Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
వారానికి 90 గంటల పని: ఇన్ఫోసిస్ లో దారుణ పరిస్థితులు..సంచలన నిజాలు బయట పెట్టిన ఉద్యోగి
ఉద్యోగుల పని గంటలపై గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీనికి కారణంగా ఎల్ ఎండీ టీ కంపెనీ చైర్మన్ రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలే. ఉద్యోగులు వారానికి 90 గంటలు పనిచేయాలని, ఆదివారాలు కూడా పనిచేయాలంటూ ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ ఎన్ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. నెటిజన్లతో పాటు ప్రముఖ కంపెనీల అధినేతలు, సెలబ్రిటీలు కూడా సుబ్రమణ్యం వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇదే క్రమంలో గతంలో వారానికి 70 గంటలు పనిచేయాలంటూ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు వస్తున్నాయి.
ఉద్యోగుల పనిగంటలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న ఈ సమయంలో పూణేలోని ఇన్ఫోసిస్ క్యాంపస్ లో సిస్టం ఇంజినీర్ గా పనిచేసే భూపేంద్ర విశ్వకర్మ తన ఉద్యోగానికి రిజైన్ చేశాడు. భూపేంద్ర తన రాజీనామాకు చెప్పిన కారణాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రత్యామ్నాయ ఉద్యోగం లేనప్పటికీ ఇన్ఫోసిస్ సంస్థను విడిచిపెట్టడానికి గల కారణాలను లింక్డ్ఇన్ పోస్ట్ ద్వారా భూపేంద్ర తెలియజేశారు.

ఇన్ఫోసిస్ పై భూపేంద్ర చేసిన ఆరోపణలివే
హైక్ లేని ప్రమోషన్, టాక్సిక్ క్లైంట్ కల్చర్, పని విషయంలో సీనియర్లు ప్రశంసించినా జీతాలు పెరగకపోవడం, ఆన్ సైట్ పంపేవాళ్లని మెరిట్ ఆధారంగా కాకుండా మాట్లాడే బాధ ఆధారంగా ఎంపిక చేస్తున్నారని,హైరింగ్ జరపకుండా ఉన్న ఉద్యోగులపై ఎక్కువ వర్క్ లోడ్ వేస్తున్నారంటూ లింక్డ్ఇన్ పోస్ట్ లో భూపేంద్ర తెలిపారు. సిస్టమ్ ఇంజనీర్ నుండి సీనియర్ సిస్టమ్ ఇంజనీర్ గా ప్రమోషన్ పొందిన తర్వాత కూడా ఇన్ఫోసిస్ లో ఆర్థిక వృద్ధి లేకపోవడంతో తాను ఇబ్బంది పడ్డానని భూపేంద్ర తెలిపారు. ఎంత కష్టపడుతున్నా కూడా మూడు సంవత్సరాలుగా జీతం పెంపు లేదని వాపోయాడు.
అట్రిషన్ కారణంగా తన టీమ్ లో ఉండేవాళ్ల సంఖ్య 50 నుండి 30కి తగ్గించబడిందని.. కొత్త వాళ్లని నియమించుకోకుండా ఉన్న ఉద్యోగులమీదనే అదనపు పనిభారాన్ని యాజమాన్యం పెట్టిందని..ఈ అధిక భారం మోస్తున్నా కూడా ఎటువంటి పరిహారం లేదా గుర్తింపు లేదని భూపేంద్ర వాపోయాడు.
ఆ ప్రమాదం తప్పదు
ప్రాథమిక సమస్యలను నిర్లక్ష్యం చేసే కార్యాలయంలో ఉండటం కంటే తన ఆత్మగౌరవం, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు భూపేంద్ర తన పోస్ట్ ద్వారా తెలియజేశారు. ఇటువంటి విషపూరితమైన పద్ధతులు అదుపు లేకుండా కొనసాగితే సంస్థలు తమ ప్రతిభను మాత్రమే కాకుండా తమ విశ్వసనీయతను కూడా కోల్పోయే ప్రమాదం ఉందని భూపేంద్ర తన పోస్ట్ ద్వారా తెలియజేశారు. ఈ ఆందోళనలను పరిష్కరించాలని ఆయన కార్పొరేట్ దిగ్గజాలను కోరారు.



Click it and Unblock the Notifications