Latest Updates
-
దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే!
సంక్రాంతి వేళ ఈ వస్తువులు దానం చేస్తే ఎంతో సౌభాగ్యం, శ్రేయస్సు
వీటితో పాటు మకర సంక్రాంతి రోజు దానధర్మాలు చేస్తే ఎంతో శ్రేయస్సు అని శాస్త్రాలు చెబుతున్నాయి. సంక్రాంతి రోజు ఎలాంటి వస్తువులు దానం చేయాలి, ఏవి దానం చేస్తే మంచి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మకర సంక్రాంతి అతి ముఖ్యమైన తెలుగు పండగల్లో ఒకటి. మకర సంక్రాంతి తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున సూర్య భగవానుడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. మొదటి రోజు భోగి, తర్వాతి రోజు సంక్రాంతి, మరుసటి రోజు కనుమ జరుపుకుంటారు. సంక్రాంతి అనగానే పిండివంటలు, గంగిరెద్దులు, హరిదాసులు, కోడిపందేలు, రంగవల్లులు, గొబ్బెమ్మలు ఇలా ఎన్నో ప్రముఖమైనవి ఉంటాయి.

వీటితో పాటు మకర సంక్రాంతి రోజు దానధర్మాలు చేస్తే ఎంతో శ్రేయస్సు అని శాస్త్రాలు చెబుతున్నాయి. సంక్రాంతి రోజు ఎలాంటి వస్తువులు దానం చేయాలి, ఏవి దానం చేస్తే మంచి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

బియ్యం, పప్పుతో చేసిన వంటకం:
మకర సంక్రాంతి రోజున కిచిడీ తినడం, ఇతరులతో పంచుకోవడాన్ని శుభప్రదంగా భావిస్తారు. కిచిడీ దానం చేయాలనుకుంటే నల్ల ఉరద్ పప్పుతో బియ్యం కలిపి దానిని దానం చేయాలి. ఉరద్ పప్పు, బియ్యం, పసుపు, ఉప్పు, నెయ్యి కలిపి ఆ మిశ్రమాన్ని దానం చేయాలి. ఉరద్ శని గ్రహానికి చిహ్నం. ఉరద్ పప్పు దానం చేయడం శని దోషాన్ని తొలగిస్తుంది. బియ్యం పునరుత్పాదక ధాన్యం అని చెబుతారు. అన్నం దానం చేస్తే వందరెట్లు పుణ్యం లభిస్తుంది.

నువ్వులు:
సంక్రాంతి రోజు నువ్వులతో చేసిన వివిధ వంటకాలు తింటారు. సంక్రాంతి రోజున నువ్వులు దానం చేస్తే మంచి జరుగుతుందని విశ్వసిస్తారు. నువ్వులు శని దేవునికి సంబంధించినవి కాబట్టి నువ్వులను దానం చేయడం వల్ల శని దోషం తొలగిపోతుందని నమ్ముతారు.
సూర్యు దేవుని కుమారుడైన శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి నువ్వులు దానం చేయాలి. సంక్రాంతి రోజు నువ్వులు దానం చేయడం మంచిదని అంటారు.

నల్లని వస్తువులు:
నల్లని దుప్పట్లు, నలుపు బట్టలు, నల్లని రంగులో ఉండే ఇతర వస్తువులను సంక్రాంతి రోజు దానం చేయడం చాలా మంచిది. నల్లని వస్తువులు దానం చేస్తే శని దోషం తొలగిపోతుంది. రాహువు ప్రభావం జీవితానికి దూరంగా ఉంటుంది. పాత వస్తువులను దానం చేయకూడదని గుర్తుంచుకోండి. దుప్పట్లను దానం చేయడం వల్ల చలి నుండి కాపాడుకోవచ్చు. కాబట్టి ఈ సమయంలో వాటిని దానం చేయవచ్చు.

బెల్లం, నెయ్యి:
బెల్లం, నెయ్యి రెండూ గురు గ్రహానికి సంబంధించినవి. మకర సంక్రాంతి ఆదివారం వస్తోంది. దానం చేసే వస్తువులకు స్వచ్ఛమైన నెయ్యిని జోడించండి. గురువు వృత్తికి కొత్త ఎత్తులు, వేగాన్ని అందిస్తాయి. బెల్లం, నెయ్యి దానం చేస్తే శని దోషం తొలగిపోతుంది.

సంక్రాంతి రోజున తెల్లవారుజామున ఉదయం 4 గంటలకే నిద్ర లేవాలి.
బ్రహ్మముహూర్తానికే నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు, కుంకుమ పెట్టి మొక్కాలి. సంక్రాంతి పండగ రోజున ఇంట్లోని అన్ని గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టాలి. పూజా మందిరాన్ని ముగ్గులు వేసి అలంకరించాలి. సంక్రాంతి రోజున తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని చక్కెర పొంగలి, గారెలు, బూరెలు, పండ్లను సూర్య భగవానుడికి నైవేద్యంగా పెట్టాలి. పితృదేవతలను ప్రార్థించుకోవాలి. ఇలా చేయడం వల్ల మోక్షం, సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.



Click it and Unblock the Notifications