Latest Updates
-
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే! -
నేడు ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తోంది.. ఊహించని ధనలాభం మీ సొంతం!
లక్ అంటే నీదే గురూ: జస్ట్ రూ.39 పెట్టి..రూ.4 కోట్లు గెల్చుకున్నాడు
అదృష్టం ఎవరిని ఎప్పుడు ఏ రూపంలో వరిస్తుందో చెప్పలేం. కొన్నిసార్లు రోడ్డు మీద చెత్త ఏరుకునే వాళ్లు కూడా అదృష్టం కలిసొచ్చి రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోతుంటారు. కొంతమందికి లాటరీలో వందల కోట్లు వచ్చి పడుతుంటాయి. తాజాగా ఓ యువకుడికి రూ. 4 కోట్లు వచ్చి రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. అది కూడా కేవలం 39 రూపాయలు ఖర్చు పెట్టి రూ.4 కోట్లు గెల్చుకున్నాడు. దీంతో ఆ ప్రాంతంలో ఇదే హాట్ టాపిక్ గా మారింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కౌశాంబి జిల్లాలోని ఘసి రామ్ కా పూర్వ గ్రామంలో నివసించే మంగల్ సరోజ్ ఈ ఏడాది మార్చి నెల నుంచి డ్రీమ్ 11 లో గేమ్ ఆడటం ప్రారంభించాడు. ఏదో ఒక రోజు డ్రీమ్ 11లో కోట్లు గెలవాలని అనుకునేవాడు. ఈ క్రమంలో డబ్బులు పోతున్నా సరే డ్రీమ్ 11 గేమ్ ఆడుతూనే ఉన్నాడు. 77 ఏడుసార్లు డ్రీమ్ 11లో డబ్బులు పెట్టినా రాలేదు..అయితే 78వ సారి సరోజ్ ని అదృష్టం వరించింది. డ్రీమ్ 11లో 78వ సారి కేవలం రూ.39 పెట్టి గేమ్ ఆడి రూ.4 కోట్లు గెల్చుకున్నాడు. దీంతో డ్రీమ్ 11 లో కోట్లు సంపాదించాలనే సరోజ్ కల నెరవేరింది.

రాత్రికి రాత్రే సరోజ్ కోటీశ్వరుడయ్యాడని తెలుసుకున్న అతని బంధువులు,ఫ్రెండ్స్, గ్రామస్థులు అందరూ సరోజ్ కి అభినందనలు తెలిపేందుకు అతడి ఇంటికి క్యూ కట్టారు. సరోజ్ నివసించే గ్రామం అంతా పండగ వాతావరణం నెలకొంది. ఆ చుట్టు పక్కల గ్రామాల్లో కూడా సరోజ్ పేరు మార్మోగుతుంది.
వచ్చే డబ్బుతో ఆ పని
రెండు నెలల నుంచి రోజూ రూ. 49 పెట్టుబడి పెట్టి డ్రీమ్ 11లో గేమ్ ఆడేవాడినని..ప్రతి గేమ్ లో తాను ఓడిపోయానని,అయినా నిరుత్సాహపడకుంటా ప్రయత్నిస్తూనే ఉండేవాడినని మంగల్ సరోజ్ చెప్పాడు. ఏప్రిల్ 30న పంజాబ్, చెన్నై ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో తన అకౌంట్ లో చూసుకుంటే కేవలం రూ.39 రూపాయలు ఉన్నాయని,ఈ సారి కూడా ట్రై చేద్దామని ఆ రూ.39ని పంజాబ్, చెన్నై మ్యాచ్ లో పెట్టుబడిగా పెట్టానని..దీంతో తాను కలలో కూడా ఊహించని విధంగా రూ.4 కోట్లు తాను గెల్చుకున్నట్లు సరోజ్ చెప్పాడు.
సంతోషంలో తనకు మాటలు రావడం లేదని,అందరూ తనను అభినందిస్తున్నారని..ఇదంతా నిజంగా తన లక్ అని తెలిపారు. ట్యాక్సులు పోగా వచ్చే డబ్బుతో ఏ వ్యాపారం పెట్టుకొని బతుకుతానని చెప్పాడు. తన కుటుంబాన్ని హ్యాపీగా చూసుకుంటానని చెప్పాడు.
తండ్రి బ్యాక్ గ్రౌండ్ ఇదే
మంగల్ సరోజ్ ది పేద వ్యవసాయ కుటుంబం. తండ్రి కౌలుకి పొలం తీసుకొని వ్యవసాయం చేస్తుంటాడు. పొలంలో ఏ పంట పండించినా అందులో మూడింట ఒక వంతు పొలం యజమానికి ఇచ్చిన మిగిలిన దాంతో తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుటుంబంలోని 8మంది బాధ్యతను వ్యవసాయం చేసి కష్టపడుతూ చూసుకుంటున్నాడు. కొడుకు ఇప్పుడు కోట్లు గెల్చుకోవడంతో ఆనందంతో ఉబ్బి తబ్బిబైపోతున్నాడు.



Click it and Unblock the Notifications