Latest Updates
-
హోటల్ రుచిని మరిపించే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ..వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది! -
చక్కెరకు బదులు బెల్లం: మీ ఆరోగ్యానికి ఇదే శ్రీరామరక్ష! -
పాకం పట్టే పనే లేదు..మన తాతమ్మల కాలం నాటి హెల్దీ జొన్న లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
మీ భర్తతో ఈ 4 మాటలు అంటున్నారా? అయితే మీ కాపురంలో చిచ్చు రేగినట్టే! -
పోషకాల గని, ఆరోగ్యానికి పెన్నిధి.. గోధుమ రవ్వ కిచిడీ ఎలా చేసుకోవాలంటే.. -
స్నేహితురాలికి ఆశ్రయం ఇస్తే.. బాయ్ ఫ్రెండ్ వింత ప్రవర్తన..ప్రియురాలి ఆవేదన! -
బయట బండి మీద దొరికే రుచితో ఇంట్లోనే భేల్ పూరీ.. ఒక్కసారి రుచి చూస్తే వదలరు! -
ఇడ్లీ, దోసెల్లోకి ఈసారి వంకాయ చట్నీ రుచి చూడండి..లెక్కపెట్టకుండా తినేస్తారు -
హైదరాబాద్ స్పెషల్ ఇరానీ ఛాయ్.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి! -
చపాతీ, పూరీ, పులావ్ లలోకి అదిరిపోయే మీల్ మేకర్ మసాలా గ్రేవీ.. నాన్ వెజ్ కూడా దీని ముందు దిగదుడుపే!
తండ్రి సూపర్ స్టార్..సినిమా వద్దని సివిల్స్..ఇప్పుడు కలెక్టర్ గా అక్కడ డ్యూటీ!
సినిమా ఫీల్డ్ లో నెపోటిజం అనే పేరు తరచుగా వింటుంటాం.సినీ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లో ఉన్న వ్యక్తులు ఎవరైనా తన కొడుకుని లేదా తన కుటుంబంలోని మిగతావాళ్లను ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి అవకాశాలను వేరే వాళ్లకు వెళ్లకుండా చేస్తుంటారని తరచుగా ప్రధాన మీడియాలో,సోషల్ మీడియాలో కూడా చర్చ జరుగుతుంటది. స్టార్ హీరోలు లేదా నటుల పిల్లలు తల్లిదండ్రుల అడుగుజాడల్లో సినీ ప్రపంచంలోకి వస్తారన్న డిబేట్ పాతదే అయినప్పటికీ అందరి అగ్ర నటుల పిల్లలు అందరూ అలా ఉండరు అని తరుచుగా అనేక మందిని ఉదాహరణగా చెబుతుంటాం.
ఓ స్టార్ నటుడు కుమారుడు తండ్రి బాటలో సినిమాల్లోకి రాకుండా సివిల్స్ ఎగ్జామ్ రాసి ఐఏఎస్ అయ్యాడు. కృష్ణమూర్తి నారాయణ్ అలియాస్ చిన్ని జయంత్..ఈ పేరు తెలియని తమిళులు ఉండరు. కోలీవుడ్ లో అగ్రనటుడు. 1980లలో రజనీకాంత్ సహా అనేక అగ్ర నటులతో నటించి బాగా గుర్తింపు పొందాడు. తమిళ సినిమాల్లో సూపర్ స్టార్ గా మారారు. ఇతనికి శ్రుతంజయ్ నారాయణన్ అనే కొడుకు ఉన్నాడు. చిన్నతనం నుంచే శ్రుతుంజయ్ కి సినిమాల మీద ఇష్టం ఉండేది. అయితే క్రమంగా సినిమాల మీదనుంచి అతడి దృష్టి చదవుమీదకి మళ్లింది. ప్రముఖ అశోక యూనివర్శిటీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు.

తండ్రిలా సినిమాల్లోకి వెళ్లాలని శత్రుంజయ్ లో ఉండేది కాదు. తాను ఐఏఎస్ అవ్వాలని కలలు కనేవాడు. క్రమంగా సివిల్స్ సర్వీసెస్ లోకి వెళ్లాలన్న కోరిక శ్రుతంజయ్ నారాయణన్ లో కలగడంతో సివిల్స్ పరీక్షకు ప్రిపేర్ అవడం మొదలుపెట్టాడు. రోజుకు 10-12 గంటలు చదివేవాడు. పగలు సివిల్స్ పరీక్షకు ప్రిపేర్ అవడం..తన పాకెట్ మనీ కోసం కుటుంబం మీద ఆధారపడకుండా రాత్రిళ్లు జాబ్ చేసేవాడు.
తొలి ప్రయత్నంలో సివిల్స్ ఫెయిల్ అయ్యాడు. అయినా నిరుత్సాహపడకుండా 2019లో రెండోసారి సివిల్స్ పరీక్ష రాశాడు. 2020లో విడుదలైన సివిల్స్ ఫలితాల్లో శ్రుతంజయ్ నారాయణన్ 75 ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం శత్రుంజయ్ నారాయణన్ తమిళనాడులోని విల్లుపురం జాల్లా అడిషనల్ కలెక్టర్(development)కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.



Click it and Unblock the Notifications











