Latest Updates
-
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే!
Maha Kumbh: కుంభమేళాలో తీవ్ర విషాదం.. 15 మంది మృతి?
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో గల త్రివేణి సంగమం వద్ద జరుగుతున్న మహాకుంభమేళాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈరోజు మౌని అమావాస్య కావడంతో కుంభమేళాలో స్నానం చేసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చారు. దీంతో కుంభమేళా వద్ద భారీ తొక్కిసలాట చోటు చేసుకుంది. సెక్టార్ 2లో ఈ తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తుంది. ఈ తొక్కిసలాటలో చాలా మంది మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇప్పటి వరకు 15 మంది మృతి చెంది ఉంటారని అధికారులు చెబుతున్నారు. అధికారికంగా మృతుల సంఖ్య వెల్లడించనప్పటికీ సుమారు 15 మంది వరకు మృతి చెంది ఉంటారని చెబుతున్నారు. దీంతో పాటు 30 మంది వరకు గాయపడ్డారని, వారి పరిస్థితి తీవ్రంగా ఉందని చెబుతున్నారు. మౌని అమావాస్య కారణంగా స్నానం చేసేందుకు ఒక్కసారిగా భక్తులు వచ్చేయడంతో బారికేడ్లు విరిగిపడ్డాయి. దీంతో ఈ తొక్కిసలాట జరిగింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రధాని మోదీ ఆరా
ఈ తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ ఆరా తీశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. భక్తులకు సహాయక చర్యలు అందించాలని సూచించారు. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా యోగికి ఫోన్ చేసి ఈ ఘటనపై ఆరా తీశారు. దీంతో పాటు సీఎం యోగి కూడా భక్తులకు త్రివేణి సంగమం ప్రధాన కేంద్రం వద్ద కాకుండా సమీప ప్రాంతాల్లో స్నానాలు చేయాలని సూచించారు.



Click it and Unblock the Notifications