Latest Updates
-
ఎలాంటి సాస్లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్! -
ఉదయం 5 గంటలకు నిద్రలేస్తేనే సక్సెస్ వస్తుందా?.. ప్రముఖ న్యూరోసైంటిస్ట్ చెబుతున్న సంచలన నిజాలివే! -
ఎండ దెబ్బకు చెక్: బార్లీ నీళ్లా? చెరకు రసమా? వేసవి వ్యర్థాలను తరిమికొట్టే బెస్ట్ డ్రింక్ ఏది? -
ఇప్పటి ప్రేమ పరిచయాలు యువతను ఎందుకు మానసికంగా అలసిపోయేలా చేస్తోంది -
మధురై తణ్ణి చట్నీతో ఇడ్లీ, దోశల టేస్ట్ డబుల్!..ఎలా చేసుకోవాలంటే.. -
బాధ్యతలు ఏవైనా ఒత్తిడి సమానమే.. మహిళలూ వీటిపై నిర్లక్ష్యం వద్దు.! -
జూన్ 4: గ్రహాల కదలికలతో ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం, కెరీర్లో అద్భుతమైన మార్పులు! -
జూన్ 4న అరుదైన బ్రహ్మ యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీదే!
దేవుడు ఉన్నాడురా: 27 ఏళ్ల క్రితం అదృశ్యమైన భర్తను కుంభమేళాలో కలుసుకున్న మహిళ
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగరాజ్ లో మహాకుంభమేళా ఘనంగా కొనసాగుతోంది. నిత్యం కోట్లాది మంది భక్తులు ప్రయాగరాజ్ లో కుంభమేళాలో పాల్గొంటున్నారు. పవిత్ర సంగమంలో పుణ్య స్నానాలు చేస్తున్నారు. అయితే కుంభమేళాలో ఎన్నో అద్భుతాలు జరగ్గా తాజాగా జరిగిన ఓ అద్భుతం చాలా హైలెట్ అయింది. 27 ఏళ్ల క్రితం అదృశ్యమైన తన భర్తను కుంభమేళాలో ఓ మహిళ కలుసుకుంది. ఆ తర్వాత వారి కుటుంబసభ్యులు మొత్తం కుంభమేళాకు చేరుకున్నారు.
అసలేం జరిగింది
జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన గ్యాంగ్ స్టర్ గంగాసాగర్ యాదవ్ అనే వ్యక్తి 1998లో తన భార్య ధన్వదేవి, పిల్లలను వదిలి పాట్నా వెళ్లి ఆ తర్వాత కనబడకుండా పోయాడు. ఆ సమయంలో అతని పెద్ద కొడుకు కమలేష్ వయసు కేవలం రెండు సంవత్సరాలు కాగా, చిన్న కొడుకు విమలేష్ ఇంకా పుట్టలేదు. అప్పటినుంచి అతని కుటుంబం అతని కోసం వెతకని చోటు లేదు. గంగాసాగర్ అదృశ్యం అతని కుటుంబాన్ని ఆర్థికంగా,మానసికంగా కుంగదీసింది. అతని భార్య ఒంటరిగా ఇద్దరు చిన్న పిల్లల బాధ్యతను మోయవలసి వచ్చింది.

బుధవారం ప్రయాగరాజ్ లో మహాకుంభమేళాకు వచ్చిన వీరి బంధువు ఒకరికి గంగాసాగర్ యాదవ్ అఘోరిగా కనిపించాడు. దీంతో వెంటనే అతను ఫొటో తీసి గంగాసాగర్ కుటుంబసభ్యులకు పంపించాడు. దీంతో తన తమ్ముడు మురళీ యాదవ్, గంగా సాగర్ కుటుంబంతో కలిసి కుంభమేళాకు చేరుకున్నారు.
అఘోరిగా మారిన గంగాసాగర్ నుదిటిపై మచ్చ, ఎత్తు పళ్లు, మోకాలిపై దెబ్బలు గుర్తించి ఇతను తన భర్తేనని ధన్వా దేవి గుర్తించింది. అయితే వారితో ఇంటికి వచ్చేందుకు గంగాసాగర్ యాదవ్ నిరాకరించాడు. తనకు ఎవరూ లేరని ఇప్పుడు తాను గంగాసాగర్ యాదవ్ ను కాదని వారణాసికి చెందిన బాబా రాజ్కుమార్ సాధువు అని చెప్పుకున్నాడు. ఆయన వెంటనే ఓ సాధ్వి కూడా ఉంది.
ఆ కుటుంబం మాత్రం ఆయన గంగాసాగరే అని పట్టుబట్టింది. అతడి నిజస్వరూపాన్ని నిర్ధారించడానికి డీఎన్ఏ పరీక్ష చేయించుకోవాలని ధన్వా దేవి,గంగాసాగర్ సోదరుడు డిమాండ్ చేశారు. కుంభమేళా ముగిసే వరకు మేము వేచి ఉంటాము. అవసరమైతే డీఎన్ఏ పరీక్ష కోసం పట్టుబడతామని తెలిపారు. కొంతమంది కుటుంబ సభ్యులు ఇంటికి తిరిగి రాగా, మరికొందరు ఆయనను గమినిస్తూ అక్కడే ఉన్నారు.



Click it and Unblock the Notifications