Latest Updates
-
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు!
PM Modi In Prayagraj: మహాకుంభమేళాలో మోదీ..బీష్మ అష్టమి రోజున పుణ్యస్నానం చేసిన ప్రధాని
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగరాజ్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమమైన మహాకుంభమేళా ఘనంగా కొనసాగుతోంది. నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు కుంభమేళాకు హాజరవుతున్నారు. కుంభమేళాలో త్రివేణి సంగంలో పుణ్య స్నానాలు చేసేందుకు దేశం నలుమూలల నుంచే కాదు ప్రపంచం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాగరాజ్ చేరుకుంటున్నారు. ఇతర మతాలకు చెందిన అనేకమంది కూడా కుంభమేళాకు హాజరవుతుండటం విశేషం.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ ప్రయాగరాజ్ వెళ్లి మహాకుంభమేళాలో పాల్గొన్నారు. ఇవాళ బీష్మ అష్టమి సందర్భంగా ప్రయాగరాజ్ లోని త్రివేణి సంగమం దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మోదీ పుణ్య స్నానం చేశారు. చేతిలో రుద్రాక్ష జపమాల పట్టుకుని మంత్రాలు జపిస్తూ సంగమంలో స్నానం ఆచరించారు.

అంతకుముందు అలైల్ ఘాట్ నుంచి సంగమం వరకు బోట్ లో ప్రయాణించారు మోదీ. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా మోదీ వెంట ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంగం ఘాట్కు చేరుకున్న వెంటనే మోదీ మోదీ అంటూ నినాదాలు మార్మోగాయి.
బీష్మ అష్టమి రోజునే మోదీ పుణ్న స్నానం ఎందుకు
మహా భారతంలో జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల తరఫున పోరాడి ఓడినప్పటికీ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకు అంపశయ్యపై ఉండి ప్రాణాలు నిలుపుకొని మాఘ మాసం శుద్ధ అష్టమి రోజున శరీరాన్ని విడిచిన మహానుభావుడు భీష్మ పితామహుడు. తాను కోరుకున్న సమయంలో మరణించే వరం ఉన్న భీష్ముడు అంపశయ్య మీద ప్రాణ త్యాగం చేసిన రోజు భీష్మాష్టమి. ఈ రోజున పుణ్య నది స్నానం చేయడం, పేదలకు అన్నదానం, గోవులకు గ్రాసం ఇవ్వడం ద్వారా శుభఫలితాలు కలుగుతాయి. ఈ రోజున భీష్మునికి తిలాంజలి సమర్పించే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం.
జనవరి 13న మహాకుంభమేళా ప్రారంభమవగా..మహాశివరాత్రి వరకు అంటే ఫిబ్రవరి 26వరకు కొనసాగుతుంది. ఇప్పటి వరకు సుమారు 38 కోట్ల మందికి 144 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ మహా కుంభమేళాకు వచ్చినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. లెక్కకు మించి వచ్చే కోట్లాది మంది భక్త జనానికి యూపీ సర్కార్ ఆహారం, నీరుతో పాటు అవసరమైన వసతులన్నీ ఉచితంగా కల్పిస్తోంది. మహా కుంభమేళాలో పవిత్ర నదీ స్నానాలే కాదు.. సాంస్కృతిక కార్యక్రమాలు సైతం ఆకర్షణగా నిలుస్తున్నాయి.



Click it and Unblock the Notifications











