Latest Updates
-
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి!
ఆ చేపకు జీవం వస్తే యుగాంతమే.. ఆ చేప ఎక్కడుందో తెలుసా?
కలియుగం అంతానికి సమయం వచ్చేసింది అనే వార్తలు మనం వింటూ ఉంటాం. యాగంటి దేవాలయంలోని నందీశ్వరుడు పెరిగి రెంకలేస్తే కలియుగం అంతం అవుతుందని చెబుతూ ఉంటారు. అలాగే ఇంకో నానుడి ఉంది. అయితే అది బసవన్న కాదు.. ఒక చేప. ఆ శీలా చేపకు జీవం వస్తే కలియుగం అంతం అయినట్లే అని పెద్దలు, నిపుణులు చెబుతూ ఉంటారు.
ఆ ఆలయం ఎక్కడుంది? ఆ ఆలయం ప్రత్యేకతలేంటి అలాగే ఆ చేప ఎలాంటిది? ఎందుకు ఆ చేపకు జీవం వస్తే కలియుగం అంతం అవుతుంది అనేది ఈరోజు తెలుసుకుందాం
ఆ ఆలయం ఎక్కడుందంటే?
ఏపీలోని అన్నమయ్య జిల్లా నందలూరు మండల కేంద్రంలో ఆ ఆలయం ఉంది. అది సౌమ్యనాథ స్వామి దేవాలయం. ఈ ఆలయాన్ని 11వ శాతాబ్దంలో 108 స్తంభాలతో 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ ఆలయంలో 108 ప్రదిక్షణలు చేసి, సౌమ్యనాథ స్వామికి తమ కోరికలు కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతూ ఉంటారు.

ఈ ఆలయం చరిత్ర తెలుసుకుందామా?
ఈ సౌమ్యనాథ స్వామి ఆలయానికి విశేష చరిత్ర ఉంది. ఆలయ వాస్తుకళకు ఆదరణ పొందిన చోళ రాజవంశ పాలనలో ఈ ఆలయం నిర్మించబడిందని నమ్ముతారు. ఈ ఆలయ నిర్మాణం అద్భుతమైన ఆర్కిటెచర్తో జరిగింది. ఈ సౌమ్యనాథ స్వామి ఆలయంలోని గర్భగుడిలో ఎలాంటి దీపాలు లేకపోయినా.. ఆలయ మూల విరాట్టు ఉదయం నుంచి సాయంత్రం వరకు దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది.
ఈ ఆలయంలో శిల్పకళకు అమితంగా ప్రాధాన్యం ఇచ్చారు. ఈ ఆలయంలోని స్తంభాలపై మత్స్య, సింహ, తదితర శిల్పాలు చెక్కారు. వీటికి పురాణాల ప్రకారం అనేక ప్రాముఖ్యత నెలకొంది. ఈ ఆలయ స్తంభాలపై ఉండే మత్స్య ఆకారం.. కలియుగాంతానికి సంబంధం ఉందని చెబుతూ ఉంటారు.
కలియుగంతో చేపకు ఎలాంటి సంబంధం అంటే?
ఈ ఆలయంలోని చేప శిలకు అనేక ప్రత్యేకత ఉంది. కలియుగంలో రోజులు గడిచేకొద్దీ.. భారీగా వరదలు వస్తాయని, ఆ వరదలతో సౌమ్యనాథ్ స్వామి ఆలయం మునిగిపోతుందని, ఆ వరదలు రాతి స్తంభంపై ఉన్న రాతి చేప శిలను తాకగానే ఆ చేపకు జీవం వచ్చి ఆ వరదలో ఈదుతుందని, అప్పుడు యుగాంతం సంభవిస్తుందని నమ్మకం. ఇది పండితులతో పాటు అక్కడి స్థల పురాణం చెబుతుందని.. సౌమ్యనాథ స్వామిని కొలిచే భక్తులతో పాటు, అక్కడి స్థానికులు కూడా విశ్వసిస్తూ ఉంటారు.
అయితే ఆ చేపకు జీవం వస్తుందా లేదా, కలియుగం అంతం అవుతుందా లేదా అనేది శాస్త్రీయం. కాగా కలియుగాంతంపై అనేక కథలు ఉన్నాయి. పోతులూరి వీరభ్రహ్మేంద్ర స్వామి కూడా తన శ్లోకాల్లో ఎన్నో విధాలుగా వివరించారు. అందులో ఇదీ కూడా ఒకటి.



Click it and Unblock the Notifications