ఫ్లైట్లో వందల దొంగతనాలు.. మహిలళే టార్గెట్.. గెస్ట్‌హౌస్ ఓనర్ నిర్వాకం..!

జేబు దొంగతనాలు పోయి హైటెక్ దోపిడీలు పెరిగాయ్. మనకు తెలియకుండానే క్షణాల్లో మన ఫోన్‌లోంచి డబ్బు మాయమైపోతుంది. డిజిటల్ మనీకు కూడా గ్యారెంటీ లేదు. సినిమాల్లో హీరోలు కూడా ఇదే వృత్తులతో కనిపించి అలరించడం విశేషం. రోజూ జరుగుతున్న దోపిడీల్లో కొన్ని వింతలు చూసి మనం ఆశ్చర్యపోయి జాగ్రత్తపడ్డం తప్ప ఏమీ చేయలేము. తాజాగా ఢిల్లీ పోలీసులు ఒక దొంగను పట్టుకొని అతడు చేసిన దొంగతనాలు చూసి షాక్ అయ్యారు. 100 రోజుల్లో 200ల సార్లు ఫ్లైట్ ఎక్కి దొంగతనాలు చేశారు. ఇలాంటి వారి నుంచి మనం అప్రమత్తంగా లేకపోతే జేబు ఖాలీ అయి బాధపడ్డం తప్ప తరువాత ఏమీ చేయలేము.

ఏయిర్ పోర్టుల వద్ద దొంగతనాలు చేయడం రాజేష్‌ కపూర్‌కు వెన్నెతో పెట్టిన విద్యా. అలా ఏయిర్‌పోర్టుల్లోనే వందల దొంగతనాలు సునాయాసంగా చేశారు. అత్యంత భద్రతతో కూడిన ఢిల్లీ ఏయిర్‌పోర్టుల్లో ఇతగాడు దొంగతనాలు చేశారు. రాజేష్ కపూర్ ఎక్కువగా కనెక్టింగ్ ఫ్లైట్లు ఎక్కేవారినే టార్గెట్‌గా చేసుకునేవాడు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ గుండా అమెరికా వెళ్లేవారిని ఇలా కనెక్టింగ్ ఫ్లైట్లు ఎక్కేవారినే లక్ష్యంగా చేసుకొని దొంగలించేవాడు.

Man steals lakhs worth jewellery by travelling 200 flights in 110 days was caught by delhi police

మహిళలు, వయసు ఎక్కువగా ఉన్నవారినే టార్గెట్‌గా చేసుకొని ముందుగా వారి ప్రవర్తనను కదలికలను గమనించేవాడు. మెల్లగా వారి వెనకాలే వెళ్తూ వారిని అనుసరించి వాళ్ల బ్యాగ్‌పై ఉన్న స్లిప్‌ను చదివి బ్యాగ్‌లో ఏయే వస్తువులు ఉన్నాయో తెలుసుకునేవాడు. రాజేష్ కపూర్ చేసే దొంగతనాలను సీసీటీవీ ఫుటేజ్ ద్వారా బయటపడ్డాయ్.

ఫ్లైట్‌లోకి ఎక్కగానే ఫ్లైట్ అటెండెంట్‌కు తన సీటును మార్చమని చెప్పేవాడు. ఇలా తాను టార్గెట్ చేసుకున్న వారి పక్కనో లేక వారి దగ్గరో ఫ్లైట్ లోపల కూర్చునేవాడు. కొన్ని సందర్భాల్లో అనుకోకుండా వారి సీటు పక్కనే ఇతని సీటు బుక్ అయి వుండేది. అలా వారి దగ్గర కూర్చున్న తరువాత సీటు అడ్జెస్ట్ చేసుకుంటున్నాననే నెపంతో టార్గెట్ చేసుకున్న వారి బ్యాగులోంచి ఆభరణాలను దొంగలించేవాడు. ఇలా రాజేష్ కపూర్ 2023 వ సంవత్సరంలో 110 విమానాలు ఎక్కి 200లకు పైగా దొంగతనాలు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఏయిర్‌పోర్టు వారికి ఇచ్చిన ఫోన్‌నంబర్లు కూడా నకిలీవేనని తరువాత తెలిసింది. వేరే వారి పేర్లతో రిజిస్టర్ అయిన నంబర్లను తాను ఏయిర్‌పోర్టు వారికి ఇచ్చినట్లు కనుగ్గొన్నారు. ఇలా తన పై ఎలాంటి అనుమానం రాకుండా, గుర్తులు లేకుండా జాగ్రత్త పడేవాడని పోలీసులు చెబుతున్నారు.

సీసీటీవీ కెమెరా వీడియోల ఆధారంగా రాజేష్ కపూర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనికి ఢిల్లీ పహర్‌గంజ్‌లో ఢిళ్లీ రైల్వే స్టేషన్ సమీపంలో స్వంతంగా గెస్ట్ హౌస్ ఉన్నట్లు తెలిపింది. మూడవ ఫ్లోర్లో ఇతను ఉంటూ మిగతావి రెంట్‌కు ఇచ్చాడు. ఇదే కాకుండా రాజేష్‌కు ఒక మొబైల్ రిపేర్ షాపు, మనీ ఎక్స్‌చేంజ్ బిజినెస్ ఉన్నట్లు కనుగ్గొన్నారు. తాను దొంగతనం ఎక్కువగా మహిళల బ్యాగుల్లోంచే చేసేవాడినని చెప్పాడు. దొంగతనానికి ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, చంఢీగడ్, బెంగళూరు, ముంబై, అమృత్‌సర్ ఏయిర్‌పోర్టులను ఎంచుకునేవాడు. ఫ్లైట్లో దొంగతనం చేసే ముందు ఇదే తరహాలో రైళ్లో దొంగతనం చేసేవాడని.. అనేక సార్లు పట్టుబడ్డ తరువాత 2023 నుంచి ఫ్లైట్లో దొంగతనం చేయడం మొదలుపెట్టినట్లు పోలీసులు తెలిపారు.

Story first published: Tuesday, May 14, 2024, 14:24 [IST]
Desktop Bottom Promotion