Latest Updates
-
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026
తల్లి శవం పక్కన ఏడాది చిన్నారి పాల కోసం..కంట తడి పెట్టించే ఘటన..!
తల్లి చనిపోయిందని తెలియక పాల కోసం ఆమె శవంపై పడి ఏడ్చిన బాలుడు... కంట తడి పెట్టించే ఘటన ఇది..!
గుండె పిండేసే దృశ్యం. అమ్మ చనిపోయిందని తెలీని ఓ పసికూన పాలు తాగడానికి ప్రయత్నిస్తున్న ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

Image Courtesy - DAILY MAIL UK
చుట్టూ రక్తపు మడుగు... అందులో పడి ఉన్న మహిళ మృతదేహం... రైల్వే ట్రాక్ పక్కనే ఉన్న ఆ మృతదేహానికి ఆనుకుని గుండెలవిసేలా రోదిస్తున్నాడు ఏడాది బాలుడు... తల్లి చనిపోయిందని అతనికి తెలియదు. ఆకలైందేమో పాలు తాగుదామని తల్లి కోసం ఏడుస్తున్నాడు అతను.

Image Courtesy - KTN News
అయినా.. ఎంతకీ తల్లి లేవదేం.. పాలివ్వదేం.. అన్నట్టుగా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు ఆ బాలుడు. ఈ దృశ్యాలను చూసిన వారి హృదయాలు కలుక్కుమన్నాయి. ప్రతి ఒక్కరి గుండెను ఈ సంఘటన పిండేసింది. ఈ హృదయ విదారక సంఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది.
మధ్యప్రదేశ్లోని భోపాల్కు 250 కిలోమీటర్ల దూరంలోని దమోహ్ అనే ప్రాంతంలో ఉన్న రైల్వే ట్రాక్ పక్కనే ఈ నెల 24వ తేదీన ఉదయం ఓ మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.

Image Courtesy - Cover Asia News
దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని మహిళ మృతదేహాన్ని అక్కడి నుంచి తీసేశారు. అయితే అలా తీసే క్రమంలో ఆమె కొడుకైన ఏడాది బాలుడు ఆమె పక్కనే గుక్క పట్టి ఏడ్వడం ప్రారంభించాడు.

Image Courtesy - Cover Asia News
తల్లి చనిపోయిందని, ఇక తిరిగి రాదని ఆ పసికందుకు తెలియదు. అయినా... ఆకలవుతుందని తల్లి పాలు తాగుదామని ఆమె ఛాతీపైకి వచ్చి ఆనుకున్నాడు. దీంతో అతని వేదనను చూసిన స్థానికులకు హృదయం కలచి వేసింది.

అయితే ఆ మహిళ రైలు నుంచి తప్పించుకోబోయి అది ఢీకొని మృతి చెందినట్టు కొందరు స్థానికులు చెబుతున్నారు.
అలా రైలు ఢీకొనే క్రమంలో తన చిన్నారికి ఏమీ కాకూడదని ఆ తల్లి తనను బలి తీసుకుందట. పసికందును బయటకు విసిరేసి తాను ప్రాణత్యాగం చేసిందని స్థానికులు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే చనిపోయిన తల్లి మృతదేహం వద్ద ఆ బాలుడు అలా ఏడవడం అందరినీ కంట తడి పెట్టించింది. అయితే ఆమె వివరాలు మాత్రం తెలియలేదు. ఆ బాలున్ని అనాథ శరణాలయానికి పంపారు.



Click it and Unblock the Notifications