Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
మన పౌరాణిక కథల్లో వున్న దేవుళ్లే ఏలియన్సా..? పరిశోధకులు చెబుతన్నదేంటంటే..!
చిన్నప్పటి నుంచి మనం స్వర్గం గురించి వింటూ వున్నాం. అన్ని మతగ్రంధాల్లో స్వర్గం, నరకం, దేవతల గురించి చెప్పివున్నారు. అయితే ఇదంతా నిజమేనా అని అనుమానం కలుగుతుంది. ప్రస్తుతం ఆధునిక యుగంలో టెక్నాలజీ బాగా పెరిగిన తరువాత ఈ మూఢనమ్మకాలకు తావు లేకుండా పోయింది. మనం నివసిస్తున్న భూమి అంరిక్షంలో కొన్ని గ్రహాల మధ్యలో వుందని తెలుసుకున్నాం. అయితే మనకు అంతా తెలుసు అనుకున్న లోపే మనకంటే 5 వేల నుంచి 10వేల సంవత్సరాల క్రితం బ్రతికన వారి గురించి ఇప్పటికీ పూర్తిగా తెలుసుకోలేక పోతున్నాం.
ఆ కాలంలో ఏ టెక్నాలజీ లేకపోయినా పిరమిడ్లను అంత కచ్ఛితంగా ఎలా నిర్మించగలిగారు. మొహెంజోదారో లాంటి అద్భుత నగరాన్ని ఎలా నిర్మించగలిగారు. భూమిపై అంతరించిపోయిన ఎన్నో సంస్కృతుల గురించి మనకు ఇంకా తెలియాల్సింది చాలా వుంది.

1901లో యాంటీకీతెరా అనే ద్వీపం దగ్గర మునిగిపోయిన ఒక ఓడలో 2000ల సంవత్సరాల పురాతన ఆనలాగ్ కంప్యూటర్ను కనుగ్గొన్నారు. దీన్ని యాంటీకితెరా మెకానిజం అని కూడా అంటారు. గడిచిపోయిన సంస్కృతిలో ఆధునిక సాంకేతిక వుందనడానికి ఇదొక సాక్ష్యంగా చెప్పవచ్చు.
ఎరిచ్ వన్ డానికెన్ అనే రచియత ఛారియట్స్ ఆఫ్ గాడ్ అనే పుస్తకంలో దీని గురించి ప్రత్యేకంగా వివరించాడు. ప్రస్తుతం మనకున్న సాంకేతిక పరిఘ్నానం వల్ల భవిష్యత్తులో కొన్నేల్ల తరువాత ఒక భారీ స్పేస్ షిప్ను నిర్మిస్తాము. ఈ స్పేస్ షిప్ సాయంతో మరికొన్నేళ్ల తరువాత వేరే గ్రహంపై ప్రయాణం చేస్తాము. దీనికి ఎన్నేళ్లయినా పట్టవచ్చు.
కానీ వేరే గ్రహంపై మనకు దిగిన తరువాత అక్కడున్న జీవరాశులకు ఎలా బ్రతకాలో తెలియకపోవ్చ. అక్కడున్న జీవరావులు కూడా మనము మొదట్లో ఆదివాసులుగా జీవించినట్టే జీవిస్తుండవచ్చు. అప్పుడు మనము వారికి అన్నింటినీ పరిచయం చేసి మన గ్రహాలకు తిరిగి వస్తాము. వారు మన విఘ్నానాన్ని ఉపయోగించుకుకొని ఎదుగుతారు. మనల్ని అక్కడున్న రాళ్లపై చెక్కి మనల్ని దేవుడిగా గుర్తిస్తారు. వారు మనల్ని దేవుడిగా చేస్తారు. సరిగ్గా ఇలాగే మనకు కూడా జరిగివుంటుందని రచయిత తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం మనం భావించే దేవుళ్లంతా ఏలియన్లుగా అనుకోవచ్చు.

వారు వేరే గ్రహంపై నుంచి మన గ్రహంపైకి వచ్చి మనకు ఎలా జీవించాలో తెలిపి తిరిగి వెళ్లిపోయివుండవచ్చు అని రచయిత వాదిస్తున్నాడు. మన పౌరాణిక గ్రంధాల్లో జరిగిన విషయాలన్నీ మన భూమిపైన గతంలో జరిగినవని పండితులు చెబుతున్నారు. ఈ కథలన్నీ కాల్పనికం అని మరికొందరు కొట్టిపారేస్తుంటారు. అయితే ఇవన్నీ కాల్పనికమైతే మరి 5వేల సంవత్సరాల క్రితం అంతటి ఘ్నానాన్ని వారు ఎలా ఉపయోగించారనే ఆశ్చర్యాన్ని, ప్రశ్నను వ్యక్తం చేస్తున్నారు.
పైరాణిక కథల్లో వుండే సాంకేతికత ఇప్పటికీ మన వద్ద లేదు. కానీ ఎన్నో యేళ్ల క్రితం రావణుడి పుష్పక విమానం గురించి మనం చదివాము. అయితే విమానం కొన్ని యేళ్ల ముందే కనుగ్గున్నారు. విఘ్నానం ఎంత సత్యమైందో, పౌరాణికం కూడా అంతే సత్యమని వాదిస్తున్నారు. ఇప్పుడు మనకన్నా గొప్ప సాకేంతికత కలిగిన వారు ఈ భూమిపై రాజ్యాలని ఏలారని మన పౌరాణిక కథలు, అవశేషాలు తెలుపుతున్నాయ్. వేల యేళ్ల క్రితమే న్యూక్లియర్ యుద్ధం కూడా జరిగివుండవచ్చని అంటున్నారు.



Click it and Unblock the Notifications