Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
మన దేశంలోని అక్కడ ఒక్క పాము కూడా ఉండదు..ఏ రాష్ట్రమో తెలుసా!
భూ గ్రహం మీద పర్యావరణ వ్యవస్థను కాపాడటంలో పాములు ముఖ్యమైన పోషిస్తాయి. అంటార్కిటికా మినహా ప్రతి ఖండంలోనూ పాములు కనిపిస్తాయి. మహాసముద్రాలు,ఎడారులతో సహా వివిధ వాతావరణాలలో పాములు కనిపిస్తాయి. చాలా పాములు భూగర్భంలో, చెట్ల కొమ్మలపై కూడా కనిపిస్తాయి. అవి వివిధ పరిమాణాలు, రంగులలో ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో ప్రజలు పాముకాటుతో చనిపోతున్నారు. మనదేశంలో 2001-2020 మధ్య కాలంలో పాముకాటు కారణంగా 12 లక్షల మంది మరణించినట్లు ఓ రిపోర్ట్ చెబుతోంది.
మనదేశంలో పాము జాతులు,మనిషిని చంపగలిగేవి
ప్రపంచవ్యాప్తంగా 3900 కంటే ఎక్కువగా ఉన్న పాము జాతులలో కేవలం 600 మాత్రమే విషపూరితమైనవిగా గుర్తించబడ్డాయి. అయితే ఈ విషపూరిత పాముల్లో కూడా 200 మాత్రమే మానవుడిని చంపగలిగేంత పవర్ కలిగి ఉంటాయి. భారతదేశంలో 350 కంటే ఎక్కువ జాతుల పాములు కనిపిస్తాయి. మనదేశంలో ముఖ్యంగా పల్లెటూర్లలోని పొలాల్లో పాములు ఎక్కువగా కనబడుతుంటాయి. చెట్లమీద పుట్లమీద నివసించే వీటికి మనవాళ్లు ఆహారం కూడా పెడుతుంటారు. పొలాల్లో పనికి వెళ్లే రైతులు తమ వెంట తీసుకెళ్లే భోజనం బాక్స్ లో నుంచి కొంత ఆహారాన్ని పాములు,పక్షలు కోసం వదిలిపెడుతుంటారు. అయితే మనదేశంలో అసలు పాములే లేని ప్రదేశం ఒకటుందని మీకు తెలుసా?

ఒక్క పాము కూడా ఉండదు
మనదేశంలోని కేరళ రాష్ట్రం పాములకు స్వర్గధామం. ఎందుకంటే దేశంలోనే అత్యధిక పాములు ఉన్న రాష్ట్రం ఇదే. అయితే అత్యధిక రకాల పాములు కనిపించే రాష్ట్రం కేరళ అయినప్పటికీ..కేరళ రాష్ట్రంలో భాగంగా ఉండే కేంద్రపాలిత ప్రాంతం అయిన లక్షద్వీప్ లో మాత్రం అసలు ఒక్క పాము కూడా ఉండదు. లక్షద్వీప్ భారతదేశం మొత్తంలో 'స్నేక్ ఫ్రీ(snake free)' ప్లేస్ గా గుర్తించబడింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇక్కడ పాములే కాదు..కుక్కలు కూడా కనిపించవు.
సుముద్రపు ఆవుని చూడొచ్చు
అంతరించిపోతున్న కేటగిరిలో ఉన్న సిరేనియా లేదా 'సముద్రపు ఆవు'ని లక్షద్వీప్ లో చూడవచ్చు. లక్షద్వీప్..మొత్తం 36 చిన్న ద్వీపాలను కలిగి ఉంది. అయితే వీటిలో కేవలం 10 దీవులు మాత్రమే మానవ నివాసయోగ్యమైనవి. లక్షద్వీప్ మొత్తం జనాభా దాదాపు 64,000. 32 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న లక్షద్వీప్ జనాభాలో 96% మంది ముస్లిం మతానికి చెందినవారు.
చలికాలంలో జాగ్రత్త
చలికాలంలో పాములు చలి నుంచి తమను తాము రక్షించుకోవడానికి వెచ్చదనం ఉండే ప్లేస్ ల కోసం వెతుక్కుంటాయి. ఈ క్రమంలో ఇళ్లలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా చలికాలంలో పాము కాటుకు గురయ్యే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సీజన్ లో తగిన జాగ్రత్తలు తీసుకొని పాములు ఇళ్లల్లోకి రాకుండా చూసుకోండి.



Click it and Unblock the Notifications