Latest Updates
-
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు!
అతిలోక సుందరిని అస్సలు మరచిపోలేనంటున్న జాన్వీ కపూర్...
శ్రీదేవి మరణించి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జాన్వీ కపూర్ తన సోషల్ మీడియాలో తన తల్లి ఒడిలో కూర్చున్న ఫొటోలను షేర్ చేసుకున్నారు.
టాలీవుడ్.. బాలీవుడ్.. సౌత్.. నార్త్ ఎక్కడైనా ఆమె వెండి తెరతో పాటు నిజ జీవితంలోనూ అతి లోక సుందరిగా అందరి మన్ననలు అందుకుంది. ఆమెతో నటించేందుకు అగ్ర హీరోలందరూ తెగ పోటీ పడేవారు. అయితే ఆమె ప్రస్తుతం మన మధ్య లేకపోవడం చాలా విచారకరం. అప్పుడే ఆ అతిలోక సుందరి శ్రీదేవి మరణించి రెండేళ్లు పూర్తయ్యింది.

ఈ విషయాన్ని అభిమానులెవరూ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. రెండేళ్ల క్రితం తన మేనల్లుడు మోహిత్ మార్వా వివాహం సందర్భంగా దుబాయ్ కి వెళ్లిన శ్రీదేవి అక్కడే ఓ హోటల్ లో ఓ బాత్ టబ్ లో ప్రమాదవశాత్తు మరణించిన సంగతి అందరికీ తెలిసిందే.

ఫిబ్రవరి 24వ తేదీ శ్రీదేవిని గుర్తు చేసుకుంటూ తన కూతురు జాన్వీ కపూర్ ''మిస్ యు రోజూ'' అని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇంకా తన తల్లితో కలిసి గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ పాత ఫొటోలను జత చేసింది. వాటిపై మీరూ ఓ లుక్కేయండి...

‘నా గుండె ఎప్పుడూ భారంగా..‘‘
శ్రీదేవి మరణించి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జాన్వీ కపూర్ తన సోషల్ మీడియాలో తన తల్లి ఒడిలో కూర్చున్న ఫొటోలను షేర్ చేసుకున్నారు. దీనికి ఆమె క్యాప్షన్ ఇలా ఇచ్చారు. ‘నా గుండె ఎప్పుడూ భారంగా ఉంటుంది. అయితే నేను ఎప్పుడూ నవ్వూనే ఉంటాను. ఎందుకంటే అది మీలో ఉంది.‘‘ అని షేర్ చేసింది.

తీరని లోటు..
అతిలోక సుందరి శ్రీదేవి మరణం భారతీయ సినీ పరిశ్రమకే తీరని లోటు అని, ఎంతమంది నూతన హీరోయిన్లు వచ్చినా.. శ్రీదేవి స్థాయిని ఎవ్వరూ అందుకోలేరు. అంతేకాదు ఆమెకు కనీసం సగం కూడా పోటీ ఇవ్వలేరని ఘంటాపథంగా చెప్పవచ్చు.

బాల నటిగా..
శ్రీదేవి బాలనటిగా సినీ రంగంలోని అడుగు పెట్టింది. ఆమె కేవలం తమిళం, తెలుగు సినిమాలతో ఆగిపోకుండా.. బాలీవుడ్ లోనూ పాగా వేసింది.

తల్లి ప్రోత్సాహంతోనే..
తన తల్లి ప్రోత్సాహంతోనే శ్రీదేవి చిన్నతనంలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. చిన్నతనంలో బాలనటిగా ఆమె నటించిన హీరోలతోనే తర్వాత హీరోయిన్ గా నటించారు. తన తల్లిని ఆదర్శంగా తీసుకుని ఇటీవలే జాన్వీ కపూర్ కూడా సినిమా రంగంలోకి అడుగుపెట్టింది.

వివిధ కార్యక్రమాలకు..
ప్రముఖ కథానాయిక మహేశ్వరి శ్రీదేవి బంధువు. వారిద్దరూ కలిసి ఎన్నో కార్యక్రమాలకు హాజరయ్యేవారు. వీరితో పాటు తన కూతుళ్లను కూడా శ్రీదేవి వెంటబెట్టుకుని వెళ్లేది.

పిల్లలంటే ఇష్టం..
అలనాటి తార శ్రీ దేవికి పిల్లలంటే ఎంతగానో ఇష్టం. తల్లి తోడుగా లేకపోతే తన జీవితమే లేదు. తల్లి కాకపోతే ఆ జీవితానికి అర్థమే లేదు అని శ్రీదేవి చెప్పేవారట.

జాన్వీ అంటే ఇష్టమట..
తన పిల్లలు ఇద్దరిలోనూ జాన్వీ అంటే శ్రీదేవికి చాలా ఇష్టమట. ఖుషి చాలా బలమైనది. కానీ జాన్వీ మాత్రం తనలాగే ఎంతో సున్నిత మనస్కురాలు అని శ్రీదేవి చెబుతుండేదట. ఆమెను అన్ని వేళలా కాపాడేందుకు ప్రయత్నం చేసేదట. పిల్లలకు ఎల్లప్పుడూ దగ్గరగా ఉండేందుకు ఎక్కువ ఇష్టపడే వారట.



Click it and Unblock the Notifications