Latest Updates
-
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.!
తండ్రి సూపర్ స్టార్..సినిమా వద్దని సివిల్స్..ఇప్పుడు కలెక్టర్ గా అక్కడ డ్యూటీ!
సినిమా ఫీల్డ్ లో నెపోటిజం అనే పేరు తరచుగా వింటుంటాం.సినీ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లో ఉన్న వ్యక్తులు ఎవరైనా తన కొడుకుని లేదా తన కుటుంబంలోని మిగతావాళ్లను ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి అవకాశాలను వేరే వాళ్లకు వెళ్లకుండా చేస్తుంటారని తరచుగా ప్రధాన మీడియాలో,సోషల్ మీడియాలో కూడా చర్చ జరుగుతుంటది. స్టార్ హీరోలు లేదా నటుల పిల్లలు తల్లిదండ్రుల అడుగుజాడల్లో సినీ ప్రపంచంలోకి వస్తారన్న డిబేట్ పాతదే అయినప్పటికీ అందరి అగ్ర నటుల పిల్లలు అందరూ అలా ఉండరు అని తరుచుగా అనేక మందిని ఉదాహరణగా చెబుతుంటాం.
ఓ స్టార్ నటుడు కుమారుడు తండ్రి బాటలో సినిమాల్లోకి రాకుండా సివిల్స్ ఎగ్జామ్ రాసి ఐఏఎస్ అయ్యాడు. కృష్ణమూర్తి నారాయణ్ అలియాస్ చిన్ని జయంత్..ఈ పేరు తెలియని తమిళులు ఉండరు. కోలీవుడ్ లో అగ్రనటుడు. 1980లలో రజనీకాంత్ సహా అనేక అగ్ర నటులతో నటించి బాగా గుర్తింపు పొందాడు. తమిళ సినిమాల్లో సూపర్ స్టార్ గా మారారు. ఇతనికి శ్రుతంజయ్ నారాయణన్ అనే కొడుకు ఉన్నాడు. చిన్నతనం నుంచే శ్రుతుంజయ్ కి సినిమాల మీద ఇష్టం ఉండేది. అయితే క్రమంగా సినిమాల మీదనుంచి అతడి దృష్టి చదవుమీదకి మళ్లింది. ప్రముఖ అశోక యూనివర్శిటీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు.

తండ్రిలా సినిమాల్లోకి వెళ్లాలని శత్రుంజయ్ లో ఉండేది కాదు. తాను ఐఏఎస్ అవ్వాలని కలలు కనేవాడు. క్రమంగా సివిల్స్ సర్వీసెస్ లోకి వెళ్లాలన్న కోరిక శ్రుతంజయ్ నారాయణన్ లో కలగడంతో సివిల్స్ పరీక్షకు ప్రిపేర్ అవడం మొదలుపెట్టాడు. రోజుకు 10-12 గంటలు చదివేవాడు. పగలు సివిల్స్ పరీక్షకు ప్రిపేర్ అవడం..తన పాకెట్ మనీ కోసం కుటుంబం మీద ఆధారపడకుండా రాత్రిళ్లు జాబ్ చేసేవాడు.
తొలి ప్రయత్నంలో సివిల్స్ ఫెయిల్ అయ్యాడు. అయినా నిరుత్సాహపడకుండా 2019లో రెండోసారి సివిల్స్ పరీక్ష రాశాడు. 2020లో విడుదలైన సివిల్స్ ఫలితాల్లో శ్రుతంజయ్ నారాయణన్ 75 ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం శత్రుంజయ్ నారాయణన్ తమిళనాడులోని విల్లుపురం జాల్లా అడిషనల్ కలెక్టర్(development)కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.



Click it and Unblock the Notifications