Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
ఆ చేపకు జీవం వస్తే యుగాంతమే.. ఆ చేప ఎక్కడుందో తెలుసా?
కలియుగం అంతానికి సమయం వచ్చేసింది అనే వార్తలు మనం వింటూ ఉంటాం. యాగంటి దేవాలయంలోని నందీశ్వరుడు పెరిగి రెంకలేస్తే కలియుగం అంతం అవుతుందని చెబుతూ ఉంటారు. అలాగే ఇంకో నానుడి ఉంది. అయితే అది బసవన్న కాదు.. ఒక చేప. ఆ శీలా చేపకు జీవం వస్తే కలియుగం అంతం అయినట్లే అని పెద్దలు, నిపుణులు చెబుతూ ఉంటారు.
ఆ ఆలయం ఎక్కడుంది? ఆ ఆలయం ప్రత్యేకతలేంటి అలాగే ఆ చేప ఎలాంటిది? ఎందుకు ఆ చేపకు జీవం వస్తే కలియుగం అంతం అవుతుంది అనేది ఈరోజు తెలుసుకుందాం
ఆ ఆలయం ఎక్కడుందంటే?
ఏపీలోని అన్నమయ్య జిల్లా నందలూరు మండల కేంద్రంలో ఆ ఆలయం ఉంది. అది సౌమ్యనాథ స్వామి దేవాలయం. ఈ ఆలయాన్ని 11వ శాతాబ్దంలో 108 స్తంభాలతో 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ ఆలయంలో 108 ప్రదిక్షణలు చేసి, సౌమ్యనాథ స్వామికి తమ కోరికలు కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతూ ఉంటారు.

ఈ ఆలయం చరిత్ర తెలుసుకుందామా?
ఈ సౌమ్యనాథ స్వామి ఆలయానికి విశేష చరిత్ర ఉంది. ఆలయ వాస్తుకళకు ఆదరణ పొందిన చోళ రాజవంశ పాలనలో ఈ ఆలయం నిర్మించబడిందని నమ్ముతారు. ఈ ఆలయ నిర్మాణం అద్భుతమైన ఆర్కిటెచర్తో జరిగింది. ఈ సౌమ్యనాథ స్వామి ఆలయంలోని గర్భగుడిలో ఎలాంటి దీపాలు లేకపోయినా.. ఆలయ మూల విరాట్టు ఉదయం నుంచి సాయంత్రం వరకు దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది.
ఈ ఆలయంలో శిల్పకళకు అమితంగా ప్రాధాన్యం ఇచ్చారు. ఈ ఆలయంలోని స్తంభాలపై మత్స్య, సింహ, తదితర శిల్పాలు చెక్కారు. వీటికి పురాణాల ప్రకారం అనేక ప్రాముఖ్యత నెలకొంది. ఈ ఆలయ స్తంభాలపై ఉండే మత్స్య ఆకారం.. కలియుగాంతానికి సంబంధం ఉందని చెబుతూ ఉంటారు.
కలియుగంతో చేపకు ఎలాంటి సంబంధం అంటే?
ఈ ఆలయంలోని చేప శిలకు అనేక ప్రత్యేకత ఉంది. కలియుగంలో రోజులు గడిచేకొద్దీ.. భారీగా వరదలు వస్తాయని, ఆ వరదలతో సౌమ్యనాథ్ స్వామి ఆలయం మునిగిపోతుందని, ఆ వరదలు రాతి స్తంభంపై ఉన్న రాతి చేప శిలను తాకగానే ఆ చేపకు జీవం వచ్చి ఆ వరదలో ఈదుతుందని, అప్పుడు యుగాంతం సంభవిస్తుందని నమ్మకం. ఇది పండితులతో పాటు అక్కడి స్థల పురాణం చెబుతుందని.. సౌమ్యనాథ స్వామిని కొలిచే భక్తులతో పాటు, అక్కడి స్థానికులు కూడా విశ్వసిస్తూ ఉంటారు.
అయితే ఆ చేపకు జీవం వస్తుందా లేదా, కలియుగం అంతం అవుతుందా లేదా అనేది శాస్త్రీయం. కాగా కలియుగాంతంపై అనేక కథలు ఉన్నాయి. పోతులూరి వీరభ్రహ్మేంద్ర స్వామి కూడా తన శ్లోకాల్లో ఎన్నో విధాలుగా వివరించారు. అందులో ఇదీ కూడా ఒకటి.



Click it and Unblock the Notifications