Latest Updates
-
మిగిలిపోయిన ఇడ్లీతో పది నిమిషాల్లో స్పైసీ ఇడ్లీ ఫ్రై.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! -
టెన్షన్స్ తో బీపీ పెరుగుతోందా? అయితే బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు ఉన్నట్లే!..బయటపడే బ్రహ్మాస్త్రం ఇదే! -
షుగర్ కి చెక్, బరువుకు బ్రేక్..రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ రాగి దోశ..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
రాచరికపు రుచినిచ్చే మొఘలాయి ఎగ్ కర్రీ..చపాతీ, పూరీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి రుచి చూశారంటే.. రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
కల్తీ లేని స్వచ్ఛమైన బాదం పాలు.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి! -
పరగడుపున ఈ నీళ్లు తాగితే..థైరాయిడ్, షుగర్, జుట్టు రాలడం ..అన్నింటికీ ఒకే బ్రహ్మాస్త్రం! -
నోరూరించే లాహోరి కడాయి చికెన్..బటర్ నాన్, రోటీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
హోటల్ రుచిని మరిపించే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ..వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది! -
చక్కెరకు బదులు బెల్లం: మీ ఆరోగ్యానికి ఇదే శ్రీరామరక్ష!
Hyderabadi: హైదరాబాదీలు ఎక్కువగా ఆర్డర్ చేసేది ఇవే.. టాప్ బిర్యానీ కాదు!
మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరూ భోజన ప్రియులే. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఎదో ఒకటి తింటూనే ఉంటారు. టిఫిన్స్, బిర్యానీలు తెగ లాగించేస్తారు. కుదిరితే ఇంట్లో వండుకొని తింటారు. అదే కుదరకపోతే ఆర్డర్ పెట్టుకుంటారు. అయితే 2024లో మన హైదరాబాదీలు ఎక్కువగా ఏం తిన్నారు? ఎక్కువగా ఏం ఆర్డర్ చేశారు అనే లిస్ట్ను స్విగ్గి విడుదల చేసింది. దాని గురించి ఈరోజు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఉదయం ఉల్లి దోశ
మన హైదరాబాద్ వాసులు బిర్యానీలు మాత్రమే కాదు టిఫిన్స్ కూడా తెగ ఆర్డర్ చేస్తున్నారని స్విగ్గి వెల్లడించింది. బ్రేక్ఫాస్ట్లో ఎక్కువగా ఉల్లి దోశను మాత్రమే ఇష్టపడుతున్నారని పేర్కొంది. అలాగే దేశంలో ఉదయం పూట ఎక్కువగా దోశలు ఆర్డర్ చేసింది కూడా హైదరాబాద్ వాసులే అని వెల్లడించింది. హైదరాబాద్ వాసులకు ఎక్కువగా దోశ ఇస్తామని దీని ప్రకారం వెల్లడైంది. మరి మీరు కూడా దోశ ఆర్డర్ చేశారా?

బిర్యానీలు
హైదరాబాద్ అంటే బిర్యాని, బిర్యానీ అంటేనే హైదరాబాద్ అని చెప్తుంటాము. అందుకు తగ్గట్టుగానే హైదరాబాద్ వాసులు బిర్యానీలను కూడా అమితంగా ఆర్డర్ చేసేస్తున్నారు. కేవలం 2024లోనే కోటి యాభై లక్షలకు పైగా బిర్యానీలను ఆర్డర్ చేసినట్లు స్విగ్గి వెల్లడించింది. అందులో కేవలం చికెన్ బిర్యానీ మాత్రమే కాదు.. పనీర్ బిర్యాని, వెజ్ బిర్యాని, రొయ్యల బిర్యాని, ఎగ్ బిర్యానీ, పుట్టగొడుగుల బిర్యానీ, గుడ్డు బిర్యాని కూడా ఉంది.
హైదరాబాద్ వాసులు ప్రతీ నిమిషానికి 34 బిర్యానీలను ఆర్డర్ చేస్తున్నట్లు స్విగ్గి వెల్లడించింది. మనం దేశంలో నిమిషం నిమిషానికి ఇంతలా బిర్యాని ఆర్డర్ చేసే నగరం మరేదీ లేదని వెల్లడించింది. హైదరాబాదీలకు బిర్యాని అంటే ఎంత ఇష్టమో దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు. అలాగే టీ20 వరల్డ్ కప్ సమయంలో అత్యధికంగా ఎనిమిది లక్షల అరవై తొమ్మిది వేల బిర్యానీలను ఆర్డర్ చేసినట్లు పేర్కొంది. ఇదే ఆల్ టైం హైయెస్ట్ అని చెప్పుకొచ్చింది.
పిజ్జాలు కూడా..
హైదరాబాద్ వాసులు కేవలం ఉల్లి దోశ, బిర్యానీలు మాత్రమే కాదు పిజ్జాలు కూడా ఎక్కువగానే ఆర్డర్ చేస్తున్నారు. 2023తో పోలిస్తే 2024లో పిజ్జాలు ఎక్కువగా ఆర్డర్ చేసినట్లు వెల్లడించింది. అలాగే స్వీట్స్ కూడా ఎక్కువగా కొనుక్కున్నట్లు చెప్పుకొచ్చింది. స్వీట్స్ ఎక్కువగా డబల్ కా మీఠా ఆర్డర్ చేశారని తెలిపింది. మొత్తం రెండు లక్షలకు పైగా స్వీట్స్కు సంబంధించిన ఆర్డర్స్ వస్తే అందులో ఎక్కువగా డబల్ కా మీఠా ఉందని తెలిపింది. అలాగే మదర్స్ డే రోజున ఎక్కువగా కేక్లు ఆర్డర్ చేశారని, ఆరోజు ప్రతి నిమిషానికి 5 కేక్లు ఆర్డర్ చేసినట్లు వెల్లడించింది.



Click it and Unblock the Notifications











