Latest Updates
-
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు!
Manmohan singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత..ఆఫీసులు,విద్యాసంస్థలకు నేడు సెలవు
భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్(92) కన్నుమూశారు. గురువారం సాయంత్రం మన్మోహన్ సింగ్ ఢిల్లీలోని తన ఇంట్లోనే కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనని వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ కి తరలించారు. వెంటనే ఎయిమ్స్ డాక్టర్లు ఆయనని అత్యవసర సేవా విభాగానికి తరలించి ట్రీట్మెంట్ అందిచినా ఫలితం లేకుండా పోయింది. హాస్పిటల్ కి వెళ్లిన కొద్దిసేపటికే ఆయన మరణించినట్లు వైద్య అధికారులు తెలిపారు.
మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ మరణంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలియజేశారు. మన్మోహన్ సింగ్ గారి మరణంతో దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని,వారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని సీఎం రేవంత్ అన్నారు. మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా తెలంగాణలో ఇవాళ సెలవు దినంగా ప్రకటించారు.

ఇవాళ ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇవాళ సెలవు దినంతో పాటుగా వారం రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. ఈ నెల 25న క్రిస్మస్ కావడంతో సెలవు దినంగా,అలాగే 26న కూడా సెలవు ప్రకటించారు. ఇప్పుడు శుక్రవారం సెలవు ప్రకటించారు.
మన్మోహన్ సింగ్ ప్రస్తానం సాగిందిలా
1932 సెప్టెంబర్ 26నప్రస్తుత పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రంలో జన్మించిన మన్మోహన్ సింగ్.. 1982-85 మధ్య ఆర్బీఐ గవర్నర్గా పనిచేశారు. 1972-76 ఆర్థికశాఖలో ముఖ్య ఆర్థిక సలహాదారుగా పనిచేసిన ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి 1991లో తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు. 1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పని చేశారు. ఈ సమయంలో దేశంలో ఆర్థిక సంస్కరణలు అమలు చేయడంలో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారు. 1998-2004 మధ్యకాలంలో రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు.
2004లో నాటి యూపీఏ ప్రభుత్వ హయాంలో మన్మోహన్ సింగ్ దేశ ప్రధానిగా బాధ్యతలు చేట్టారు. 2004 నుంచి 2014 వరకు పదేళ్ల పాటు భారత ప్రధానిగా సేవలందించారు. దేశాన్ని సుదీర్ఘకాలంపాటు పాలించిన ప్రధానుల్లో ఒకరిగా నిలిచారు. అంతేకాకుండా భారత ప్రధాని పీఠాన్ని అధిష్టించిన తొలి హిందూయేతర వ్యక్తిగా మన్మోహన్ రికార్డు నెలకొల్పారు. ప్రధానిగా రోజూ 18 గంటల పాటు అవిశ్రాంతంగా పనిచేసిన మన్మోహన్ సింగ్ ప్రస్తుతం రాజస్తాన్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.



Click it and Unblock the Notifications











