Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
PM Modi In Prayagraj: మహాకుంభమేళాలో మోదీ..బీష్మ అష్టమి రోజున పుణ్యస్నానం చేసిన ప్రధాని
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగరాజ్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమమైన మహాకుంభమేళా ఘనంగా కొనసాగుతోంది. నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు కుంభమేళాకు హాజరవుతున్నారు. కుంభమేళాలో త్రివేణి సంగంలో పుణ్య స్నానాలు చేసేందుకు దేశం నలుమూలల నుంచే కాదు ప్రపంచం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాగరాజ్ చేరుకుంటున్నారు. ఇతర మతాలకు చెందిన అనేకమంది కూడా కుంభమేళాకు హాజరవుతుండటం విశేషం.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ ప్రయాగరాజ్ వెళ్లి మహాకుంభమేళాలో పాల్గొన్నారు. ఇవాళ బీష్మ అష్టమి సందర్భంగా ప్రయాగరాజ్ లోని త్రివేణి సంగమం దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మోదీ పుణ్య స్నానం చేశారు. చేతిలో రుద్రాక్ష జపమాల పట్టుకుని మంత్రాలు జపిస్తూ సంగమంలో స్నానం ఆచరించారు.

అంతకుముందు అలైల్ ఘాట్ నుంచి సంగమం వరకు బోట్ లో ప్రయాణించారు మోదీ. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా మోదీ వెంట ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంగం ఘాట్కు చేరుకున్న వెంటనే మోదీ మోదీ అంటూ నినాదాలు మార్మోగాయి.
బీష్మ అష్టమి రోజునే మోదీ పుణ్న స్నానం ఎందుకు
మహా భారతంలో జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల తరఫున పోరాడి ఓడినప్పటికీ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకు అంపశయ్యపై ఉండి ప్రాణాలు నిలుపుకొని మాఘ మాసం శుద్ధ అష్టమి రోజున శరీరాన్ని విడిచిన మహానుభావుడు భీష్మ పితామహుడు. తాను కోరుకున్న సమయంలో మరణించే వరం ఉన్న భీష్ముడు అంపశయ్య మీద ప్రాణ త్యాగం చేసిన రోజు భీష్మాష్టమి. ఈ రోజున పుణ్య నది స్నానం చేయడం, పేదలకు అన్నదానం, గోవులకు గ్రాసం ఇవ్వడం ద్వారా శుభఫలితాలు కలుగుతాయి. ఈ రోజున భీష్మునికి తిలాంజలి సమర్పించే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం.
జనవరి 13న మహాకుంభమేళా ప్రారంభమవగా..మహాశివరాత్రి వరకు అంటే ఫిబ్రవరి 26వరకు కొనసాగుతుంది. ఇప్పటి వరకు సుమారు 38 కోట్ల మందికి 144 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ మహా కుంభమేళాకు వచ్చినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. లెక్కకు మించి వచ్చే కోట్లాది మంది భక్త జనానికి యూపీ సర్కార్ ఆహారం, నీరుతో పాటు అవసరమైన వసతులన్నీ ఉచితంగా కల్పిస్తోంది. మహా కుంభమేళాలో పవిత్ర నదీ స్నానాలే కాదు.. సాంస్కృతిక కార్యక్రమాలు సైతం ఆకర్షణగా నిలుస్తున్నాయి.



Click it and Unblock the Notifications