరణ వ్యవస్థను కాపాడటంలో పాములు ముఖ్యమైన పోషిస్తాయి. అంటార్కిటికా మినహా ప్రతి ఖండంలోనూ పాములు కనిపిస్తాయి. మహాసముద్రాలు,ఎడారులతో సహా వివిధ వాతావరణాలలో పాములు కనిపిస్తాయి. చాలా పాములు భూగర్భంలో, చెట్ల కొమ్మలపై కూడా కనిపిస్తాయి. అవి వివిధ పరిమాణాలు, రంగులలో ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో ప్రజలు పాముకాటుతో చనిపోతున్నారు. మనదేశంలో 2001-2020 మధ్య కాలంలో పాముకాటు కారణంగా 12 లక్షల మంది మరణించినట్లు ఓ రిపోర్ట్ చెబుతోంది.
మనదేశంలో పాము జాతులు,మనిషిని చంపగలిగేవి
ప్రపంచవ్యాప్తంగా 3900 కంటే ఎక్కువగా ఉన్న పాము జాతులలో కేవలం 600 మాత్రమే విషపూరితమైనవిగా గుర్తించబడ్డాయి. అయితే ఈ విషపూరిత పాముల్లో కూడా 200 మాత్రమే మానవుడిని చంపగలిగేంత పవర్ కలిగి ఉంటాయి. భారతదేశంలో 350 కంటే ఎక్కువ జాతుల పాములు కనిపిస్తాయి. మనదేశంలో ముఖ్యంగా పల్లెటూర్లలోని పొలాల్లో పాములు ఎక్కువగా కనబడుతుంటాయి. చెట్లమీద పుట్లమీద నివసించే వీటికి మనవాళ్లు ఆహారం కూడా పెడుతుంటారు. పొలాల్లో పనికి వెళ్లే రైతులు తమ వెంట తీసుకెళ్లే భోజనం బాక్స్ లో నుంచి కొంత ఆహారాన్ని పాములు,పక్షలు కోసం వదిలిపెడుతుంటారు. అయితే మనదేశంలో అసలు పాములే లేని ప్రదేశం ఒకటుందని మీకు తెలుసా?

ఒక్క పాము కూడా ఉండదు
మనదేశంలోని కేరళ రాష్ట్రం పాములకు స్వర్గధామం. ఎందుకంటే దేశంలోనే అత్యధిక పాములు ఉన్న రాష్ట్రం ఇదే. అయితే అత్యధిక రకాల పాములు కనిపించే రాష్ట్రం కేరళ అయినప్పటికీ..కేరళ రాష్ట్రంలో భాగంగా ఉండే కేంద్రపాలిత ప్రాంతం అయిన లక్షద్వీప్ లో మాత్రం అసలు ఒక్క పాము కూడా ఉండదు. లక్షద్వీప్ భారతదేశం మొత్తంలో 'స్నేక్ ఫ్రీ(snake free)' ప్లేస్ గా గుర్తించబడింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇక్కడ పాములే కాదు..కుక్కలు కూడా కనిపించవు.
సుముద్రపు ఆవుని చూడొచ్చు
అంతరించిపోతున్న కేటగిరిలో ఉన్న సిరేనియా లేదా 'సముద్రపు ఆవు'ని లక్షద్వీప్ లో చూడవచ్చు. లక్షద్వీప్..మొత్తం 36 చిన్న ద్వీపాలను కలిగి ఉంది. అయితే వీటిలో కేవలం 10 దీవులు మాత్రమే మానవ నివాసయోగ్యమైనవి. లక్షద్వీప్ మొత్తం జనాభా దాదాపు 64,000. 32 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న లక్షద్వీప్ జనాభాలో 96% మంది ముస్లిం మతానికి చెందినవారు.
చలికాలంలో జాగ్రత్త
చలికాలంలో పాములు చలి నుంచి తమను తాము రక్షించుకోవడానికి వెచ్చదనం ఉండే ప్లేస్ ల కోసం వెతుక్కుంటాయి. ఈ క్రమంలో ఇళ్లలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా చలికాలంలో పాము కాటుకు గురయ్యే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సీజన్ లో తగిన జాగ్రత్తలు తీసుకొని పాములు ఇళ్లల్లోకి రాకుండా చూసుకోండి.



Click it and Unblock the Notifications