Nithyananda swamy : నిత్యానంద స్వామి కన్నుమూత?

భారతదేశం వదిలి పారిపోయిన వివాదాస్పద ఆధ్యత్మిక గురువు నిత్యానంద స్వామి కన్నుమూసినట్లు వార్తలు వస్తున్నాయి. కొంతకాలంగా నిత్యానంద స్వామి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారని, దీంతో ఆరోగ్యం క్షీణించి ఆయన మరణించారని ఆయన సోదరి కుమారుడు సుందరేశ్వర్ ఓ వీడియోలో చెప్పినట్లు సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ వీడియో లింక్ మాత్రం ఎక్కడా లభించట్లేదు. ఇవాళ ఏప్రిల్ 1 కనుక ప్రజలను ఫ్యూల్స్ చేయడానికి అలాంటి ఫేక్ సమాచారాన్ని సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారా లేదంటే నిత్యానంద నిజంగానే మరణించారా అన్నది ఇంకా నిర్థారణ కావాల్సింది ఉంది.

తమిళనాడులోని తిరువణ్ణామలైకి చెందిన నిత్యానంద స్వామి కర్నాటకలోని బిడిది వెళ్లి ఆశ్రమం స్థాపించాడు. దేశంలోని వివిధ ప్రదేశాలలో కూడా ఆశ్రమాలను స్థాపించాడు. ఒక కన్నడ హీరోయిన్ తో నిత్యానంద రోమాన్స్ చేస్తున్న వీడియో బయటపడటంతో వివాదంలో చిక్కుకున్నాడు. తర్వాత మహిళా శిష్యులతో నిత్యానంద అసభ్యంగా, దురుసుగా ప్రవర్తించాడని ఆరోపణలు వచ్చాయి. బెంగళూరులో లైంగిక వేధింపుల కేసు నమోదైన తర్వాత అతను అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.

nithyananda swami died with health issues his sister son announces in a video

కిడ్నాప్ ,అత్యాచారం వంటి పలు ఆరోపణలు ఎదుర్కొంటూ 2019లో నిత్యానంద స్వామి దేశం విడిచి పారిపోయారు. ఆ తర్వాత కొద్దిరోజులకే ఆయన తనకంటూ ఓ సొంతదేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈక్వెడార్ దేశం సమీపంలో ఓ ఐలాండ్ ని కొనుగలు చేసిన నిత్యానంద దానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస(United States Of Kailasa)పేరు పెట్టారు. హిందువుల కోసం ఈ దేశం ఏర్పాటు చేశానని, ప్రత్యేక కరెన్సీ, పాస్‌పోర్ట్, జెండాను సృష్టించానని ప్రకటించాడు. తమిళనాడు ప్రజలు వచ్చి వ్యాపారం ప్రారంభించాలని నిత్యానంద ఆహ్వానించారు. కైలాస దేశం నుంచి నిత్యానంద ఆధ్యాత్మిక ప్రసంగాలు ఇస్తున్నట్లుగా కొన్ని వీడియోలు కూడా గతంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఐక్యరాజ్యసమితి ఇప్పటివరకు కైలాసను దేశంగా గుర్తించలేదు. 1933 మాంటెవీడియో ఒప్పందం ప్రకారం..ఏదైనా ఒక భూభాగాన్ని దేశం అని పిలవాలంటే, అది శాశ్వత జనాభా, ప్రభుత్వం, ఇతర దేశాలతో సంబంధాలను కలిగి ఉండే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. అంతర్జాతీయ వేదికలో తమ ఉనికిని తెలియజేసేందుకు, ఆమోదం పొందేందుకు నిత్యానంద కైలాస ప్రతినిధులను గతంలో ఒకసారి ఐక్యరాజ్యసమితికి పంపారు. అయితే నిత్యానంద తరపున వారు సమర్పించిన డాక్యుమెంట్స్ సంబంధం లేనివి అని అవి పరిగణించబడవని UN పేర్కొంది.

నిత్యానంద మరణించాడని ఇప్పుడు ప్రచారం జరుగుతున్న వేళ ఆయన పేరిట ఉన్న దాదాపు రూ.4 వేల కోట్లు ఇప్పుడు ఎవరికి దక్కుతాయి అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

DISCLIAMER: Bold Sky Telugu has not confirmed whether Nithyananda's death is real or not. We are bringing to your attention the propaganda going on on social media. Bold Sky Telugu does not take any responsibility for this.

Desktop Bottom Promotion