Latest Updates
-
ఎండలను ఎదిరించే కమ్మని పానీయం..మసాలా మజ్జిగ తయారీ విధానం ఇదే! -
మద్యం తాగకపోయినా లివర్ డ్యామేజ్? కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినండి, వాటికి దూరంగా ఉండండి! -
అక్షయ తృతీయ వేళ పెళ్లిళ్ల సందడి.. కోర్టు మ్యారేజీల వైపు జంటల మొగ్గు! -
చూస్తే కలర్ ఫుల్, తింటే క్రంచీ..ఈ ఎండాకాలంలో టమాటా వడియాలు రుచి చూడాల్సిందే! -
బంధం నిలబడాలంటే... భాగస్వామితో అప్పుడప్పుడు ఈ అబద్ధాలు చెప్పాల్సిందే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరచండి -
ఇంట్లోనే ఫైవ్ స్టార్ హోటల్ రుచి.. ఘుమఘుమలాడే కొబ్బరి కొత్తిమీర చికెన్ రోస్ట్ -
బంగాళదుంపలు, గుడ్లు ఉడకబెట్టేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా? పర్ఫెక్ట్ గా ఉడికే ట్రిక్ చెప్పిన చెఫ్! -
కాలేయ ఆరోగ్యం కోసం చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు పాటిస్తున్నారా? -
బరువు తగ్గడానికి బ్రహ్మాస్త్రం.. పరగడుపున అవిసె గింజల నీళ్లు తాగితే పొట్ట మాయం!
దేవుడు ఉన్నాడురా: 27 ఏళ్ల క్రితం అదృశ్యమైన భర్తను కుంభమేళాలో కలుసుకున్న మహిళ
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగరాజ్ లో మహాకుంభమేళా ఘనంగా కొనసాగుతోంది. నిత్యం కోట్లాది మంది భక్తులు ప్రయాగరాజ్ లో కుంభమేళాలో పాల్గొంటున్నారు. పవిత్ర సంగమంలో పుణ్య స్నానాలు చేస్తున్నారు. అయితే కుంభమేళాలో ఎన్నో అద్భుతాలు జరగ్గా తాజాగా జరిగిన ఓ అద్భుతం చాలా హైలెట్ అయింది. 27 ఏళ్ల క్రితం అదృశ్యమైన తన భర్తను కుంభమేళాలో ఓ మహిళ కలుసుకుంది. ఆ తర్వాత వారి కుటుంబసభ్యులు మొత్తం కుంభమేళాకు చేరుకున్నారు.
అసలేం జరిగింది
జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన గ్యాంగ్ స్టర్ గంగాసాగర్ యాదవ్ అనే వ్యక్తి 1998లో తన భార్య ధన్వదేవి, పిల్లలను వదిలి పాట్నా వెళ్లి ఆ తర్వాత కనబడకుండా పోయాడు. ఆ సమయంలో అతని పెద్ద కొడుకు కమలేష్ వయసు కేవలం రెండు సంవత్సరాలు కాగా, చిన్న కొడుకు విమలేష్ ఇంకా పుట్టలేదు. అప్పటినుంచి అతని కుటుంబం అతని కోసం వెతకని చోటు లేదు. గంగాసాగర్ అదృశ్యం అతని కుటుంబాన్ని ఆర్థికంగా,మానసికంగా కుంగదీసింది. అతని భార్య ఒంటరిగా ఇద్దరు చిన్న పిల్లల బాధ్యతను మోయవలసి వచ్చింది.

బుధవారం ప్రయాగరాజ్ లో మహాకుంభమేళాకు వచ్చిన వీరి బంధువు ఒకరికి గంగాసాగర్ యాదవ్ అఘోరిగా కనిపించాడు. దీంతో వెంటనే అతను ఫొటో తీసి గంగాసాగర్ కుటుంబసభ్యులకు పంపించాడు. దీంతో తన తమ్ముడు మురళీ యాదవ్, గంగా సాగర్ కుటుంబంతో కలిసి కుంభమేళాకు చేరుకున్నారు.
అఘోరిగా మారిన గంగాసాగర్ నుదిటిపై మచ్చ, ఎత్తు పళ్లు, మోకాలిపై దెబ్బలు గుర్తించి ఇతను తన భర్తేనని ధన్వా దేవి గుర్తించింది. అయితే వారితో ఇంటికి వచ్చేందుకు గంగాసాగర్ యాదవ్ నిరాకరించాడు. తనకు ఎవరూ లేరని ఇప్పుడు తాను గంగాసాగర్ యాదవ్ ను కాదని వారణాసికి చెందిన బాబా రాజ్కుమార్ సాధువు అని చెప్పుకున్నాడు. ఆయన వెంటనే ఓ సాధ్వి కూడా ఉంది.
ఆ కుటుంబం మాత్రం ఆయన గంగాసాగరే అని పట్టుబట్టింది. అతడి నిజస్వరూపాన్ని నిర్ధారించడానికి డీఎన్ఏ పరీక్ష చేయించుకోవాలని ధన్వా దేవి,గంగాసాగర్ సోదరుడు డిమాండ్ చేశారు. కుంభమేళా ముగిసే వరకు మేము వేచి ఉంటాము. అవసరమైతే డీఎన్ఏ పరీక్ష కోసం పట్టుబడతామని తెలిపారు. కొంతమంది కుటుంబ సభ్యులు ఇంటికి తిరిగి రాగా, మరికొందరు ఆయనను గమినిస్తూ అక్కడే ఉన్నారు.



Click it and Unblock the Notifications











