Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
ఇండియాలో అత్యంత డిమాండ్ ఉన్న డ్రింక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
తిండితో ప్రయోగాలు చేయడం చాలామందికి ఇష్టం ఉంటుంది. అయితే కొందరు ఆ ప్రయోగంలో సక్సెస్ అయితే, ఇంకొందరు ఫెయిల్ అవుతుంటారు. సక్సెస్ అయిన తిండిని కొందరు దేశ వ్యాప్తంగా ప్రచారం చేసి మంచి బిజినెస్ చేసుకుంటూ ఉంటారు. మన ఇండియాలో ఇలాంటి వాటికి అసలు కొదువే లేదని చెప్పాలి. బొండాలు కాకుండా పునుగులు, బెల్లం టీ ఇలా ఎన్నో రకాల వంటకాలు మన ఇండియాలో ప్రసిద్ధి చెందాయి. చాలా ప్రాచుర్యం పొందాయి.
అయితే ప్రస్తుతం మన దేశంలో ఒక వినూత్నమైన కోలా బాగా వైరల్ అవుతుంది. అదే దూద్ కోలా. పాలు మరియు కోలా కలయికలో తయారయ్యే ఈ శీతలపానీయానికి దేశం మొత్తం ఫిదా అవుతుంది. ఇది ఎంతో రుచికరంగా ఉండడంతో పాటు తక్షణమే శక్తిని అందిస్తుందని చెబుతున్నారు. ఈ దూద్ కోలా స్టోరీ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.

దూద్ కోలా..
మీకు కోకా కోలా తెలిసి ఉంటుంది. అలాగే పాలు కూడా. వీటికి వేరు వేరు లక్షణాలు ఉంటాయి. ఈ రెండిటి కలయికలో చేసేదే దూద్ కోలా. పాలను, కోలాను మిక్స్ చేయడం ద్వారా ఒక ప్రత్యేకమైన రుచితో ఇది ఏర్పడుతుంది. ఈ దూద్ కోలాకు విచిత్రమైన చరిత్ర ఉంది. కోల్కతాలో ఉంటున్న పంజాబ్కు చెందిన ఒక డాబా యజమాని.. బల్వంత్ సింగ్ తన కుమారుడితో కలిసి మండుతున్న ఎండలో కూల్ డ్రింక్ తాగేందుకు వెళ్లారు. అయితే ఆయనకు రుచికరమైన పానీయం లభించలేదు. దీంతో ఆయన పాలతో కలిపి, దూద్ కోలాను తయారు చేశారు. అప్పటి నుంచి ఇది క్రమంగా దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. దీని ధర కూడా చాలా తక్కువ అని చెప్తున్నారు.
వేసవి కోసం ప్రత్యేకమైనది..
ఈ శీతలపానీయాన్ని ప్రత్యేకంగా వేసవి కోసం తయారు చేశామని ఈ శీతల పానీయాన్ని సృష్టించిన బల్వంత్ సింగ్ తెలిపారు. మండే ఎండలో దీనిని తాగడం వల్ల.. శరీరానికి తక్షణమైన ఓదార్పు లభిస్తుంది. అలాగే శక్తి కూడా అందుతుంది. కోల్కతాకు ఎవరైనా వెళ్తే.. కచ్చితంగా ఈ పానీయాన్ని రుచి చూడాలని అనుకుంటూ ఉంటారు.
ఇది ఆరోగ్యకరమైనదేనా?
ఈ డ్రింక్ ఆరోగ్యకరమైనదా అంటే కాదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాలలో కోలాను కలపడం వల్ల పాలలో ఉండే లక్షణాలు అన్నీ నాశనమైపోతాయి. పాలలో ఉండే పోషకాలు శరీరానికి ఏమాత్రం అందవు. అలాగే పాలలో ఉండే ఔషధ గుణాలు శరీరానికి వంటపట్టవు. పైగా కోలాలో ఉండే సోడియం, షుగర్ శరీరంలో షుగర్ శాతాన్ని పెంచుతాయి. మధుమేహం, అధిక బరువు వంటి సమస్యల బారిన పడే విధంగా చేస్తాయి. ఇది రుచికరంగా ఉంటుంది కానీ, ఆరోగ్యకరం మాత్రం కాదు.
నెటిజన్స్ ఏమంటున్నారంటే?
ఈ వింత డ్రింక్పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఈ డ్రింక్ రుచి చాలా బాగుందని అంటున్నారు. మరికొందరు ఇది వినాశనానికి ప్రారంభం అని, పాలలో ఎవరైనా కోలా కలుపుకొని తాగుతారా అని చెప్తున్నారు. ఇంకొందరు ఇలాంటి చెడు తిండి తినడం, ఇలాంటి చెత్త అలవాట్లు చేసుకోవడం వల్ల ప్రాణాపాయం అని, వీటిని ప్రోత్సహించకూడదని చెప్తున్నారు. మరి దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి. అలాగే ఈ స్టోరీని మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి.



Click it and Unblock the Notifications