Latest Updates
-
శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఈ ఒక్క గీతా శ్లోకం.. మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు -
కర్కాటకంలో గురుడి సంచారం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం, సంపద వెల్లువ! -
ధనుస్సు, మీన రాశుల వారికి అద్భుత యోగం.. మీ రాశి ఉందా? - బుధవారం, 03 జూన్ 2026 -
ఇతరుల ప్రేమను చూసి మొదలైన పోలికలు.. చివరకు బంధాలను ఎలా కూల్చేస్తున్నాయి -
గోంగూర రొయ్యల కూరను ఇంట్లోనే అచ్చం హోటల్ రుచితో ఇలా చేసుకోండి.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు! -
పెళ్లై ఏళ్లు గడిచినా పాత ప్రేమ మర్చిపోలేకపోతున్నారా? ఇందులో తప్పేం లేదు కానీ జాగ్రత్త -
పిజ్జా, బర్గర్లు దీని ముందు పరార్.. నోట్లో ఇట్టే కరిగిపోయేలా ఆలూతో ఎగ్ బజ్జీ.! -
కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి? మీ జీవితంలో జరిగేదంతా దీనివల్లేనని శాస్త్రాలు చెబుతున్నాయా? -
వెజ్ లవర్స్ కోసం సోయాతో టిక్కా మసాలా.. వీటిని యాడ్ చేస్తే వేరే లెవెల్ టేస్ట్.! -
ఈ ట్రెడిషనల్ ఫ్యామిలీ రెసిపీతో పనీర్ పరాఠా ఇలా చేస్తే.. ఇంట్లో వాళ్లు లొట్టలేసుకుంటూ తింటారు!
కుంభమేళాలో మోనాలిసా ఎంత సంపాదించిందో తెలుసా? కేవలం పదిరోజుల్లోనే అన్ని కోట్లా?
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మహా కుంభమేళాలో వైరల్ అయిన తేనె కళ్ల సుందరి మోనాలిసా గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. కేవలం ఒక్క ఫొటోతో ప్రపంచ వ్యాప్తంగా ఆమె ఫేమస్ అయ్యారు. తన వైపు ప్రపంచాన్నంతా తిప్పుకున్నారు. కుంభమేళాలో వ్యాపారం చేసేందుకు వచ్చిన ఆమెను.. కెమెరాలన్నీ చుట్టుముట్టడంతో, వ్యాపారం చేయలేక ఆమె తన సొంత గ్రామానికి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
అయితే సోషల్ మీడియాలో ఆమె ఫేమస్ అవడంతో.. ఆమె తనకంటూ ఓ సోషల్ మీడియా ఖాతాను సృష్టించుకుంది. ప్రారంభించిన కొన్ని గంటల్లోనే ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది. అయితే కుంభమేళాలో ఉన్నన్ని రోజులు ఎంత సంపాదించింది అనేదాని గురించి ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

పది రోజుల్లో పది కోట్లు..
కుంభమేళాలో బాగా పాపులర్ అయిన మోనాలిసా భారీగా డబ్బులను సంపాదించినట్లు తెలుస్తోంది. తాజాగా ఆమెకు సంబంధించిన మరో విషయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కేవలం 10 రోజుల్లోనే 10 కోట్లు రాబట్టిందని అంటున్నారు. ఈ ఈవెంట్ ద్వారా ఆమెకు రూ.10 కోట్లు వచ్చినట్లు సమాచారం. ఈ డబ్బు అతని కుటుంబానికి అందిందని కొన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
అయితే దీనిపై అడిగిన ప్రశ్నకు మోనాలిసా సమాధానమిచ్చింది. 10 కోట్ల రూపాయలను పొందడంపై ఆమె వ్యాఖ్యానిస్తూ, 'నాకు ఇంత పెద్ద మొత్తం వచ్చి ఉంటే, నేను ఇంకా ఇక్కడ రుద్రాక్షి ఎందుకు అమ్ముతాను? మా కుటుంబంతో కలిసి చిన్న ఇంట్లో ఎందుకు ఉంటాను, నాకు అంత డబ్బు రాలేదు' అని తెలిపింది.
ఇండోర్ నుంచి
మహా కుంభమేళాలో పాల్గొనేందుకు ఆమె ఇండోర్ నుంచి వచ్చారు. కానీ ఆమెను ఓ వ్యక్తి ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. గంటల్లోనే వైరల్గా మారింది. దీంతో ఆమెతో ఇంటర్వ్యూలు, సెల్ఫీలు, ఫోటోలు తీసుకోవడం ప్రారంభించారు. ఇది ఆమె వ్యాపారానికి భారీగా ఆటంకం కలిగించింది.
వీటన్నింటి మధ్య, ఆమె తన స్వస్థలమైన ఇండోర్కు తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె తన X ఖాతాలో షేర్ చేసింది. నా కుటుంబం, నా భద్రత కోసం నేను ఇండోర్కు తిరిగి వచ్చేశాను. వీలైతే తదుపరి మహా కుంభానికి తిరిగి వస్తానని రాసుకొచ్చింది. గతంలో ఆమె దగ్గర రుద్రాక్షిలు, దండలు కొనుక్కోవడానికి వచ్చేవారు. కానీ ఇప్పుడు సెల్ఫీల కోసమే వస్తుండటంతో ఆమెకు వ్యాపారంలో నష్టమే కాకుండా రక్షణ లేకుండా పోయింది. దీంతో ఆమె తన స్వస్థలానికి వెళ్లినట్లు తెలుస్తోంది.



Click it and Unblock the Notifications