Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
Hyderabadi: హైదరాబాదీలు ఎక్కువగా ఆర్డర్ చేసేది ఇవే.. టాప్ బిర్యానీ కాదు!
మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరూ భోజన ప్రియులే. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఎదో ఒకటి తింటూనే ఉంటారు. టిఫిన్స్, బిర్యానీలు తెగ లాగించేస్తారు. కుదిరితే ఇంట్లో వండుకొని తింటారు. అదే కుదరకపోతే ఆర్డర్ పెట్టుకుంటారు. అయితే 2024లో మన హైదరాబాదీలు ఎక్కువగా ఏం తిన్నారు? ఎక్కువగా ఏం ఆర్డర్ చేశారు అనే లిస్ట్ను స్విగ్గి విడుదల చేసింది. దాని గురించి ఈరోజు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఉదయం ఉల్లి దోశ
మన హైదరాబాద్ వాసులు బిర్యానీలు మాత్రమే కాదు టిఫిన్స్ కూడా తెగ ఆర్డర్ చేస్తున్నారని స్విగ్గి వెల్లడించింది. బ్రేక్ఫాస్ట్లో ఎక్కువగా ఉల్లి దోశను మాత్రమే ఇష్టపడుతున్నారని పేర్కొంది. అలాగే దేశంలో ఉదయం పూట ఎక్కువగా దోశలు ఆర్డర్ చేసింది కూడా హైదరాబాద్ వాసులే అని వెల్లడించింది. హైదరాబాద్ వాసులకు ఎక్కువగా దోశ ఇస్తామని దీని ప్రకారం వెల్లడైంది. మరి మీరు కూడా దోశ ఆర్డర్ చేశారా?

బిర్యానీలు
హైదరాబాద్ అంటే బిర్యాని, బిర్యానీ అంటేనే హైదరాబాద్ అని చెప్తుంటాము. అందుకు తగ్గట్టుగానే హైదరాబాద్ వాసులు బిర్యానీలను కూడా అమితంగా ఆర్డర్ చేసేస్తున్నారు. కేవలం 2024లోనే కోటి యాభై లక్షలకు పైగా బిర్యానీలను ఆర్డర్ చేసినట్లు స్విగ్గి వెల్లడించింది. అందులో కేవలం చికెన్ బిర్యానీ మాత్రమే కాదు.. పనీర్ బిర్యాని, వెజ్ బిర్యాని, రొయ్యల బిర్యాని, ఎగ్ బిర్యానీ, పుట్టగొడుగుల బిర్యానీ, గుడ్డు బిర్యాని కూడా ఉంది.
హైదరాబాద్ వాసులు ప్రతీ నిమిషానికి 34 బిర్యానీలను ఆర్డర్ చేస్తున్నట్లు స్విగ్గి వెల్లడించింది. మనం దేశంలో నిమిషం నిమిషానికి ఇంతలా బిర్యాని ఆర్డర్ చేసే నగరం మరేదీ లేదని వెల్లడించింది. హైదరాబాదీలకు బిర్యాని అంటే ఎంత ఇష్టమో దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు. అలాగే టీ20 వరల్డ్ కప్ సమయంలో అత్యధికంగా ఎనిమిది లక్షల అరవై తొమ్మిది వేల బిర్యానీలను ఆర్డర్ చేసినట్లు పేర్కొంది. ఇదే ఆల్ టైం హైయెస్ట్ అని చెప్పుకొచ్చింది.
పిజ్జాలు కూడా..
హైదరాబాద్ వాసులు కేవలం ఉల్లి దోశ, బిర్యానీలు మాత్రమే కాదు పిజ్జాలు కూడా ఎక్కువగానే ఆర్డర్ చేస్తున్నారు. 2023తో పోలిస్తే 2024లో పిజ్జాలు ఎక్కువగా ఆర్డర్ చేసినట్లు వెల్లడించింది. అలాగే స్వీట్స్ కూడా ఎక్కువగా కొనుక్కున్నట్లు చెప్పుకొచ్చింది. స్వీట్స్ ఎక్కువగా డబల్ కా మీఠా ఆర్డర్ చేశారని తెలిపింది. మొత్తం రెండు లక్షలకు పైగా స్వీట్స్కు సంబంధించిన ఆర్డర్స్ వస్తే అందులో ఎక్కువగా డబల్ కా మీఠా ఉందని తెలిపింది. అలాగే మదర్స్ డే రోజున ఎక్కువగా కేక్లు ఆర్డర్ చేశారని, ఆరోజు ప్రతి నిమిషానికి 5 కేక్లు ఆర్డర్ చేసినట్లు వెల్లడించింది.



Click it and Unblock the Notifications