Latest Updates
-
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా?
Same Sex Marriage: స్వలింగ వివాహాల పిటిషన్లు కొట్టేయండి, చట్టసభలకే వదిలేయండి: కేంద్రం
స్వలింగ వివాహాలను గుర్తించాలంటూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లను కొట్టేయాలని కేంద్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది. ఈ అంశాన్ని ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధుల నిర్ణయానికి వదిలేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ పిటిషన్ల విచారణ అర్హతను ప్రశ్నిస్తూ సుప్రీం కోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేసింది.

కోర్టులు దూరంగా ఉండాలని విజ్ఞప్తి:
స్వలింగ వివాహ బంధాలను ప్రస్తుతం ఉన్న వివాహ వ్యవస్థతో సమానంగా పరిగణిస్తే అది ప్రతి పౌరుడిపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని కేంద్ర సర్కారు అభిప్రాయం వ్యక్తం చేసింది. స్వలింగ వివాహాలను గుర్తించడం పూర్తిగా చట్టపరమైన అంశమని, దీనికి కోర్టులు దూరంగా ఉండాలని సుప్రీం కోర్టును విజ్ఞప్తి చేసింది.
స్వలింగ వివాహాలపై ముందుగా చట్టబద్ధత రావాలి:
వివాహం చట్టబద్ధత అనేది ఒక సామాజిక-చట్టపరమైన వ్యవస్థ అని రాజ్యాంగం ప్రకారం, దీనిని చట్ట సభలు సృష్టించాయని తన కౌంటర్ లో పేర్కొంది. దాని ప్రకారమే వివాహానికి చట్టబద్ధత రావాలని తెలిపింది. వివాహాలకు చట్టబద్ధతను ఇచ్చే అంశంలో పార్లమెంట్ అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటుందని కేంద్రం వెల్లడించింది.
గ్రామీ, సెమీ-రూరల్, పట్టణ, నగర ప్రాంత ప్రజల అభిప్రాయాలు, మతపరమైన అంశాలు, ఆచారాలు అన్నింటినీ పరిశీలించిన తర్వాతే చట్టాలను రూపొందిస్తారని పేర్కొంది. కొత్త బంధాలను గుర్తించడం, ఆ బంధాలకు చట్టబద్ధత కల్పించడం వంటివి కూడా చట్ట సభ్యులే నిర్ణయించాలని, అంతేకానీ ఇది న్యాయవ్యవస్థ పరిధిలోకి రాదంటూ తన కౌంటర్ పిటిషన్ లో పేర్కొంది.
అందుకే ఈ అంశంలో కోర్టులు దూరంగా ఉండాలని సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేసింది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తే వ్యక్తిగత చట్టాలు, సామాజిక విలువల సున్నిత సమతౌల్యత పూర్తిగా దెబ్బతింటుందని కేంద్రం ఈ సందర్భంగా పేర్కొంది.
కేంద్ర పిటిషన్పైనా విచారణ:
సేమ్ సెక్స్ మ్యారేజెస్ చట్టబద్ధతపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసం ఏప్రిల్ 18 నుండి విచారణ జరపనుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. కేంద్ర పిటిషన్ ను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. దీనిపై కూడా ఏప్రిల్ 18న విచారణ జరుపుతామని పేర్కొంది.



Click it and Unblock the Notifications











