Latest Updates
-
పాకం పట్టే పనే లేదు..మన తాతమ్మల కాలం నాటి హెల్దీ జొన్న లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
మీ భర్తతో ఈ 4 మాటలు అంటున్నారా? అయితే మీ కాపురంలో చిచ్చు రేగినట్టే! -
పోషకాల గని, ఆరోగ్యానికి పెన్నిధి.. గోధుమ రవ్వ కిచిడీ ఎలా చేసుకోవాలంటే.. -
స్నేహితురాలికి ఆశ్రయం ఇస్తే.. బాయ్ ఫ్రెండ్ వింత ప్రవర్తన..ప్రియురాలి ఆవేదన! -
బయట బండి మీద దొరికే రుచితో ఇంట్లోనే భేల్ పూరీ.. ఒక్కసారి రుచి చూస్తే వదలరు! -
ఇడ్లీ, దోసెల్లోకి ఈసారి వంకాయ చట్నీ రుచి చూడండి..లెక్కపెట్టకుండా తినేస్తారు -
హైదరాబాద్ స్పెషల్ ఇరానీ ఛాయ్.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి! -
చపాతీ, పూరీ, పులావ్ లలోకి అదిరిపోయే మీల్ మేకర్ మసాలా గ్రేవీ.. నాన్ వెజ్ కూడా దీని ముందు దిగదుడుపే! -
ఒకే రకమైన మందులు.. వేర్వేరు ఫలితాలు..లివర్ డ్యామేజ్ వెనుక ఉన్న రహస్యం ఇదే! -
హ్యాపీ హోలీ 2026..మీ బంధుమిత్రులకు పంపడానికి బెస్ట్ హోలీ విషెస్, వాట్సాప్ స్టేటస్ లు ఇవే!
తాజ్ మహల్ కట్టడానికి షాజహాన్ కి ఆ భూమి ఇచ్చింది ఎవరో తెలుసా!..షాకింగ్ నిజం
ఏడు ప్రపంచ వింతల్లో ఆగ్రాలోని తాజ్ మహల్ ఒకటి. ఆగ్రాలో యమునా నద్ది ఒడ్డున ఉన్న ఈ పాలరాతి కట్టడాన్ని ప్రతిఏటా లక్షల మంది దేశవిదేశాల నుంచి పర్యాటకులు సందర్శిస్తుంటారు. 1983లో యునెస్కో తాజ్ మహల్ ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. భారత్ లో మోస్ట్ పాపులర్ ఫెస్టివల్స్ లో ఒకటైన తాజ్ మహోత్సవ్ కూడా ఫిబ్రవరి 18 నుంచి మార్చి 2 వరకు 13 రోజుల పాటు తాజ్ మహల్ తూర్పు గేటు దగ్గర సిల్పగ్రామ్ లో ఘనంగా జరిగింది. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ జ్ణాపకార్థం తాజ్ మహల్ నిర్మించినట్లు మన చరిత్ర పుస్తకాల్లో ఉంది.
తాజ్ మహల్ నిర్మించడానికి షాజహాన్ కి ఆ భూమి ఎవరు ఇచ్చారు
1631 జూన్ 17న తన 14వ బిడ్డకు జన్మనిచ్చే క్రమంలో ముంతాజ్ మరణించిందని, దీంతో షాజహాన్ పర్షియన్, ఒట్టోమన్, ఇండియన్, ఇస్లామిక్ ఆర్కిటెక్చరల్ స్టైల్స్ లో 1632లో తాజ్ మహల్ నిర్మాణాన్ని ప్రారంభించగా..1648లో ఇది పూర్తయినట్లు చరిత్ర మనకు చెబుతోంది. తాజ్ మహల్ నిర్మించబడిన భూమి ఆగ్రా నగరానికి దక్షిణాన ఉంది. మొఘల్ సామ్రాజ్య ఆస్థానంలో సీనియర్ జనరల్, హై ర్యాంకింగ్ మన్సబ్దార్, అంబర్ రాజ్యానికి చెందిన కచ్వాహా రాజ్పుత్ పాలకుడు మీర్జా రాజా జై సింగ్ I ఈ భూమిని షాజహాన్ కు ఇచ్చాడు. దీనికి ప్రతిగా మీర్జా రాజా జై సింగ్.. ఆగ్రా మధ్యలో ఒక పెద్ద రాజభవనాన్ని పొందాడు. షాజహాన్ కి అతను ఇచ్చిన భూమి రాబోయే శతాబ్దాల పాటు విస్మయాన్ని కలిగించే ఒక నిర్మాణ కళాఖండాన్ని కలిగి ఉంటుందని అతను కూడా అప్పట్లో ఊహించకపోయి ఉండవచ్చు.

ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి మెటీరియల్
తాజ్ మహల్ నిర్మాణం కోసం భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి వస్తువులు రవాణా చేయబడ్డాయి. తాజ్ నిర్మాణానికి ప్రధానంగా ఇటుక, సున్నపు మోర్టార్ ను, తెల్ల పాలరాయి ఉపయోగించారు. రాజస్థాన్ లోని మక్రానా నుండి తెల్ల పాలరాయి వచ్చింది, ఎర్ర ఇసుకరాయి ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్ సిక్రీ నుండి వచ్చింది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి అనేక విలువైన, పాక్షిక విలువైన రాళ్లను దిగుమతి చేసుకున్నారు. చైనా, టిబెట్, ఆఫ్ఘనిస్తాన్, అరేబియా నుంచి కూడా మెటీరియల్స్ ని దిగుమతి చేసుకున్నారు. మొత్తంమీద 28 రకాల విలువైన, పాక్షిక విలువైన రాళ్లను తెల్ల పాలరాయిలో పొదిగించారు.
ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి పెద్ద ఎత్తున కార్మికులు,కూలీలు ఆగ్రాకు ఈ కట్టడం నిర్మించడానికి వచ్చారు. తాజ్ నిర్మించడానికి 20,000 మందికి పైగా ఉన్న చేతివృత్తులవారు, కార్మికులు, చిత్రకారులు, ఇతరులు కూడా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చారు. బుఖారా నుండి నిపుణులైన శిల్పులు, పర్షియా, సిరియా నుండి కాలిగ్రాఫర్లు, బలూచిస్తాన్ నుండి రాతి కట్టర్లు, దక్షిణ భారతదేశం నుండి డిజైనర్లు, ఇటలీ నుండి చేతివృత్తులవారు తాజ్ నిర్మాణం కోసం ఆగ్రా వచ్చారు. భారతదేశంలోని ఇండో-ఇస్లామిక్ వాస్తుశిల్పం శిఖరాన్ని సూచించే ఈ స్మారక చిహ్నం ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి, భారతదేశం నుండి కూడా సహకారాన్ని కలిగి ఉంది. ఇది మధ్యయుగ యుగం నిర్మాణ నైపుణ్యానికి నిజమైన ప్రాతినిధ్యంగా నిలిచింది.
తాజ్ కింద శివలింగం
తాజ్ మహల్ ఉన్న ప్లేస్ లో ఒకప్పుడు శివాలయం ఉందని, శివాలయాన్ని కూలగొట్టి తాజ్ మహల్ నిర్మించారంటూ మరికొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. తాజ్ మహల్ కూల్చితే దానికి కింద ఖచ్చితంగా శివలింగం ఉంటుందంటూ కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో వదంతులు వినిపిస్తున్నాయి. దీంతో గతకొద్ది రోజులుగా తరచూ తాజ్ మహల్ వార్తల్లో నిలుస్తోంది.
తాజ్ మహల్ కి మరో పేరు
వందలాది కూలీలు రాత్రింబవళ్ళు కష్టపడి నిర్మించిన ఈ కట్టడం అందం వెనుక చరిత్ర స్మృతుల్లో బయటపడని నిజాలు కూడా ఉన్నాయి. వాస్తవానికి తాజ్ మహల్ ని నిర్మించినప్పుడు ప్రారంభంలో దానికి పెట్టిన పేరు 'రోజా ఈ మున్నావర(Roza -e-Munavvara)'..అంటే పర్షియాలో దీనర్థం అసమానమైన బిల్డింగ్ అని.



Click it and Unblock the Notifications











