Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
Maha Kumbh: కుంభమేళాలో తీవ్ర విషాదం.. 15 మంది మృతి?
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో గల త్రివేణి సంగమం వద్ద జరుగుతున్న మహాకుంభమేళాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈరోజు మౌని అమావాస్య కావడంతో కుంభమేళాలో స్నానం చేసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చారు. దీంతో కుంభమేళా వద్ద భారీ తొక్కిసలాట చోటు చేసుకుంది. సెక్టార్ 2లో ఈ తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తుంది. ఈ తొక్కిసలాటలో చాలా మంది మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇప్పటి వరకు 15 మంది మృతి చెంది ఉంటారని అధికారులు చెబుతున్నారు. అధికారికంగా మృతుల సంఖ్య వెల్లడించనప్పటికీ సుమారు 15 మంది వరకు మృతి చెంది ఉంటారని చెబుతున్నారు. దీంతో పాటు 30 మంది వరకు గాయపడ్డారని, వారి పరిస్థితి తీవ్రంగా ఉందని చెబుతున్నారు. మౌని అమావాస్య కారణంగా స్నానం చేసేందుకు ఒక్కసారిగా భక్తులు వచ్చేయడంతో బారికేడ్లు విరిగిపడ్డాయి. దీంతో ఈ తొక్కిసలాట జరిగింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రధాని మోదీ ఆరా
ఈ తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ ఆరా తీశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. భక్తులకు సహాయక చర్యలు అందించాలని సూచించారు. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా యోగికి ఫోన్ చేసి ఈ ఘటనపై ఆరా తీశారు. దీంతో పాటు సీఎం యోగి కూడా భక్తులకు త్రివేణి సంగమం ప్రధాన కేంద్రం వద్ద కాకుండా సమీప ప్రాంతాల్లో స్నానాలు చేయాలని సూచించారు.



Click it and Unblock the Notifications











