Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
LK Advani: బిగ్ బ్రేకింగ్..అద్వానీకి తీవ్ర అస్వస్థత!
భారత మాజీ ఉప ప్రధాని, బీజేపీ అగ్రనాయకుడు ఎల్ కే అద్వానీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అద్వానీని ఆయన కుటుంబ సభ్యులు ఇవాళ ఉదయం ఢిల్లీలోని అపోలో హాస్పిటల్ లో జాయిన్ చేశారు. డాక్టర్లు అద్వానీకి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని కుటుంబసభ్యులు చెప్తున్నారు.
అయితే అద్వానీ ఆరోగ్య పరిస్థితిపై బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఆయన తర్వగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. కాగా,గతంలో శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ అద్వానీ హాస్పిటల్ లో చేరిన విషయం తెలిసిందే.

ప్రస్తుత పాకిస్తాన్ లోని కరాచీలో 1927 నవంబర్ 8న ఎల్ కే అద్వానీ జన్మించారు. 1947లో దేశవిభజన తర్వాత ఆయన కుటుంబం భారతదేశానికి వలస వచ్చింది. తన 14వ ఏట రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) లో చేరిన ఎల్ కే అద్వానీ..జాతీయ స్థాయిలో బీజేపీ బలమైన రాజకీయ శక్తిగా ఎదగడంలో ముఖ్య పాత్ర పోషించారు. 1980 లో భారతీయ జనతా పార్టీ ని స్థాపించిన సమయంలో వ్యవస్థాపక సభ్యులలో ఒకరుగా అద్వానీ ఉన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం లక్ష్యంగా ఆయన చేపట్టిన రథ యాత్ర,తదనంతర పరిణామాలు బీజేపీని 'చాలామందికి దగ్గర చేశాయి.
1984 సార్వత్రిక ఎన్నికలలో కేవలం రెండు స్థానాలు గెలుచుకున్న స్థాయి నుంచి ఇప్పుడు కేంద్రంలో మూడు సార్లు అధికార పక్షంగా ఉండేంతలా బీజేపీ ఎదగడానికి ప్రధాన కారణం అద్వానీ నాయకత్వమే. 2002 నుంచి 2004 వరకు కేంద్రంలో అటల్ బిహారీ వాజ్ పేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో ఉప ప్రధానిగా,హోం మంత్రిగా అద్వానీ పనిచేశారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో అద్వానీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించారు. కానీ ఆ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయింది.



Click it and Unblock the Notifications