Latest Updates
-
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది
మిస్టీరియస్ వ్యాధి.. సోకితే గంటల్లోనే మరణం ఖాయం, WHO ఏమంటుందంటే?
కరోనా మహమ్మారి తరువాత ఏదైనా కొత్త వ్యాధి పేరు వినపడిందంటే చాలు ప్రపంచం మొత్తం గడగడలాడిపోతుంది. ప్రజల్లో భ్రాయాందోళనలు మొదలవుతున్నాయి. ఎక్కడ ఇది మరో ప్రళయాన్ని సృష్టించబోతుందో అని కంగారు పడడం మొదలుపెడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం, ఆఫ్రికాలో మరో కొత్త వ్యాధి బయటపడి ప్రజలలో ఆందోళనను రేపుతోంది. ఈ కొత్త వ్యాధి కారణంగా, కాంగో దేశంలోని నార్త్వెస్ట్ ప్రాంతంలో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వ్యాధి సోకిన వ్యక్తులు కొన్ని గంటలలోనే మరణిస్తున్నారు. దీని గురించి మరిన్ని విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఏంటి ఆ వ్యాధి?
కాంగోలో కొత్త వ్యాధి ఉద్భవించింది. ఈ వ్యాధి ఏంటో తెలియదు కానీ, ఇది ఇప్పటి వరకు 400 మందికి సోకినట్లు అధికారులు నిర్ధారించారు. వీరిలో 50 మంది ప్రాణాలు విడిచారు. దీంతో ఆ ప్రాంతంలో ఇది భయంకర పరిస్థితిని సృష్టించింది. వ్యాధి లక్షణాలు బయటపడిన తర్వాత కొన్ని గంటల్లోనే బాధితులు మరణించడంతో ఈ వ్యాధి వ్యాప్తిని అర్థం చేసుకోవడం చాలా కష్టంగా మారింది. కాంగో ప్రభుత్వం ఈ వ్యాధిని అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది.

మొట్టమొదటి కేసు
కాంగోలో ఈ వ్యాధి మొదటి కేసు 2025 జనవరి 21న, ఈక్వేటర్ ప్రావిన్స్లో గుర్తించబడింది. వ్యాధి ఉన్న గ్రామాలు ఒకదానితో మరొకటి దూరంగా ఉన్నప్పటికీ, వ్యాధి ఎంతో వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు 419 కేసులు నమోదు కాగా, 53 మంది మరణించారు. వ్యాధి లక్షణాలు సర్వసాధారణంగా కనిపించడం వలన, మొదటగా ఇది ఎబోలాగా అనుమానించారు. కానీ, ల్యాబ్ టెస్టుల అనంతరం, ఈ వ్యాధి ఎబోలా కాకుండా, వేరే ఏదో కారణం వల్లే సంభవిస్తున్నట్లు తేలింది.
ఈ వ్యాధి ఎందుకు, ఎలా వ్యాపిస్తోంది, దాని అసలు కారణం ఏమిటి అన్న విషయంపై పరిశోధనలు జరుగుతున్నాయి. మెనింజైటిస్, టైఫాయిడ్, మలేరియా, ఫుడ్ లేదా వాటర్ పాయిజనింగ్, మరియు వైరల్ ఇన్ఫెక్షన్లు అన్నింటికీ సంబంధం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రత్యేక బృందాలను పంపి ఈ వ్యాధి విశ్లేషణను మొదలు పెట్టింది.
అక్కడే మొదటి కేసు..
కాంగోలోని బొలొకో అనే పట్టణంలో మొదటి కేసు నమోదు అయ్యింది. అక్కడ ముగ్గురు పిల్లలు ఈ వ్యాధి బారినపడ్డారు. వారు గబ్బిలం మాంసం తిన్నట్లు తేలింది. 48 గంటల తర్వాత వారు మరణించారు. అయితే, ఇతర ప్రాంతాల్లో కూడా ఈ వ్యాధి వ్యాపించడంతో, వ్యాధి యొక్క అసలు మూలం ఇంకా గుర్తించలేకపోయారు. ప్రపంచ దేశాలు ఈ వ్యాధిని చాలా జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నాయి. మరణాలు వేగంగా జరుగుతుండటం మరియు వ్యాధి ఎలా వ్యాపిస్తుందో తెలియకపోవడం, అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలకు పెద్ద సవాలుగా మారింది. ప్రస్తుతం WHO దీనిపై పరిశోధనలు జరుపుతోంది.



Click it and Unblock the Notifications