Latest Updates
-
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా?
సాఫ్ట్ వేర్ జాబ్ వదిలి బిజినెస్..కేవలం రూ. 3.5 లక్షల పెట్టుబడితో రూ.500 కోట్లు సంపాదించింది!
ఈ రంగం ఆ రంగం అని తేడా లేకుండా అన్ని రంగాల్లో మహిళలు దూసుకుపోతున్నారు. మగాళ్లతో సమానంగా అన్ని రంగాల్లో తమ సత్తా చూపెడుతున్నారు. పారిశ్రామిక రంగంలో కూడా మహిళ పాత్ర గత కొంతకాలంగా భారీగా పెరుగుతోంది. ఎన్నో పెద్ద పెద్ద బ్రాండ్ ల కంపెనీలకు సీఈవోలుగా,ఇతర ఉన్నత పదవులు చేపట్టడమే కాకుండా సొంతంగా కంపెనీలు కూడా పెద్ద వేల మందికి ఉపాధిని కల్పిస్తున్నారు. చాలా మంది మహిళలు తమ కృషి ఆధారంగా స్టార్టప్లలో విజయం సాధించారు. ఇలాంటివారిలో నిధి యాదవ్ ఒకరు.
23 ఏళ్ల వయస్సులో ఉద్యోగాన్ని వదిలి కేవలం రెండు గదుల ఇంట్లో బట్టల బిజినెస్ ప్రారంభించిన నిధి యాదవ్ నేడు కోట్ల విలువైన కంపెనీకి ఓనర్ గా మారింది. రూ.3.5 లక్షల పెట్టుబడితో ప్రారంభించిన ఆమె దుస్తుల బ్రాండ్ నేడు రూ.200 కోట్ల బ్రాండ్ విలువను కలిగి ఉంది, త్వరలో రూ.500 కోట్లు దాటవచ్చని సమాచారం.

నిధి యాదవ్ ఎవరు?
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ కు చెందిన నిధి యాదవ్ డెలాయిట్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసేది. కంప్యూటర్ ఇంజనీర్ గా వృత్తిని ప్రారంభించినప్పటికీ ఆమె మనస్సు ఎప్పూడూ ఫ్యాషన్ ప్రపంచం మీద ఉండేది. దీంతో ఆమె తన ఉద్యోగంతో సంతృప్తి చెందలేకపోయింది. తన అభిరుచిని కెరీర్గా మార్చుకోవడానికి నిధి ఉద్యోగానికి రాజీనామా చేసి ఫ్లోరెన్స్లోని పోలిమోడా ఫ్యాషన్ స్కూల్ లో ఒక సంవత్సరం కోర్సు కూడా చేసింది. ఆమెకి ఇటలీలో ఉద్యోగం కూడా వచ్చింది కానీ తన కుటుంబంతో కలిసి జీవించడానికి భారతదేశానికి తిరిగి రావాలని నిర్ణయించుకుంది.
తన కలను నెరవేర్చుకోవడానికి నిధి 2014 మే నెలలో 'Aks Clothings'పేరుతో ఒక కంపెనీని ప్రారంభించింది. అందులో ఆమె రూ. 3.5 లక్షలు పెట్టుబడి పెట్టింది. ఆ సమయంలో నిధి గురుగ్రామ్లోని డబల్ బెడ్ రూమ్ ఇంట్లో నివసించింది, ఆ ఫ్లాట్ లో ఆమె తన బట్టల బిజినెస్ ప్రారంభించింది. నిధి కంపెనీ 18- 35 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలకు సరసమైన ధరలకు దుస్తులను అందిస్తుంది
200 కోట్ల రూపాయల విలువైన కంపెనీ
కేవలం ఒక సంవత్సరంలోనే ఆ కంపెనీ రూ.8.50 కోట్ల ఆదాయాన్ని ఇచ్చింది. 2018లో కంపెనీ ఆదాయం రూ.48 కోట్లకు పెరిగింది. నిధి కష్టపడి పనిచేయడంతో ఐదు సంవత్సరాలలో కంపెనీ విజయం సాధించింది. 2019-2020 ఆర్థిక సంవత్సరంలో నిధి కంపెనీ రూ. 100 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించింది. 2021 సంవత్సరం చివరి నాటికి నిధి యాదవ్ కంపెనీ విలువ రూ.200 కోట్లకు పైగా పెరిగింది. కోవిడ్ కాలంలో బ్రాండ్ వృద్ధి 25 శాతం పెరిగింది.



Click it and Unblock the Notifications