Latest Updates
-
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.!
Mahakumbh mela: కుంభమేళాకి వచ్చిన పాకిస్తానీలు..ఏమన్నారంటే..
యూపీ రాష్ట్రంలోని ప్రయాగరాజ్ లో జరుగుతున్న అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళాలో పాకిస్తానీలు పాల్గొన్నారు. పాకిస్తాన్ లోని సింధూ ప్రావిన్స్కు చెందిన 68 మంది హిందూ యాత్రికుల బృందం గురువారం కుంభమేళాలో పాల్గొని త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేశారు. తమ పూర్వీకులు అస్థికలు కూడా త్రివేణి సంగమంలో కలిపి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేశారు. తమకు కుంభమేళాకు హాజరయ్యేందుకు త్వరితగతిన వీసాలు అందించింనందుకు మోదీ ప్రభుత్వానికి పాక్ హిందూ యాత్రికుల బృందం థ్యాంక్స్ చెప్పింది. పాకిస్తాన్ కు చెందిన భక్తులకు వీసాలను మంజూరు చేయడాన్ని భారత ప్రభుత్వం కొనసాగిస్తున్న ఆశిస్తున్నట్లు చెప్పారు.
కుంభమేళాలో వివిధ క్యాంప్ లను సందర్శించి ఆథ్యాత్మిక గురువులను కలిసినట్లు పాకిస్తాన్ కు చెందిన గోవింద్ రామ్ మకాజియా మీడియా తెలిపారు. కుంభమేళా ఏర్పాట్లకు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయనని ప్రశంసించారు. తాము కుంభమేళాలో పాల్గొంటామని ఎన్నడూ ఊహించలేదన్నారు. తమ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేమన్నారు.

ఈ 68 మంది పాక్ హిందూ యాత్రికుల్లో 50 మంది మొదటిసారిగా కుంభమేళాను సందర్శించారు. భారత్ కు మొదటిసారి వచ్చానని,చాటా గ్రేట్ ఫీలింగ్ ఉందని పాక్ కు చెందిన ప్రియాంక తెలిపారు. ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు.మ రో వ్యక్తి మాట్లాడుతూ.. గత కొన్నినెలల నుంచి కుంభమేళా గురించి వింటున్నానని,ఎప్పటికైనా ఇక్కడికి రావాలనే కోరిక ఉండేదని చెప్పారు. తాము ప్రయాగ్రాజ్లోని కుంభమేళాకు రాకముందు.. హరిద్వార్కు వెళ్లామని చెప్పారు.
దేశం నలుమూలల నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి పెద్దసంఖ్యలో కుంభమేళాకు హాజరవుతున్నారు. కుంభమేళాకు హాజరవుతున్నవారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక్క హిందువులే కాకుండా అనేక ఇతర మతాలకు చెందిన వ్యక్తులు కూడా పెద్ద సంఖ్యలో కుంభమేళాలకు హాజరవుతుండటం. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి 33 కోట్లమందికి పైగా భక్తులు కుంభమేళాకు వచ్చినట్లు యూపీ ప్రభుత్వం అంచనా వేసింది.



Click it and Unblock the Notifications