Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
తండ్రి సూపర్ స్టార్..సినిమా వద్దని సివిల్స్..ఇప్పుడు కలెక్టర్ గా అక్కడ డ్యూటీ!
సినిమా ఫీల్డ్ లో నెపోటిజం అనే పేరు తరచుగా వింటుంటాం.సినీ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లో ఉన్న వ్యక్తులు ఎవరైనా తన కొడుకుని లేదా తన కుటుంబంలోని మిగతావాళ్లను ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి అవకాశాలను వేరే వాళ్లకు వెళ్లకుండా చేస్తుంటారని తరచుగా ప్రధాన మీడియాలో,సోషల్ మీడియాలో కూడా చర్చ జరుగుతుంటది. స్టార్ హీరోలు లేదా నటుల పిల్లలు తల్లిదండ్రుల అడుగుజాడల్లో సినీ ప్రపంచంలోకి వస్తారన్న డిబేట్ పాతదే అయినప్పటికీ అందరి అగ్ర నటుల పిల్లలు అందరూ అలా ఉండరు అని తరుచుగా అనేక మందిని ఉదాహరణగా చెబుతుంటాం.
ఓ స్టార్ నటుడు కుమారుడు తండ్రి బాటలో సినిమాల్లోకి రాకుండా సివిల్స్ ఎగ్జామ్ రాసి ఐఏఎస్ అయ్యాడు. కృష్ణమూర్తి నారాయణ్ అలియాస్ చిన్ని జయంత్..ఈ పేరు తెలియని తమిళులు ఉండరు. కోలీవుడ్ లో అగ్రనటుడు. 1980లలో రజనీకాంత్ సహా అనేక అగ్ర నటులతో నటించి బాగా గుర్తింపు పొందాడు. తమిళ సినిమాల్లో సూపర్ స్టార్ గా మారారు. ఇతనికి శ్రుతంజయ్ నారాయణన్ అనే కొడుకు ఉన్నాడు. చిన్నతనం నుంచే శ్రుతుంజయ్ కి సినిమాల మీద ఇష్టం ఉండేది. అయితే క్రమంగా సినిమాల మీదనుంచి అతడి దృష్టి చదవుమీదకి మళ్లింది. ప్రముఖ అశోక యూనివర్శిటీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు.

తండ్రిలా సినిమాల్లోకి వెళ్లాలని శత్రుంజయ్ లో ఉండేది కాదు. తాను ఐఏఎస్ అవ్వాలని కలలు కనేవాడు. క్రమంగా సివిల్స్ సర్వీసెస్ లోకి వెళ్లాలన్న కోరిక శ్రుతంజయ్ నారాయణన్ లో కలగడంతో సివిల్స్ పరీక్షకు ప్రిపేర్ అవడం మొదలుపెట్టాడు. రోజుకు 10-12 గంటలు చదివేవాడు. పగలు సివిల్స్ పరీక్షకు ప్రిపేర్ అవడం..తన పాకెట్ మనీ కోసం కుటుంబం మీద ఆధారపడకుండా రాత్రిళ్లు జాబ్ చేసేవాడు.
తొలి ప్రయత్నంలో సివిల్స్ ఫెయిల్ అయ్యాడు. అయినా నిరుత్సాహపడకుండా 2019లో రెండోసారి సివిల్స్ పరీక్ష రాశాడు. 2020లో విడుదలైన సివిల్స్ ఫలితాల్లో శ్రుతంజయ్ నారాయణన్ 75 ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం శత్రుంజయ్ నారాయణన్ తమిళనాడులోని విల్లుపురం జాల్లా అడిషనల్ కలెక్టర్(development)కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.



Click it and Unblock the Notifications