Latest Updates
-
ఆ పురాతన దేవాలయంలో 500 సంవత్సరాలుగా ఒకే పొయ్యి మీద వండుతున్న ప్రసాదం -
సింహరాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆత్మవిశ్వాసం రెట్టింపు కాబోతోంది! -
సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. శని దేవుని అనుగ్రహం ఎవరికి? - శనివారం, 20 జూన్ 2026 -
అష్టమి తిథిఎందుకు అంత శక్తివంతమైనది? -
మునగాకు నువ్వుల పచ్చడితో ఎముకలు ఉక్కుగా మారాల్సిందే.. సింపుల్గా ఇలా చేసేయండి.! -
పట్టులా మెరిసే జుట్టు కోసం ఇంట్లోనే హెయిర్ కండిషనర్.. చిటికెలో ఇలా చేసేయండి.? -
అదే పనిగా స్మార్ట్ఫోన్ చూస్తున్నారా.. డ్రై ఐ సిండ్రోమ్కి దారి తీసే లక్షణాలివే.! -
ఈ నెగిటివ్ ఆలోచనలతో శరీరంలో ఎన్ని మార్పులు చోటుచేసుకుంటాయో తెలుసా.? -
పెళ్లయిన తర్వాత ఎన్నేళ్లకు విడాకుల ముప్పు ఎక్కువ? ఈ నిజాలు తెలుసుకోండి! -
జూన్ 19: ఈ రాశుల వారికి రాత్రికి రాత్రే అదృష్టం.. ధనలాభం, కెరీర్లో ఊహించని మార్పులు!
Kerala To Mecca: కేరళ నుంచి మక్కా వరకు పాదయాత్ర, 8,600 కిలోమీటర్లు, 370 రోజుల ప్రయాణం
ఏడాదికి పైగా పాదయాత్ర. ఏకంగా 8 వేల 600 కిలోమీటర్ల మేర నడక. ఒకటీ రెండూ కాదు ఏకంగా 6 దేశాలు దాటుకుని గమ్యస్థానానికి చేరిన కేరళ యువకుడు. సంవత్సరానికి పైగా నడుస్తూనే ఉన్నాడు. ఏకంగా 370 రోజులు నడిచి తను చేరాలనుకున్న పవిత్ర స్థలానికి చేరుకున్నాడు. యూట్యూబర్ అయిన షిహాబ్ గతేడాది తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఇప్పుడు మక్కాకు చేరుకున్నాడు.

ముస్లింల అత్యంత పవిత్ర స్థలం సౌదీ అరేబియాలో ఉన్న మక్కా. ప్రతి ఏటా హజ్ యాత్ర పేరుతో ప్రపంచం నలుమూలల నుంచి కోట్లాది మంది ఈ పవిత్ర స్థలాన్ని దర్శించుకుంటారు. అల్లాహ్ కు వేడుకుంటారు. హజ్ యాత్రకు వెళ్లడం చాలా మంది ముస్లింల జీవిత లక్ష్యంగా ఉంటుంది. అందుకోసం జీవితాంతం కష్టపడుతుంటారు. అంతటి పుణ్య స్థలానికి ఏటా వేలాది మంది తమ తమ ప్రాంతాల నుంచి కాలినడకన వెళ్తుంటారు. అలా మన దేశం నుంచి షిహాబ్ చొత్తురు అనే కేరళ వ్యక్తి వెళ్లాడు.
కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన షిహాబ్ గత సంవత్సరం జూన్ 2వ తేదీన కేరళ నుంచి తన మక్కా యాత్రను ప్రారంభించాడు. ఇండియా, పాకిస్థాన్, ఇరాన్, ఇరాక్, కువైట్ దేశాలను దాటుకుని మే రెండో వారంలో ఎట్టకేలకు సౌదీ అరేబియా చేరుకున్నాడు. స్వయానా యూట్యూబర్ అయిన షిహాబ్.. తన ప్రయాణ విశేషాలను ఎప్పటికప్పుడు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తన ఫాలోవర్లతో పంచుకుంటూనే ఉన్నాడు.
పాదయాత్ర సుఖంగా ఏం సాగలేదు:
కేరళ నుంచి ప్రయాణం ప్రారంభించిన షిహాబ్ జర్నీలో కష్టాలూ ఎదుర్కొన్నాడు. ఇండియాలో తన ప్రయాణం పూర్తిగా సాఫీగానే సాగింది. తన ప్రయాణ విశేషాలు చెబుతూ ఆయా ప్రాంతాల్లో ప్రకృతిని ఆస్వాదిస్తూ సాగాడు. అయితే పాకిస్థాన్ సరిహద్దుల్లోని వాఘాకు చేరుకోన్నప్పటి నుంచి షిహాబ్ కు కష్టాలు ఎదురయ్యాయి.
వీసా లేకపోవడంతో పాకిస్థాన్ అధికారులు షిహాబ్ కు నో చెప్పేశారు. వాఘా బార్డర్ లోనే అడ్డుకున్నారు. అయితే వాఘాలోని ఒక స్కూల్ వద్ద నెలల పాటు ఎదురుచూపుల తర్వాత ఎట్టకేలకు షిహాబ్ కు వీసా దక్కింది. ఆ తర్వాత పాకిస్థాన్ లోకి ఎంటరయ్యాడు. అనంతరం ఇరాన్, ఇరాక్, కువైట్ దేశాల మీదుగా సౌదీ అరేబియా చేరుకున్నాడు.
తల్లితో పాటు ప్రార్థనలు:
సౌదీ అరేబియా చేరుకున్న అనంతరం ఇస్లామిక్ సంప్రదాయంలో అత్యంత ప్రాధాన్యం, పవిత్రత కలిగిన మదీనాతో 21 రోజుల పాటు గడిపాడు. ఆ తర్వాత మక్కాకు బయల్దేరాడు. మదీనా నుంచి 440 కిలోమీటర్ల దూరంలో ఉన్న మక్కాకు కేవలం 9 రోజుల్లో చేరుకున్నాడు. షిహాబ్ తల్లి మక్కాకు చేరుకున్న అనంతరం ఇద్దరు కలిసి హజ్ ప్రార్థనకు హాజరు కానున్నరట.



Click it and Unblock the Notifications