Latest Updates
-
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు! -
సూర్యగ్రహణం 2026..గ్రహణానికి ముందు, తర్వాత చేయాల్సిన పనులివే! -
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే! -
డెలులు డేటింగ్.. మీరూ ఇలాంటి భ్రమల్లో బతుకుతున్నారా.? -
పెనంపైనే రెస్టారెంట్ స్టైల్ లో.. దూదిలాంటి మెత్తని గార్లిక్ నాన్ చేసేయండిలా! -
మీ కళ్ల ముందే ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే ఏం చేయాలి?
ఆ చేపకు జీవం వస్తే యుగాంతమే.. ఆ చేప ఎక్కడుందో తెలుసా?
కలియుగం అంతానికి సమయం వచ్చేసింది అనే వార్తలు మనం వింటూ ఉంటాం. యాగంటి దేవాలయంలోని నందీశ్వరుడు పెరిగి రెంకలేస్తే కలియుగం అంతం అవుతుందని చెబుతూ ఉంటారు. అలాగే ఇంకో నానుడి ఉంది. అయితే అది బసవన్న కాదు.. ఒక చేప. ఆ శీలా చేపకు జీవం వస్తే కలియుగం అంతం అయినట్లే అని పెద్దలు, నిపుణులు చెబుతూ ఉంటారు.
ఆ ఆలయం ఎక్కడుంది? ఆ ఆలయం ప్రత్యేకతలేంటి అలాగే ఆ చేప ఎలాంటిది? ఎందుకు ఆ చేపకు జీవం వస్తే కలియుగం అంతం అవుతుంది అనేది ఈరోజు తెలుసుకుందాం
ఆ ఆలయం ఎక్కడుందంటే?
ఏపీలోని అన్నమయ్య జిల్లా నందలూరు మండల కేంద్రంలో ఆ ఆలయం ఉంది. అది సౌమ్యనాథ స్వామి దేవాలయం. ఈ ఆలయాన్ని 11వ శాతాబ్దంలో 108 స్తంభాలతో 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ ఆలయంలో 108 ప్రదిక్షణలు చేసి, సౌమ్యనాథ స్వామికి తమ కోరికలు కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతూ ఉంటారు.

ఈ ఆలయం చరిత్ర తెలుసుకుందామా?
ఈ సౌమ్యనాథ స్వామి ఆలయానికి విశేష చరిత్ర ఉంది. ఆలయ వాస్తుకళకు ఆదరణ పొందిన చోళ రాజవంశ పాలనలో ఈ ఆలయం నిర్మించబడిందని నమ్ముతారు. ఈ ఆలయ నిర్మాణం అద్భుతమైన ఆర్కిటెచర్తో జరిగింది. ఈ సౌమ్యనాథ స్వామి ఆలయంలోని గర్భగుడిలో ఎలాంటి దీపాలు లేకపోయినా.. ఆలయ మూల విరాట్టు ఉదయం నుంచి సాయంత్రం వరకు దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది.
ఈ ఆలయంలో శిల్పకళకు అమితంగా ప్రాధాన్యం ఇచ్చారు. ఈ ఆలయంలోని స్తంభాలపై మత్స్య, సింహ, తదితర శిల్పాలు చెక్కారు. వీటికి పురాణాల ప్రకారం అనేక ప్రాముఖ్యత నెలకొంది. ఈ ఆలయ స్తంభాలపై ఉండే మత్స్య ఆకారం.. కలియుగాంతానికి సంబంధం ఉందని చెబుతూ ఉంటారు.
కలియుగంతో చేపకు ఎలాంటి సంబంధం అంటే?
ఈ ఆలయంలోని చేప శిలకు అనేక ప్రత్యేకత ఉంది. కలియుగంలో రోజులు గడిచేకొద్దీ.. భారీగా వరదలు వస్తాయని, ఆ వరదలతో సౌమ్యనాథ్ స్వామి ఆలయం మునిగిపోతుందని, ఆ వరదలు రాతి స్తంభంపై ఉన్న రాతి చేప శిలను తాకగానే ఆ చేపకు జీవం వచ్చి ఆ వరదలో ఈదుతుందని, అప్పుడు యుగాంతం సంభవిస్తుందని నమ్మకం. ఇది పండితులతో పాటు అక్కడి స్థల పురాణం చెబుతుందని.. సౌమ్యనాథ స్వామిని కొలిచే భక్తులతో పాటు, అక్కడి స్థానికులు కూడా విశ్వసిస్తూ ఉంటారు.
అయితే ఆ చేపకు జీవం వస్తుందా లేదా, కలియుగం అంతం అవుతుందా లేదా అనేది శాస్త్రీయం. కాగా కలియుగాంతంపై అనేక కథలు ఉన్నాయి. పోతులూరి వీరభ్రహ్మేంద్ర స్వామి కూడా తన శ్లోకాల్లో ఎన్నో విధాలుగా వివరించారు. అందులో ఇదీ కూడా ఒకటి.



Click it and Unblock the Notifications