Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
తల్లి శవం పక్కన ఏడాది చిన్నారి పాల కోసం..కంట తడి పెట్టించే ఘటన..!
తల్లి చనిపోయిందని తెలియక పాల కోసం ఆమె శవంపై పడి ఏడ్చిన బాలుడు... కంట తడి పెట్టించే ఘటన ఇది..!
గుండె పిండేసే దృశ్యం. అమ్మ చనిపోయిందని తెలీని ఓ పసికూన పాలు తాగడానికి ప్రయత్నిస్తున్న ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

Image Courtesy - DAILY MAIL UK
చుట్టూ రక్తపు మడుగు... అందులో పడి ఉన్న మహిళ మృతదేహం... రైల్వే ట్రాక్ పక్కనే ఉన్న ఆ మృతదేహానికి ఆనుకుని గుండెలవిసేలా రోదిస్తున్నాడు ఏడాది బాలుడు... తల్లి చనిపోయిందని అతనికి తెలియదు. ఆకలైందేమో పాలు తాగుదామని తల్లి కోసం ఏడుస్తున్నాడు అతను.

Image Courtesy - KTN News
అయినా.. ఎంతకీ తల్లి లేవదేం.. పాలివ్వదేం.. అన్నట్టుగా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు ఆ బాలుడు. ఈ దృశ్యాలను చూసిన వారి హృదయాలు కలుక్కుమన్నాయి. ప్రతి ఒక్కరి గుండెను ఈ సంఘటన పిండేసింది. ఈ హృదయ విదారక సంఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది.
మధ్యప్రదేశ్లోని భోపాల్కు 250 కిలోమీటర్ల దూరంలోని దమోహ్ అనే ప్రాంతంలో ఉన్న రైల్వే ట్రాక్ పక్కనే ఈ నెల 24వ తేదీన ఉదయం ఓ మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.

Image Courtesy - Cover Asia News
దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని మహిళ మృతదేహాన్ని అక్కడి నుంచి తీసేశారు. అయితే అలా తీసే క్రమంలో ఆమె కొడుకైన ఏడాది బాలుడు ఆమె పక్కనే గుక్క పట్టి ఏడ్వడం ప్రారంభించాడు.

Image Courtesy - Cover Asia News
తల్లి చనిపోయిందని, ఇక తిరిగి రాదని ఆ పసికందుకు తెలియదు. అయినా... ఆకలవుతుందని తల్లి పాలు తాగుదామని ఆమె ఛాతీపైకి వచ్చి ఆనుకున్నాడు. దీంతో అతని వేదనను చూసిన స్థానికులకు హృదయం కలచి వేసింది.

అయితే ఆ మహిళ రైలు నుంచి తప్పించుకోబోయి అది ఢీకొని మృతి చెందినట్టు కొందరు స్థానికులు చెబుతున్నారు.
అలా రైలు ఢీకొనే క్రమంలో తన చిన్నారికి ఏమీ కాకూడదని ఆ తల్లి తనను బలి తీసుకుందట. పసికందును బయటకు విసిరేసి తాను ప్రాణత్యాగం చేసిందని స్థానికులు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే చనిపోయిన తల్లి మృతదేహం వద్ద ఆ బాలుడు అలా ఏడవడం అందరినీ కంట తడి పెట్టించింది. అయితే ఆమె వివరాలు మాత్రం తెలియలేదు. ఆ బాలున్ని అనాథ శరణాలయానికి పంపారు.



Click it and Unblock the Notifications











